India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

విజయనగరం జిల్లాలో వైసీపీకి మరో షాక్ తగలనుంది. ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ సోదరుడు బొత్స లక్ష్మణరావు జనసేనలో చేరనున్నారు. వచ్చే నెల 3న పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకోనున్నారు. ఈ మేరకు నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవితో మంగళవారం రాత్రి ఆయన భేటీ అయ్యారు. ఆయనతో పాటు నెల్లిమర్ల నియోజవర్గంలో పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు జనసేనలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

రెవిన్యూ శాఖలో వివిధ క్యాడర్లకు చెందిన 462 మందిని బదిలీ చేస్తూ విజయనగరం కలెక్టర్ అంబేడ్కర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 462 మందికి బదిలీ జరిగింది. బదిలీలు జరిగిన వారిలో MRO-1, DT -69, సీనియర్ అసిస్టెంట్-50, జూనియర్ అసిస్టెంట్-21, వీఆర్వో గ్రేడ్ I -238, వీఆర్వో గ్రేడ్ II-81, ఒక రికార్డ్ ఆసిస్టెంట్, ఆఫీస్ సబ్ ఆర్డినెటర్ ఉన్నారు.

అక్టోబరు 13న విజయనగరం ఉత్సవాల ప్రారంభ ర్యాలీని శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయం నుంచి ప్రారంభించి, అయోద్యా మైదానం వరకు నిర్వహించాలని కలెక్టర్ అంబేడ్కర్ మంగళవారం తెలిపారు. ఈ ర్యాలీని వివిధ జానపద కళారూపాలతో సుమారు 15వేల మందితో గొప్పగా నిర్వహించాలన్నారు. 13,14 తేదీల్లో 2 రోజులు సాయంత్రం మెగా కల్చరల్ ఈవెంట్ను నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో జేసీ ఎస్.సేతుమాధవన్ పాల్గొన్నారు.

AP మార్క్ ఫెడ్ ఛైర్మన్గా నూతనంగా నియమితులైన నెల్లిమర్ల టీడీపీ ఇన్ఛార్జ్ కుర్రోతు బంగార్రాజును విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నామినేటెడ్ పదవులలో సామాన్య కార్యకర్తలకు, యువతకు పెద్ద పీట కూటమి ప్రభుత్వం వేసిందన్నారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

నెల్లిమర్ల నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జ్ కర్రోతు బంగార్రాజుకు కీలక పదవి వరించింది. ఏపీ మార్క్ ఫెడ్ కార్పొరేషన్ ఛైర్మన్గా కర్రోతును నియమిస్తూ సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తొలి జాబితాలో 20 మంది ఆశావహులకు నామినేటెడ్ పదవులు వరించగా.. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఒక్క బంగార్రాజుకే అవకాశం దక్కింది. పదవులు కోసం ఎదురు చూస్తున్న పలువురికి తొలి జాబితాలో నిరాశ ఎదురైంది.

జిల్లావ్యాప్తంగా వైన్ షాపుల్లో పనిచేస్తున్న ఉద్యోగులు స్థానిక ఏపీ బేవరేజస్ కార్పొరేషన్ గోడౌన్ వద్ద మంగళవారం ఆందోళన చేపట్టారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. అసిస్టెంట్ మేనేజర్ కు వినతిపత్రం అందజేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎక్సయిజ్ సీఐ శ్రీనివాస్, నెల్లిమర్ల ఎస్సై గణేష్, సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.

విశాఖపట్నం-దుర్గ్ మధ్య నడుస్తున్న వందేభారత్ టికెట్ ధరలపై ప్రయాణీకులు పెదవి విరుస్తున్నారు. విశాఖ నుంచి విజయనగరానికి రూ.435, పార్వతీపురం-రూ.565, రాయగడ- రూ.640, రాయ్పూర్-రూ.1435, దుర్గ్కు రూ.1495 ఛార్జ్ చేస్తున్నారు. భారీగా ఉన్న ఈ ధరలతో వందే భారత్ ఎక్కేందుకు పెద్దగా ఆసక్తి చూపటం లేదని విమర్శలొస్తున్నాయి. ధరలు తగ్గించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. మరి ఈ టికెట్ రేట్లపై మీ కామెంట్

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలో అక్టోబర్ 3 నుంచి 13వ తేదీ వరకు శ్రీవేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి. 3న విష్వక్సేనారాధన, పుణ్యాహవచనంతో ఉత్సవాలు ప్రారంభమౌతాయి. 9వ తేదీన స్వామి వారి కళ్యాణం, 12వ తేదీన పూర్ణాహుతి, చక్రస్నానం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు. 13న వెంకటేశ్వర స్వామి వారి పుష్పయాగంతో ఉత్సవాలు ముగుస్తాయని ఆలయ ఈఓ శ్రీనివాసరావు తెలిపారు.

జిల్లా పరిషత్ లో పలువురు అధికారులకు బదిలీ అయ్యింది. జడ్పీ ఇన్ఛార్జి సీఈవోగా పనిచేస్తున్న శ్రీధర్ రాజా శ్రీకాకుళం జడ్పీ సీఈవోగా వెళ్లనున్నారు. ఆ స్థానంలో డ్వామా ఏవో సత్యనారాయణ రానున్నారు. డీపీవోగా శ్రీకాకుళం డీపీవో వెంకటేశ్వరరావు నియమితులయ్యారు. జడ్పీ డిప్యూటీ సీఈవో రాజ్ కుమార్కు విశాఖ జడ్పీ డిప్యూటీ సీఈవోగా బదిలీ అయ్యింది. ఆయన స్థానంలో శ్రీకాకుళం జడ్పీ డిప్యూటీ సీఈవో రమేష్ రామన్ రానున్నారు.

అమెరికా పర్యటనకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సోమవారం రాత్రి బయలుదేరి వెళ్లారు. అమెరికాలో 10 రోజుల పాటు పర్యటిస్తారని మంత్రి క్యాంపు కార్యాలయ వర్గాలు తెలిపాయి. గ్రామీణ మహిళల అభ్యున్నతికి పెట్టుబడులు తెచ్చే నిమిత్తం అక్కడి ప్రతినిధులతో సమావేశం కానున్నారు. అమెరికా పర్యటన అనంతరం అక్టోబర్ 3న జిల్లా కు ఆయన రానున్నారు.
Sorry, no posts matched your criteria.