Vizianagaram

News April 13, 2024

VZM: మే 24 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు

image

ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి జూన్ 1వ తేదీ వరకు జరుగుతాయని ఆర్ఐఓ మజ్జి ఆదినారాయణ తెలిపారు. ప్రతిరోజు ఉదయం 9నుంచి 12గంటల వరకు ఫస్టియర్, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30గంటల వరకు సెకండియర్ పరీక్షలు జరుగుతాయని చెప్పారు. ఈ నెల 18 నుంచి 24వ తేదీ వరకు పరీక్ష ఫీజు స్వీకరణ ప్రక్రియ జరుగుతుందన్నారు. మే 1 నుంచి 4వ తేదీ వరకు రెండు సెషన్లలో ప్రయోగపరీక్షలు జరుగుతాయన్నారు.

News April 13, 2024

మన్యం: ‘ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వహించాలి’

image

సాధారణ ఎన్నికల నిర్వహణలో లోపాలు, నిర్లక్ష్యం లేకుండా ప్రశాంతంగా జరిగేందుకు శిక్షణను సద్వినియోగం చేసుకోని సమర్ధంగా విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ప్రిసైడింగ్ అధికారులను ఆదేశించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పార్వతీపురం నియోజకవర్గ ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు అందిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం సందర్శించారు.

News April 12, 2024

పార్వతీపురం: ఇంటర్ ఒకేషనల్ కోర్సులో రాష్ట్రంలో ప్రథమ స్థానం

image

2024వ సంవత్సరం మార్చిలో జరిగిన ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలలో పార్వతీపురం మన్యం జిల్లాలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారని జిల్లా వృత్తి విద్యాధికారిని డి. మంజులవీణ తెలిపారు. ఇంటర్మీడియట్ ఒకేషనల్ కోర్సులు విభాగంలో పార్వతీపురం మన్యం జిల్లా రాష్ట్రంలో” ప్రథమ స్థానం”లో నిలిచిందని, జనరల్ కోర్సులలో 11వ స్థానంలో ఉందని తెలిపారు.

News April 12, 2024

కొమరాడ: గడ్డి మందు తాగి వ్యక్తి మృతి

image

గడ్డి మందు తాగి వ్యక్తి మృతి చెందిన సంఘటన కొమరాడ మండలం మాదలంగి గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై నీలకంఠం తెలిపిన వివరాల ప్రకారం.. మాదలంగి గ్రామానికి చెందిన అధికారి వెంకటేశ్ (32) మద్యానికి బానిసై రోజు మద్యం తాగేవాడు. కుటుంబ సభ్యులు మందలించారని మనస్తాపం చెంది ఇంట్లో ఉన్న గడ్డి మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు పార్వతీపురం జిల్లా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందాడు.

News April 12, 2024

కలెక్టరేట్లో సెల్ఫీ పాయింట్ ను ప్రారంభించిన కలెక్టర్

image

VZM : వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఎంతో విలువైన తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి కోరారు. మే 13న జరిగే ఎన్నికలకు జిల్లాలో ఏర్పాట్లు వేగవంతం చేసినట్లు ఆమె తెలిపారు. కలెక్టరేట్ పోర్టికోవద్ద ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ ను కలెక్టర్ నాగలక్ష్మి శుక్రవారం ప్రారంభించారు. ఈసందర్బంగా కొత్తగా ఓటు హక్కు పొందేందుకు మరో మూడు రోజులు మాత్రమే గడువు ఉందన్నారు.

News April 12, 2024

విశాఖలో విజయనగరం జిల్లా యువకుడు మృతి

image

విశాఖలోని సిరిపురం శ్రీలక్ష్మి గణపతి ఆలయం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం చెందాడు. ద్విచక్రవాహనాన్ని కావేరి ట్రావెల్స్ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో విజయనగరం జిల్లా వేపాడ మండలానికి చెందిన రాజకుమార్(30) అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కావేరి ట్రావెల్స్ బస్సు డ్రైవర్ క్లీనర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ట్రాఫిక్ సీఐ అమ్మి నాయుడు కేసు దర్యాప్తు చేపట్టారు.

News April 12, 2024

మన్యం: మొదటి రేండమైజేషన్ పూర్తి

image

జిల్లాలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ మొదటి రేండమైజేషన్ శుక్రవారం పూర్తి అయ్యింది. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు సమక్షంలో జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్ కుమార్ నేతృత్వంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రేండమైజేషన్ చేపట్టారు. జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి రేండమైజేషన్ విధానాన్ని వివరించారు. రేండమైజేశన్ ద్వారా ఏ ఈవీఎం ఏ నియోజక వర్గానికి వెళుతుందో వివరించారు.

News April 12, 2024

పార్వతీపురం 11వ స్థానం.. విజయనగరం 13వ స్థానం

image

➠ విజయనగరంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు 16,584 మందికి 10,267 మంది పాసయ్యారు. 62%తో రాష్ట్రంలో 13వ స్థానంలో నిలిచింది. సెకండియర్‌లో 15,180 మందికి 10,591 మంది పాసయ్యారు. 70%తో 21వ స్థానంలో ఉంది.
➠ పార్వతీపురం మన్యం జిల్లాలో ఫస్ట్ ఇయర్‌లో 5,475 మందికి 3,565 మంది ఉత్తీర్ణత సాధించారు. 65 శాతంతో 11వ స్థానంలో ఉంది. సెకండ్ ఇయర్‌లో 5,292 మంది రాయగా..4,054 మంది పాసయ్యారు. 77%తో 11వ స్థానంలో ఉంది.

News April 12, 2024

పార్వతీపురం మన్యం జిల్లాలో పరీక్ష రాసిన 19,856 మంది

image

ఈరోజు 11 గంటలకు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షా ఫలితాలు విడుదల కానున్నాయి. మార్చి 1 నుంచి 20 వరకు జరిగిన పరీక్షల్లో పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన 19,856 మంది విద్యార్థులు పరీక్షలకు హాల్ టికెట్లు ఇచ్చారు. వీరిలో 19,791 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో రెగ్యులర్ విద్యార్థులు 17,268 మంది కాగా.. సప్లమెంటరీ రాసినవారు 2,588 మంది ఉన్నారు.

News April 12, 2024

విజయనగరం జిల్లాలో పరీక్ష రాసిన 45,755 మంది

image

ఈరోజు 11 గంటలకు ఇంటర్ ప్రథమ, ద్వితీయ పరీక్షా ఫలితాలు విడుదల కానున్నాయి. మార్చి 1 నుంచి 20 వరకు జరిగిన పరీక్షల్లో విజయనగరం జిల్లాకు చెందిన 45,755 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. 45,755 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో ప్రథమ సంవత్సర విద్యార్థులు 20,630 మంది కాగా.. ద్వితీయ సంవత్సరం చదువుతున్నవారు 25,125 మంది ఉన్నారు.