India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తుఫాను హెచ్చరికల దృశ్య పార్వతిపురం పురపాలక సంఘ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. రానున్న రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజలను కోరుతున్నారు. అత్యవసర పరిస్థితులు ఏర్పడితే తక్షణమే 08963221053 కంట్రోల్ రూమ్ నంబర్కు ఫోన్ చేయాలన్నారు.

తుఫాను హెచ్చరికల దృశ్య పార్వతిపురం పురపాలక సంఘ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. రానున్న రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజలను కోరుతున్నారు. అత్యవసర పరిస్థితులు ఏర్పడితే తక్షణమే 08963221053 కంట్రోల్ రూమ్ నంబర్కు ఫోన్ చేయాలన్నారు.

కొత్తవలస పోలీస్ స్టేషన్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న కె వెంకటేశులు శనివారం మధ్యాహ్నం ఇంటివద్ద మృతిచెందారు. ఆయన తనయుడి వివరాల ప్రకారం.. కొత్తవలసలో విధులు నిర్వహిస్తున్న కాలంలో మంచి గుర్తింపు పొందాడని, ఇదివరకు విశాఖ నగర పోలీస్ కంట్రోల్ రూంలో కూడా విధులు నిర్వహిస్తూ కొత్తవలస స్టేషన్కు బదిలీపై వచ్చారన్నారు. ఆయన అంత్యక్రియలు రేపు పాడేరులో నిర్వహిస్తామని వివరించారు.

విజయవాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శనివారం జరిగిన వినాయక చవితి పూజలలో ఉమ్మడి విజయనగరం జిల్లా మంత్రులు గుమ్మిడి సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. వినాయక మండపంలో ప్రత్యేక పూజలు చేపట్టి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. రాష్ట్రంలోని ప్రజలు అందరు సుభిక్షంగా ఉండాలని కోరుతూ ప్రత్యేక పూజలు చేపట్టామని మంత్రి సంధ్యారాణి తెలిపారు.

శృంగవరపుకోట పోలీస్ స్టేషన్ పరిధిలో 2018లో నమోదైన పోక్సో కేసు ముద్దాయికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.11,500 జరిమానాను కోర్టు విధించినట్లు ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. గంట్యాడ మండలం పెంట శ్రీరాంపురం గ్రామానికి చెందిన గంధవరపు గోపి అనే వ్యక్తి ఓ మైనర్ బాలికకు మాయ మాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడ్డాడనే ఫిర్యాదుతో దర్యాప్తు చేయగా నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి నాగమణి తీర్పు చెప్పారన్నారు.

సరుకు రవాణాలో విశాఖ పోర్టు సత్తా చాటుతూ సరికొత్త రికార్డులను సృష్టిస్తుంది. గత ఏడాది 35 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్గోను రవాణా చేయడానికి 163 రోజులు పట్టగా ఈ ఏడాది 149 రోజుల్లో ఈ లక్ష్యాన్ని చేరుకున్నట్లు పోర్ట్ ట్రస్ట్ అథారిటీ ఛైర్మన్ అంగముత్తు తెలిపారు. ఈ ఏడాది 90 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్గోను రవాణా చేయాలని లక్ష్యంతో ముందుకు వెళుతున్నట్లు పేర్కొన్నారు.

డి.ఆర్.డి.ఎ-సీడ్ ఏపీ ఆధ్వర్యంలో స్కిల్ కాలేజ్ లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పీడీ కళ్యాణ్ చక్రవర్తి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 9వ తేదీ ఉదయం 10గం.లకు టీటీడీసి మహిళా ప్రాంగణంలో సంబంధిత సర్టిఫికెట్లుతో హాజరుకావలన్నారు. ప్రొడక్షన్ కెమిస్ట్, జూనియర్ స్టోర్ కీపర్, సెక్యూరిటీ ఆఫీసర్ కోర్సులకు సంబంధించి 4 నెలల శిక్షణ ఉంటుంది.

రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని విజయనగరం కలెక్టర్ డా.బి.ఆర్.అంబేడ్కర్ ఆదేశించారు. అన్ని మండల కేంద్రాలలో, ఆర్.డి.ఓ కార్యాలయంలో కంట్రోల్ రూమ్లు 24/7 పనిచేయాలని సూచించారు. అలాగే క్షేత్ర స్థాయి సిబ్బంది నిత్యం పర్యటిస్తూ ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్త వహించాలన్నారు.

అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో పాచిపెంట మండలంలో అన్ని పాఠశాలలకు శుక్రవారం సెలవు ప్రకటించారు. ఈ మేరకు రెవిన్యూ డివిజనల్ అధికారి కే.హేమలత గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పాచిపెంట తహశీల్దార్, మండల విద్యాశాఖ అధికారి సిఫార్సుల మేరకు సెలవు ప్రకటించినట్లు ఆమె తెలిపారు.

డెంకాడ మండలంలోని చింతలవలస గ్రామంలో MVGR ఇంజినీరింగ్ కళాశాలకు సమీపంలో ఉన్న నీలగిరి తోటలో గంజాయి విక్రయిస్తున్న, తాగుతున్న ఏడుగురిని అరెస్టు చేశామని ఎస్పీ వకుల్ జిందల్ గురువారం తెలిపారు. స్థానిక పోలీసులు వచ్చిన పక్కా సమాచారం మేరకు రైడ్ చేయగా గంజాయి అమ్ముతున్న ముగ్గురితో పాటు, తాగుతున్న మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారని, వారి వద్ద నుండి 2 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారని తెలిపారు.
Sorry, no posts matched your criteria.