Vizianagaram

News May 4, 2024

సింహాచలంలో గంధం అరగదీత ప్రారంభం

image

సింహాచలం ఆలయంలో ఈనెల 10వ తేదీన జరిగే చందనోత్సవానికి ఆలయంలో గంధం అరగదీతను ఆలయ అర్చకులు వేద పండితులు శనివారం ఉదయం సంప్రదాయపద్ధంగా ప్రారంభించారు. ముందుగా పూజలు నిర్వహించారు. తొలి విడత అప్పన్న బాబుకు సమర్పించడానికి అవసరమైన 120 కిలోల గంధాన్ని అరగదీసి దానికి సుగంధ ద్రవ్యాలు మిళితం చేసి ఆలయ భాండాగారంలో భద్రపరుస్తారు. చందనోత్సవ రోజున ఈ గంధాన్ని సింహాద్రి అప్పన్నకు సమర్పిస్తారు.

News May 4, 2024

ఈనెల 9న చీపురుపల్లికి చంద్రబాబు 

image

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఈనెల 9న చీపురుపల్లిలో నిర్వహించే ప్రజాగళం ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారని ఆ పార్టీ విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు కిమిడి నాగార్జున తెలిపారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి సమాచారం అందిందన్నారు. ఆరోజు సాయంత్రం 4 గంటలకు చీపురుపల్లి పట్టణంలో బహిరంగ సభలో ఆయన పాల్గొంటారని, విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

News May 4, 2024

మన్యం: జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్

image

భారత ఎన్నికల కమీషన్ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పార్వతీపురం మన్యం జిల్లా నుంచి జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎస్పీ విక్రాంత్ పాటిల్, పార్లమెంటరీ నియోజకవర్గ సాధారణ పరిశీలకులుగా ప్రమోద్ కుమార్, పార్లమెంటరీ నియోజకవర్గ పోలీస్ పరిశీలకులు నయీం ముస్తఫా మన్సూరి, తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో చేపట్టిన ఎన్నికల ఏర్పాట్లను, పర్యవేక్షణను వివరించారు.

News May 3, 2024

11వ తేదీలోగా పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేయాలి: కలెక్టర్ నాగలక్ష్మి

image

ఈ నెల 11వ తేదీ నాటికే పోలింగ్ కేంద్రాలను అన్ని వ‌స‌తుల‌తో సిద్ధం చేయాల‌ని జిల్లా ఎన్నిక‌ల అధికారి, క‌లెక్ట‌ర్ నాగ‌ల‌క్ష్మి ఆదేశించారు. తాగునీరు, విద్యుత్‌, ర్యాంపులు, మ‌రుగుదొడ్లు, నేమ్ బోర్డుల‌తో సిద్ధంగా ఉంచాల‌ని చెప్పారు. తహశీల్దార్లు, ఎంపీడీఓలు, ఇత‌ర ఎన్నిక‌ల అధికారుల‌తో శుక్ర‌వారం సాయంత్రం క‌లెక్ట‌రేట్ నుంచి వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు.

News May 3, 2024

బాలకృష్ణ వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రి బొత్స

image

చీపురుపల్లి ఎన్నికల రోడ్‌షో‌లో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శుక్రవారం తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తండ్రి పేరు చెప్పుకొని బ్రతికే బాలకృష్ణ తమ గురించి మాట్లాడటమేంటని ప్రశ్నించారు. గడిచిన ఐదేళ్లలో విద్యావ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చామని, తెలుసుకోవాలని హితవు పలికారు. పింఛన్లు ఆపేసిన పాపం ఊరికే పోదన్నారు.

News May 3, 2024

విజయనగరం గ్రామ సంస్థానికి 1937లో తొలిసారి ఎన్నికలు

image

జమీందారీ వ్యవస్థలు ఉన్నప్పుడు 1937 ఫిబ్రవరి 9న తొలిసారి విజయనగరం గ్రామ సంస్థానానికి ఎన్నిక నిర్వహించారు. విజయనగరం సంస్థానాదీశులు మీర్జా రాజా పూసపాటి అలకనారాయణ గజపతి మహారాజు నీలిరంగు పెట్టె గుర్తుతో బరిలో దిగారు. అప్పట్లో ఆయన్ను గెలిపించాలని కోరుతూ విజయనగరం సంస్థాన మార్‌గుజారీమాన్యమ్‌ ఇనాందార్లు కట్టోజు పెద్దగంగరాజు, జి.వీర్రాజునాయుడు పంచిన కరపత్రాన్ని మనం పై ఫొటోలో చూడొచ్చు.

News May 3, 2024

విజయనగరంలో నారా లోకేశ్ పర్యటన ఖరారు

image

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల6న నారా లోకేశ్ విజయనగరం రానున్నారు. ఆరోజు జరిగే యువగళం కార్యక్రమంలో ఆయన పాల్గొంటారని టీడీపీ నాయకులు తెలిపారు. సాయంత్రం నాలుగు గంటలకు నగరానికి చేరుకొని సాయంత్రం ఆరు గంటల వరకు ఉంటారు. ఇక్కడ సభ అనంతరం శ్రీకాకుళం వెళ్లనున్నారు. ఇప్పటికే ఈనియోజకవర్గంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, బాలకృష్ణ ప్రచారం చేశారు.

News May 3, 2024

ఏనుగుల బెడద తప్పిస్తాం: నితిన్ గడ్కరీ

image

కేంద్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ పార్వతీపురంలో గురువారం పర్యటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్డీఏ అభ్యర్థి కొత్తపల్లి గీతతో కలిసి చినబొండపల్లిలో జరిగన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మన్యం జిల్లాలో ఏనుగుల బెడద తప్పిస్తామని హామీ ఇచ్చారు. అరకు పార్లమెంట్‌ పరిధిలో రోడ్లు, నీళ్లు, విద్యుత్తు, కమ్యూనికేషన్ మొదలగు వాటికి అధిక ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు.

News May 3, 2024

విజయనగరం కేంద్రంగా నకిలీ నగదు, బంగారం ముఠా..!

image

నకిలీ డబ్బు, బంగారంతో మోసగిస్తున్న ముఠాను మధురవాడ పోలీసులు రెస్టు చేశారు. పట్టుబడ్డ నిందితుల్లో హేమచంద్రరావు, హరి శ్రీను, హేమంత్ కుమార్, ఎం.సుబ్బారెడ్డి, డి.శ్రీనివాస్, జన్న సునీల్ ఉన్నారు. వారి వద్ద నుంచి నకిలీ రూ.500 నోట్లు, బంగారం బిస్కెట్లు, నాణేలు, 23 చరవాణులు, ల్యాప్ టాప్, రూ.1000, వివిధ మారణాయుధాలు, కారు, బైక్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులు విజయనగరం నుంచి విశాఖ వెళ్తుండగా పట్టుబడ్డారు.

News May 3, 2024

సూక్ష్మ పరిశీలకుల శిక్షణ ర్యాండమైజేషన్ పూర్తి: మన్యం కలెక్టర్

image

సాధారణ ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు నియమించిన సూక్ష్మ పరిశీలకుల (మైక్రో అబ్జర్వర్ల) శిక్షణ ర్యాండమైజేషన్ గురువారం పూర్తి చేసారు. కలెక్టరేట్‌లో పార్లమెంటరీ నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు ప్రమోద్ కుమార్ మెహార్థ సమక్షంలో, జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సూక్ష్మ పరిశీలకుల శిక్షణ ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేశారు.