Vizianagaram

News September 20, 2025

VZM: స్త్రీశక్తి పథకానికి విశేష స్పందన

image

విజయనగరం జిల్లాలో స్త్రీ శక్తి పథకం ప్రారంభించిన నెల రోజుల్లో 13,35,656 మంది మహిళలు ఉచిత ప్రయాణాన్ని వినియోగించుకున్నారని జిల్లా ప్రజా రవాణా అధికారి జి.వరలక్ష్మి తెలిపారు. మహిళా ప్రయాణికుల సంఖ్య 65% పెరిగిందని, 4 రకాల బస్సుల్లో మొత్తం జీరో టిక్కెట్ రూ.4,85,01,735 అయినట్లు చెప్పారు. మహిళా ప్రయాణికులు క్రమంగా పెరుగుతుండగా పురుషుల సంఖ్య తగ్గుతుందని పేర్కొన్నారు.

News September 20, 2025

శృంగవరపుకోటలో మెగా జాబ్ మేళా

image

ఎస్.కోట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జవహర్ నాలెడ్జ్ సెంటర్, నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శనివారం మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ శంకరరావు తెలిపారు. పదో తరగతి నుంచి పీజీ పూర్తి చేసి, 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉన్నవారు అర్హులని పేర్కొన్నారు. 12 కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు చేస్తారన్నారు. ఉదయం 9 గంటలకు విద్యార్హత ధ్రువపత్రాలు, ఆధార్ కార్డు, ఫొటోలతో హాజరుకావాలని కోరారు.

News September 20, 2025

దీపం-2 పథకం అమలుపై విజయనగరం జేసీ సమీక్ష

image

కలెక్టరేట్లో జేసీ సేతుమాధవన్ అధ్యక్షతన దీపం-2 పథకం అమలుపై శుక్రవారం సమావేశం నిర్వహించారు. సబ్సిడీ నగదు వినియోగదారుల ఖాతాలలో జమ కానందుకు ఆధార్-బ్యాంక్ లింక్ సమస్యలు, ఖాతాలు బ్లాక్ కావడం ప్రధాన కారణాలని ఆయన తెలిపారు. గ్యాస్ ఏజెన్సీ డీలర్లు వీటిని పరిష్కరించి లబ్ధిదారులకు సబ్సిడీ చేరేలా చర్యలు తీసుకోవాలని జేసీ ఆదేశించారు. అదనపు డబ్బులు వసూలు చేసే డెలివరీ బాయ్స్‌పై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

News September 20, 2025

విజయనగరంలో హైకోర్టు జడ్జిల పర్యటన

image

విజయనగరంలో పర్యటన నిమిత్తం ఏపీ హైకోర్టు జడ్జిలు జస్టిస్ చీమలపాటి రవి, జస్టిస్ వై.లక్ష్మణరావు శుక్రవారం రాత్రి జిల్లాకు చేరుకున్నారు. నగరానికి చేరుకున్న ఇద్దరు జడ్జిలను కలెక్టర్ ఎస్.రామ సుందర రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. కార్యక్రమంలో పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.

News September 20, 2025

శృంగవరపుకోటలో మెగా జాబ్ మేళా

image

ఎస్.కోట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జవహర్ నాలెడ్జ్ సెంటర్, నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శనివారం మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ శంకరరావు తెలిపారు. పదో తరగతి నుంచి పీజీ పూర్తి చేసి, 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉన్నవారు అర్హులని పేర్కొన్నారు. 12 కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు చేస్తారన్నారు. ఉదయం 9 గంటలకు విద్యార్హత ధ్రువపత్రాలు, ఆధార్ కార్డు, ఫొటోలతో హాజరుకావాలని కోరారు.

News September 19, 2025

VZM: ఉద్యోగుల నుంచి 40 వినతులు స్వీకరణ

image

విజయనగరం కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన ఉద్యోగుల గ్రీవన్స్‌కు ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నుంచి 40 వినతులు అందాయి. ఈ వినతులను కలెక్టర్, JC సేతు మాధవన్, RDO శ్రీనివాస మూర్తి స్వీకరించగా జిల్లా అధికారులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన సమావేశంలో కలెక్టర్ రామసుందర రెడ్డి మాట్లాడుతూ.. అందిన వినతుల్లో జిల్లా స్థాయిలో ఉన్నవి పరిష్కరించాలని, కానివి రాష్ట్ర స్థాయికి పంపాలన్నారు.

News September 19, 2025

తెర్లాం: తండ్రిని చంపిన కసాయి కొడుకు

image

క్షణికావేశంలో కన్న తండ్రినే చంపాడు కసాయి కొడుకు. తెర్లాం (M) ఎంఆర్.అగ్రహారానికి చెందిన అప్పలస్వామికి ఇద్దరు కొడుకులు. తన గురించి ఊరంతా చెడుగా చెబుతున్నాడంటూ చిన్న కుమారుడు శంకరరావు తండ్రితో వాగ్వాదానికి దిగాడు. ఈక్రమంలోనే కోపంలో రాయితో కొట్టాడు. తీవ్రంగా గాయపడిన అప్పలస్వామిని మనవరాలు కల్పన ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. ఆమె ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

News September 19, 2025

VZM: రానున్న 20 రోజులు ఎరువుల సరఫరా కీలకం: కలెక్టర్

image

రానున్న 20 రోజులు ఎరువులు సరఫరా కీలకమని మండల వ్యవసాయాధికారులు, తహశీల్దార్లు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డి ఆదేశించారు. జిల్లాలో ఎరువులు లభ్యత, సరఫరాపై మండల వ్యవసాయాధికారులు, తహశీల్దార్లతో కలెక్టర్ గురువారం సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రైవేట్ ఎరువుల దుకాణాలలో తనిఖీలు నిర్వహించి వారి వద్ద ఉన్న ఎరువుల నిల్వలను తక్షణ అవసరం ఉన్న ప్రాంతాలకు సరఫరా చేయాలన్నారు.

News September 19, 2025

DSP శ్రీనివాసరావుకు బదిలీ

image

VZM సబ్ డివిజన్ DSP శ్రీనివాసరావును వీఆర్‌కు బదిలీ చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనపై పలు అవినీతి ఆరోపణలు, ఫిర్యాదులు రావడంతో ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇంటెలిజెన్స్‌ విభాగం, పోలీస్‌ ఉన్నతాధికారులు DSPవ్యవహారాలపై సమగ్రంగా విచారణ జరిపిన అనంతరం చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది. ఉమెన్ PS DSPగా పనిచేస్తున్న గోవిందరావుకు ఇన్‌ఛార్జ్ DSPగా బాధ్యతలు అప్పగించారు.

News September 19, 2025

భోగాపురం విమానాశ్రయ భూములపై కలెక్టర్ ఆరా

image

భోగాపురం అంత‌ర్జాతీయ‌ విమానాశ్ర‌యం, జాతీయ ర‌హ‌దారులు, రైల్వే ప్రాజెక్టుల భూసేక‌ర‌ణ‌పై క‌లెక్ట‌రేట్లో సంబంధిత అధికారుల‌తో కలెక్టర్ రామసుందర రెడ్డి గురువారం స‌మీక్షా నిర్వ‌హించారు. ఇప్ప‌టివ‌ర‌కు జిఎంఆర్‌కు అప్ప‌గించిన 2,200 ఎక‌రాల భూముల ప‌రిస్థితి, వాటికి సంబంధించిన స‌మ‌స్య‌లు తెలుసుకున్నారు. విమాన‌యాన అనుబంధ ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటు కోసం కేటాయించిన 540 ఎక‌రాల భూములపై ఆరా తీశారు.