Vizianagaram

News June 27, 2024

పార్వతీపురం: ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

image

పార్వతీపురం మన్యం జిల్లాలోని గరుగుబిల్లి మండలం రావివలస సచివాలయంలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న అల్లు తిరుపతినాయుడు ఏసీబీకి చిక్కాడు. గ్రామానికి చెందిన తిరుపతి అనే వ్యక్తికి కాంట్రాక్టు బిల్లుల నిమిత్తం రూ.20వేలు లంచం డిమాండ్ చేయగా.. సదరు బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. బాధితుని ఫిర్యాదు మేరకు కార్యదర్శిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

News June 27, 2024

గిరిజన గ్రామాలకు ఫీడర్ అంబులెన్సులు: మంత్రి

image

గిరిజన గ్రామాలకు ఫీడర్ అంబులెన్సులు ఏర్పాటు చేస్తామని మంత్రి గుమ్మిడి సంధ్యా రాణి తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. గిరిజనుల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యమివ్వాలని అధికారులను ఆదేశించారు. ఆరోగ్య కేంద్రాలు, ఉప ఆరోగ్య కేంద్రాలలో మందులు అందుబాటులో ఉండేలా పూర్తి చర్యలు చేపట్టాలని సూచించారు. పీహెచ్సీ వైద్యులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు.

News June 27, 2024

VZM: మేడమీద నుంచి కిందపడి వ్యక్తి మృతి

image

మెరకముడిదాం మండలం చిన్నమంజిరిపేట గ్రామానికి చెందిన రాగోలు మహేశ్(38) పెయింటింగ్ పనులు చేస్తుంటాడు. బాడంగి మండలంలోని గజరాయునివలస గ్రామంలో ఓ ఇంటికి పెయింటింగ్ వెయ్యడానికి బుధవారం వెళ్లాడు. అక్కడ రెండో అంతస్థులో పెయింటింగ్ వేస్తుండగా తాడు తెగిపోవడంతో ప్రమాదవశాత్తు కిందపడి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదుతో ఎస్.ఐ జయంతి కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

News June 27, 2024

నేడు పార్వతీపురం రానున్న మంత్రి గుమ్మడి సంధ్యారాణి

image

రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా గుమ్మడి సంధ్యా రాణి బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్వతీపురం కలెక్టర్ కార్యాలయానికి గురువారం ఉదయం 10 గంటలకు రానున్నారు. ముందుగా పార్టీ నాయకులతో సమావేశం అవుతారు. ఆ తర్వాత కలెక్టర్ కార్యాలయంలో జిల్లా స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి.

News June 26, 2024

12వ స్థానంలో పార్వతీపురం.. విజయనగరం@18

image

పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా 72.27 శాతం ఉత్తీర్ణతతో 12వ స్థానంలో నిలిచింది. 440 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 318 మంది పాసయ్యారు. విజయనగరం జిల్లాలో 2,748 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 1,711 మంది ఉత్తీర్ణత సాధించారు. 62.26 శాతం పాస్ పర్సంటేజ్‌తో రాష్ట్రంలో 18వ స్థానంలో నిలిచింది.

News June 26, 2024

విశాఖ టెక్ మ‌హీంద్రాలో ఉద్యోగ అవకాశాలు

image

విశాఖలో టెక్ మహీంద్రాలో 328 ఉద్యోగాల భర్తీ కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి డి.అరుణ తెలిపారు. ఈనెల 29న విశాఖ‌ప‌ట్నంలోని డా. విఎస్ కృష్ణా ప్ర‌భుత్వ డిగ్రీ క‌ళాశాల‌లో జాబ్ మేళా జ‌రుగుతుంద‌న్నారు. ఆస‌క్తి ఉన్న అభ్యర్థులు తమ పేర్లను సంబంధిత వెబ్‌సైట్‌లో ఈనెల 28లోగా న‌మోదు చేసుకోవాల్సి ఉంటుంది. డిగ్రీ పాస్/ఫెయిల్ అయిన వారు అర్హులు. ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఉన్న వాళ్లకి ప్రాధాన్యత.

News June 26, 2024

విద్యార్థుల సంఖ్య ఎందుకు తగ్గింది?

image

విజయనగరం జిల్లాలో పురుషుల కంటే మ‌హిళ‌ల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ, విద్యార్థుల్లో బాలికల నిష్పత్తి ఎందుకు త‌గ్గుతోంద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ బిఆర్ అంబేద్క‌ర్ ప్ర‌శ్నించారు. దీనిపై అధ్య‌య‌నం చేసి, వారం రోజుల్లో త‌న‌కు నివేదిక స‌మ‌ర్పించాల‌ని విద్యాశాఖ‌ను ఆదేశించారు. విద్య‌, అనుబంధ‌ సంక్షేమ వసతిగృహాలపై తన ఛాంబర్‌లో బుధవారం సమీక్షించారు.

News June 26, 2024

సాలూరు ప్రజలకు రైలు సౌకర్యం ఎప్పుడు?

image

సాలూరు నుంచి ఒడిశా, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలకు 6 లైన్ల రహదారి తయారవుతుంది కానీ.. రైలు పట్టాలు సరిచేయడం లేదు. విద్యుదీకరణ పూర్తయి ఏళ్లు గడుస్తున్నా రైలు మాత్రం పట్టాలెక్కడం లేదు. గత దసరాకు సాలూరు నుంచి విశాఖకు రైలు వేస్తున్నామని ట్రైల్ రన్ కూడా నిర్వహించారు. కానీ ఇంతవరకు రియల్ రన్ లేదు. కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం కేంద్రంతో చర్చించి ఈ సమస్య పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

News June 26, 2024

త్వరలో నామినేటెడ్ పదవులు.. రేసులో ఉన్నదెవరు?

image

త్వరలోనే నామినేటెడ్ పదువులు భర్తీ చేస్తామని సీఎం చంద్రబాబు ఇటీవల ప్రకటించారు. గెలుపు కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో టికెట్ ఆశించిన భంగపడ్డ పలువురు నేతలకు సైతం అధిష్ఠానం నామినేటెడ్ పోస్టులు ఇస్తామని చెప్పినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. మరి ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఎవరికి ఏ నామినేటెడ్ పదవి వస్తుందని మీరు భావిస్తున్నారో కామెంట్ చెయ్యండి.

News June 26, 2024

మూడో స్థానంలో పార్వతీపురం.. 8వ స్థానంలో విజయనగరం

image

ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా 53 శాతం ఉత్తీర్ణతతో మూడో స్థానంలో నిలిచింది. 1,679 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 884 మంది పాసయ్యారు. విజయనగరం జిల్లాలో 5,673 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 2,502 మంది ఉత్తీర్ణత సాధించారు. 44 శాతం పాస్ పర్సంటేజ్‌తో రాష్ట్రంలో 8వ స్థానంలో నిలిచింది.