Vizianagaram

News February 6, 2025

ఈనెల 10న డీ వార్మింగ్ డే: కలెక్టర్ అంబేడ్కర్

image

విజయనగరం జిల్లాలో గుర్ల మండలంలో తప్ప జిల్లా అంతటా ఈ నెల 10న డీ వార్మింగ్ డే సందర్భంగా అల్బెండజోల్ మాత్రలను సరఫరా చేయనున్నట్లు కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష జరిపారు. గుర్ల మండలంలో బోదకాలుకు సంబంధించిన మాత్రలు వేస్తున్నందున నులిపురుగుల నివారణా మాత్రలు ప్రస్తుతం వేయడం లేదని తెలిపారు. 19 ఏళ్లలోపు ఉన్న వాళ్లంతా అల్పెండజోల్ మాత్రలు వేసుకోవాన్నారు.

News February 6, 2025

వెయిట్ లిఫ్టింగ్‌కు పుట్టినిళ్లు ‘కొండవెలగాడ’

image

వెయిట్ లిఫ్టింగ్‌కు పుట్టినిల్లు కొండవెలగాడ తన పేరును సార్థకం చేసుకుంది. వల్లూరి శ్రీనివాసరావు, మత్స సంతోషి లాంటి సీనియర్ లిఫ్టర్లు ఈ గ్రామం నుంచే వెళ్లి కామన్ వెల్త్‌లో ఛాంపియన్స్‌గా నిలిచి దేశ ఖ్యాతిని ఖండాంతరాల్లో నిలిపారు. వాళ్లని ఆదర్శంగా తీసుకొని పదుల సంఖ్యలో క్రీడాకారులు గ్రామం నుంచి పుట్టుకొచ్చారు. తాజాగా జాతీయస్థాయిలో జరిగిన పోటీల్లో గ్రామానికి చెందిన శనపతి పల్లవి గోల్డ్ మెడల్ కొట్టింది.

News February 6, 2025

Way2News ఎఫెక్ట్.. విజయనగరం DM&HO విచారణ

image

గజపతినగరం ప్రభుత్వ ఆసుపత్రికి మంగళవారం ప్రసవానికొచ్చిన గర్భిణిని జిల్లా కేంద్రాసుపత్రికి రిఫర్ చేశారు. ఈ ఘటనపై <<15363231>>Way2News<<>>లో ‘108లో మగబిడ్డకు జన్మనిచ్చిన గర్భిణి’ అని వార్త పబ్లిష్ అయ్యింది. ఈ వార్తపై DM&HO జీవరాణి స్పందించారు. ఆసుపత్రిలో బుధవారం విచారణ చేపట్టారు. ముగ్గురు గైనకాలజిస్టులు ఉండగా జిల్లా ఆస్పత్రికి ఎలా రిఫర్ చేస్తారని ప్రశ్నించారు. ఘటపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

News February 6, 2025

చీపురుపల్లిలో ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతి

image

ట్రాక్టర్ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన చీపురుపల్లి మండలంలో చోటుచేసుకుంది. రేగిడిపేటకు చెందిన దన్నాన శ్రీనువాసరావు (35) బుధవారం రాత్రి తన బైక్‌పై గరివిడి నుంచి చీపురుపల్లి వస్తున్నాడు. ఆంజనేయపురం సమీపంలోకి వచ్చేసరికి ట్రాక్టర్ బైక్‌ను వెనుక నుంచి ఢీకొట్టడంతో శ్రీనివాసరావు తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

News February 6, 2025

విజయనగరం: మొన్న మూడు.. నిన్న నిల్..!

image

ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్లు మంగళవారం మూడు నామినేషన్లు దాఖలవగా.. బుధవారం ఒక్కటి కూడా కాలేదు. టీఎన్ఎప్ఎఫ్ మద్దతో పోటీలో ఉన్న సిటింగ్ MLC రఘువర్మ మొన్న నామినేషన్ వేశారు(ఈయనకు కూటమి మద్దతు ఇచ్చినట్లు సమాచారం). యూటీఎఫ్ ప్రజా సంఘాల మద్దతుతో పోటీ చేస్తున్న విజయగౌరి నేడు విశాఖలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. మాజీ MLC గాదె శ్రీనివాసులునాయుడుకు పీఆర్టీయూ మద్దతు తెలిపింది. 

News February 6, 2025

VZM: ప్రకృతి వ్యవసాయం మోడల్స్ పరిశీలించిన శ్రీలంక బృందం

image

విజయనగరం జిల్లాలో శ్రీలంక బృందం బుధవారం పర్యటించింది. వేపాడ మండలం ఆకుల సీతంపేటలో ప్రకృతి వ్యవసాయంలో సాగు చేస్తున్న పంటలను బుధవారం శ్రీలంక బృందం సభ్యులు సందర్శించారు. జిల్లాలో 30 వివోలలో ప్రకృతి వ్యవసాయం చేస్తుండగా వేపాడ మండలాన్ని మోడల్ మండలంగా ఎంపిక చేసినట్లు డిపిఎం ఆనందరావు బృందం సభ్యులకు వివరించారు. అనంతరం పలు కషాయాలు, ద్రావణం వివిధ పత్రాలతో ప్రయోగపూర్వకంగా తయారు చేసి సభ్యులకు వివరించారు.

News February 5, 2025

రాయగడ డివిజన్ పరిధిలో రైల్వే లైన్లు ఇవే

image

రాయగడ <<15366937>>డివిజన్<<>> పరిధిలోని రైల్వే లైన్ల వివరాలను రైల్వే శాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజీవ్ కుమార్ వెల్లడించారు. బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
➤ కొత్తవలస- బచేలి/ కిరండోల్
➤ కూనేరు-తెరువలి జంక్షన్
➤ సింగ్ పూర్ రోడ్-కొరాపుట్ జంక్షన్
➤ పర్లాకిముండి- -గుణపూర్
రైల్వే స్టేషన్ ను రాయగడ రైల్వే డివిజన్ పరిధిలోకి చేర్చారు.

News February 5, 2025

మంత్రి కొండపల్లితో ఈ-వెహికల్ సంస్థ ప్రతినిధులు భేటీ

image

విజయవాడ ఏపీ సచివాలయంలోని తన ఛాంబర్‌లో మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ను ఈ-వెహికల్ సంస్థ ప్రతినిధులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు, అందిస్తున్న ప్రోత్సాహకాలను మంత్రి వారికి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ వాహనాలను ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో పలు కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయన్నారు.

News February 5, 2025

ఈ నెల 8న కొత్తవలసకు మాజీ ఉపరాష్ట్రపతి

image

కొత్తవలస మండలంలోని చింతలపాలెంలో ఈ నెల 8న మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటించనున్నారు. భీష్మ ఏకాదశి పర్వదినం పురష్కరించుకుని చిట్టిపాప తీర్ధ మహోత్సవం సందర్భంగా జరగనున్న సాహిత్యగోష్టికి వెంకయ్యనాయుడు హాజరవుతారని సర్పంచ్ సీతారామపాత్రుడు మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలను తిలకిస్తారని చెప్పారు.

News February 4, 2025

విశాఖలోని విజయనగరం వాసి ఆత్మహత్య

image

విశాఖలోని విజయనగరం వాసి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మంగళవారం జరిగింది. మృతుడు విజయనగరం జిల్లా తెర్లాం మండలం పనుకువలస గ్రామానికి చెందిన అలుగుబెల్లి గణేశ్ (43)గా పోలీసులు గుర్తించారు. విశాఖలో పెయింటర్‌గా పనిచేస్తున్న గణేశ్ మిథిలాపురిలోని ఉడాకాలనీలో 9 నెలలుగా ఉంటున్నాడు. కాగా మంగళవారం ఉదయం హాల్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని మృతిచెందినట్లు పీఎంపాలెం పోలీసులు తెలిపారు.