Vizianagaram

News August 6, 2024

ఏయూ: ఆన్‌లైన్ క్విజ్.. ప్రైజ్‌మనీ రూ.40వేలు

image

ఏయూ అంబేడ్కర్ ఛైర్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫ్రీడమ్ క్విజ్ నిర్వహిస్తున్నట్లు ఆచార్య ఎం.జేమ్స్ స్టీఫెన్ తెలిపారు. ఆన్‌లైన్ క్విజ్ 12న, రాత పరీక్ష 13న, ఫైనల్ పోటీలు 14న నిర్వహిస్తారు. ప్రథమ బహుమతిగా రూ.25 వేలు, 2వ బహుమతిగా రూ.10వేలు, 3వ బహుమతిగా రూ.5వేల నగదుతో పాటు ట్రోఫీ ఇస్తారు. ఆసక్తి గల వారు ఈనెల 10వ తేదీలోగా 97000 66832 నంబరును సంప్రదించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

News August 6, 2024

VZM: ఏపీ పీజీ సెట్ ప్రవేశాలకు నోటిఫికేషన్

image

రాష్ట్రవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు, అనుబంధ కళాశాలలో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ పీజీ సెట్-2024 ప్రవేశాల కౌన్సిలింగ్ నోటిఫికేషన్ జారీ చేసినట్లు కన్వీనర్, ఏయూ వీసీ జి.శశిభూషణ్‌రావు తెలిపారు. ఈ నెల 7 నుంచి 12వ తేదీ వరకు ర్యాంకులు సాధించిన విద్యార్థులు వెబ్ సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు https://cets.apsche.apgov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలి.

News August 6, 2024

VZM: ఐటీఐ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

జిల్లాలోని ఐటీఐ కోర్సుల్లో 3వ విడత ప్రవేశాలకు ఈ నెల 26 లోపు దరఖాస్తులు చేసుకోవాలని ఐటీఐ కళాశాలల కన్వీనర్ టీవీ గిరి తెలిపారు. విద్యార్థులు iti.ap.gov.in వెబ్ సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని, సంబంధిత యూనిక్ నంబరుతో ఈ నెల 27వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా దరఖాస్తు చేసి ఐటీఐలో ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కావాలని చెప్పారు. 29న ప్రభుత్వ, 31న ప్రైవేటు ఐటీఐల్లో కౌన్సెలింగ్ ఉంటుందన్నారు.

News August 6, 2024

విజయనగరంలో ట్రైన్ కింద పడి ఆత్మహత్య

image

జిల్లా కేంద్రంలో విజయనగరం నుంచి పలాస వెళ్లే మార్గంలో ట్రైన్ కిందపడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వైయస్సార్ కాలనీకి చెందిన జి.వీర్రాజు బట్టల షాపులో పని చేసుకుంటూ జీవనం సాగించేవాడు. బట్టల షాపులో ఉద్యోగం పోవడంతో ఆర్థిక ఇబ్బందులకు గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు.

News August 6, 2024

విజయనగరం: ఫేక్ మెసేజ్‌తో రూ.5.30 లక్షలు కాజేత

image

విజయనగరం ఎం.జి.రోడ్డులో నివసిస్తున్న యువతి ఇన్‌స్టాగ్రాంకు వచ్చిన ‘ఇన్స్టిట్యూషనల్ ట్రేడింగ్’ అనే మెసేజ్‌కు స్పందించింది. ఆ తర్వాత వాట్సాప్‌లో ఎన్82 మిహర్ వోహ్రా ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ’ గ్రూప్ ద్వారా వచ్చిన వాటిని నమ్మి, అధిక మొత్తంలో డబ్బులు వస్తాయన్న ఆశతో మొత్తం రూ.5,30,000 నగదు పంపించారు. తర్వాత అటువైపు నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో మోసపోయానని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News August 6, 2024

పార్వతీపురం యువకునికి 20ఏళ్ల జైలుశిక్ష

image

అనకాపల్లి జిల్లాకు చెందిన అమ్మాయిని మోసగించిన కేసులో పార్వతీపురానికి చెందిన పి.సాయి మనోజ్ కుమార్‌కు 20ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ విజయనగరం పోక్సో కోర్టు తీర్పునిచ్చింది. శిక్షతో పాటు రూ.5,500 జరిమానా విధించింది. భోగాపురం సమీపంలో చదువుతున్న రోజుల్లో సాయి మనోజ్‌తో సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసినట్లు స్థానిక పోలీసుస్టేషన్‌లో ఆమె కేసు పెట్టింది.

News August 6, 2024

పార్వతీపురంలో విరబూసిన బ్రహ్మ కమలం

image

మహ శివునికి ఎంతో ప్రీతికరమైన బ్రహ్మ కమలం పుష్పాలు హిమాలయాల్లో ఏడాదికి ఒక్కసారే విరబూస్తాయి. అలాంటి ఆ బ్రహ్మ కమలాలు పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో విరబూయడం అందరినీ ఆకర్షిస్తోంది. పట్టణంలోని వైకేయం కాలనీకి చెందిన అశపు సర్వేశ్వరరావు ఇంటి ఆవరణలో నాటిన ఈ మొక్కకు పూలు విరబూశాయి. సర్వేశ్వరరావు కుటుంబ సభ్యులు ఎంతగానో సంతోషించారు. సమీపంలోని శివాలయంలో ఆ పూలను సమర్పిస్తామన్నారు.

News August 6, 2024

మన్యం జిల్లాలో కంటైనర్ హాస్పిటల్స్..!

image

మన్యం జిల్లాలో గిరిజనులు డోలిమోత కష్టాలు పడకుండా కంటైనర్ హాస్పిటల్స్ ఏర్పాటు చేసేందుకు కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్ శ్రీకారం చుట్టారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో మన్యం ఏజెన్సీలో గిరిజనులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు రూ.8 లక్షలతో వైజాగ్‌లో కంటైనర్ హాస్పిటల్స్ సిద్ధం చేస్తున్నామన్నారు. ఇందులో ఐదు బెడ్లతోపాటు, సెలైన్ స్టాండ్స్, అన్ని సదుపాయాలు ఉంటాయని తెలిపారు.

News August 5, 2024

ఖడ్గవలస: ప్రధాన రహదారిపై ఏనుగుల గుంపు

image

పార్వతీపురం-కురుపాం ప్రధాన రహదారిలోని ఖడ్గవలస కూడలిలో ఉన్న రైస్ మిల్లు వద్ద ఏనుగుల గుంపు ఉన్నట్లు ఫారెస్ట్ అధికారులు వెల్లడించారు. ప్రధాన రహదారిపై ప్రయాణించేవారు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఏనుగుల గుంపు కనిపిస్తే కవ్వింపు చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించారు. పరిసర ప్రాంతాల్లో ప్రజలు అత్యవసరమైతే తప్ప రహదారుల పైకి రావద్దని సూచించారు.

News August 5, 2024

ఎమ్మెల్సీగా నన్ను గెలిపించండి: బొత్స

image

ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. చోడవరంలో మాజీ ఎమ్మెల్యే ధర్మశ్రీ అధ్యక్షతన పార్టీ నాయకులు, స్థానిక సంస్థల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. బొత్స మాట్లాడుతూ.. జగన్ తనను నమ్మి అభ్యర్థిగా ఖరారు చేశారన్నారు. ప్రజా ప్రతినిధులు కలిసిమెలిసి పనిచేసి గెలిపించాలని కోరారు.