India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జిల్లాలో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక హీట్ పెరిగింది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు స్పీడ్ పెంచారు. వివిధ ఉపాధ్యాయ సంఘాలతో సమావేశాలు నిర్వహిస్తూ మద్దతు కోరుతున్నారు. కాగా జిల్లాలో మొత్తం 4,937 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉండగా వారిలో 3,100 మంది పురుష ఓటర్లు, 1,837 మంది మహిళ ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఈ నెల 27న పోలింగ్ జరగనుండగా, వచ్చే నెల 3న ఓట్ల లెక్కింపు ఉంటుంది.
విజయనగరం పట్టణంలోని బాబా మెట్టకు చెందిన సత్య జ్యోతి ఉత్తరాఖండ్లో జరుగుతున్న జాతీయ స్థాయి వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో బ్రాంజ్ మెడల్ను సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు సత్య జ్యోతికి సోమవారం శుభాకాంక్షలు తెలిపారు. మరిన్ని విజయాలను సాధించాలని ఆయన ఆకాంక్షించారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యార్థులకు ఫీజులు చెల్లించడం లేదని, వారికి వైసీపీ అండగా నిలుస్తుందని జిల్లా వైసీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం విజయనగరం పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ..ప్రభుత్వానికి హెచ్చరికగా ఈనెల 5న జిల్లా కేంద్రంలో ‘ఫీజు పోరు’ చేపడతామన్నారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు,కరుమజ్జి సాయి, గదుల సత్యలత, పలువురు పాల్గొన్నారు.
శ్రీకాకుళంలో ఉమెన్స్ కాలేజీలో ఓ విద్యార్థినిపై దాడి జరిగిన విషయం తెలిసిందే. నిందితుడు సారవకోటకు చెందిన జగదీశ్ను అరెస్ట్ చేశామని ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి వెల్లడించారు. ‘విజయనగరం(D) సంతకవిటికి చెందిన యువతి డిగ్రీ చదువుతూ హాస్టల్లో ఉంటోంది. గతంలో జగదీశ్తో ఆమెకు పరిచయం ఉంది. గతనెల 30న ఆమెను కలిసి పెళ్లి చేసుకోవాలని కోరాడు. అందుకు ఆమె నిరాకరించడంతో అతను దాడి చేసి గాయపరిచాడు’ అని ఎస్పీ చెప్పారు.
ఆండ్ర ఎస్ఐ సీతారాములు తీరుపై విజయనగరం ఎస్పీ వకుల్ జిందాల్ విచారణకు ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో కొంతమంది రాజకీయ నాయకులను ఆయన కలిసినట్లుగా వచ్చిన ఆరోపణలపై బొబ్బిలి డీఎస్పీ భవ్యరెడ్డిని విచారణ చేసి నివేదిక పంపాలని ఆదేశించామన్నారు. విచారణలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్లు తేలితే క్రమశిక్షణ చర్యలు తప్పవని ఎస్పీ తెలిపారు.
భూముల రీసర్వేకు సంబంధించి భూముల యజమానులకు వచ్చే సందేహాలను నివృత్తి చేసేందుకు ఎక్స్పర్ట్ సెల్ను ఏర్పాటు చేసినట్టు జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్ శనివారం తెలిపారు. ఎక్స్పర్ట్ సెల్ అధికారిగా సర్వే భూరికార్డుల శాఖకు చెందిన ఏ.మన్మధరావును నియమించినట్లు పేర్కొన్నారు. ఆయన కార్యాలయ పనిదినాల్లో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటారన్నారు.
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కారం వేదిక కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఎస్పీ వకుల్ జిందాల్ శనివారం తెలిపారు. జనవరి 29 నుంచి మార్చి 8 వరకు జిల్లాలో కోడ్ అమల్లో ఉన్నందున ఫిర్యాదులు స్వీకరించమన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని ఎస్పీ కోరారు.
జిల్లాలో ఉపాధ్యాయ MLC ఎన్నికల కోడ్ అమలకు నోడల్ అధికారుల నియమిస్తూ జిల్లా ఎన్నికల అధికారి అంబేడ్కర్ ఉత్తర్వులు జారీ శనివారం చేశారు. MCC అమలుకు జిల్లా స్థాయి నోడల్ అధికారిగా ZP CEOసత్యనారాయణ నియమితులయ్యారు. ఆయన జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలును పర్యవేక్షిస్తారు. ఫిర్యాదులను స్వీకరించి చర్యలు చేపడతారు. ఎంపీడీవో, కమీషనర్ల ద్వారా మోడల్ కోడ్ అమలు చేస్తారు.
విజయనగరం జిల్లా గంట్యాడ మండలం నీలావతి గ్రామానికి చెందిన శివ(21) అనే యువకుడిపై పోక్సో, వరకట్న కేసులు నమోదయ్యాయి. పోలీసుల వివరాల ప్రకారం.. స్థానికంగా ఉంటున్న మైనర్ బాలికతో యువకుడు పరిచయం పెంచుకున్నాడు. ఆమెను శారీరకంగా లోబర్చుకున్నాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు పెద్దలు వీరికి వివాహం జరిపించారు. ఇటీవల శివ, కుటుంబ సభ్యులు వర కట్నం కోసం తనను వేధిస్తున్నారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇంటిపెద్ద అకాల మరణంతో ఓ కుటుంబం అనాథగా మారింది. మెరకముడిదాం గ్రామానికి చెందిన గౌరీనాయడు(50) శుక్రవారం మృతి చెందాడు. గడ్డిని ట్రాక్టర్పైకి ఎక్కిస్తుండగా కిందపడటంతో ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. తోటి కార్మికులు ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని చీపురుపల్లి ఆస్పత్రికి తరలించారు. కాగా మృతుడికి భార్య లక్ష్మీతో పాటు ఇద్దరు కుమార్తెలున్నారు.
Sorry, no posts matched your criteria.