Vizianagaram

News August 2, 2024

విజయనగరంలో బియ్యం, కందిపప్పు ధరల తగ్గింపు

image

జిల్లాలోని వివిధ రైతు బజార్లు, పీడబ్ల్యుడీ మార్కెట్, డి-మార్ట్, రిలయన్స్, స్పెన్సర్, మోర్ తదితర మార్కెట్లలో శుక్రవారం నుంచి తగ్గింపు ధరకు కందిపప్పు, బియ్యం విక్రయాలు ప్రారంభిస్తున్నట్లు జేసీ కే.కార్తీక్ తెలిపారు. దేశవాళీ కందిపప్పు కిలో రూ.155 నుంచి రూ.150కి, బియ్యం (స్టీమ్) బిపిటి, సోనామసూరి కిలో రూ.49 నుంచి రూ.48కి, బియ్యం(రా) కిలో రూ.48 నుంచి రూ.47 కి తగ్గించి విక్రయించనున్నట్లు తెలిపారు.

News August 2, 2024

దంతేవాడ వరకు మాత్రమే కిరండూల్ రైలు

image

ఆగస్టు ఎనిమిదో తేదీ వరకు కిరండూల్ రైలు దంతేవాడ వరకే నడుస్తుందని రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ మేరకు అధికారులు గురువారం ప్రకటన విడుదల చేశారు. ఇటీవల కాలంలో ఏజెన్సీలో విస్తృతంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రయాణికులు ఈ విషయాన్ని గుర్తించి సహకరించాలని వారు కోరారు.

News August 1, 2024

బొబ్బిలిలో యాక్సిడెంట్.. బాలుడు మృతి

image

బొబ్బిలి 8వ వార్డు పరిధిలో బొబ్బిలి నుంచి రాజాం వెళ్లే ప్రధాన రహదారిలో గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సైకిల్‌పై వెళుతున్న బాలుడిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి తలపై నుంచి వెళ్ళిపోయింది. ఈ ప్రమాదంలో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతి చెందిన బాలుడు గొల్లపల్లి జీ.ఎన్.ఎస్. స్కూల్లో చదువుతున్న మణికంఠగా స్థానికులు గుర్తించారు.

News August 1, 2024

పార్వతీపురం: ‘DSC పరీక్షలకు ఉచిత శిక్షణ తరగతులు’

image

DSC పరీక్షలకు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు పార్వతీపురం మన్యం జిల్లా విద్యాశాఖ అధికారిణి జి.పగడాలమ్మ తెలిపారు. ఉచిత శిక్షణకు గాను బేస్మెంట్ పరీక్ష ఉంటుందని వెల్లడించారు. బేస్మెంట్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఉచిత శిక్షణ తరగతులు ఉంటాయన్నారు. అభ్యర్థులు ఈనెల 7వ తేదీలోగా డీఈవో ఆఫీసులో దరఖాస్తులు చేసుకోవాలని ఆమె సూచించారు.

News August 1, 2024

ఏయూ పరిధిలో సెమిస్టర్ ఫలితాలు విడుదల

image

ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలో ఎంకామ్ నాలుగో సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను, బీబీఏ-ఎంబీఏ ఆరో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. పరీక్ష ఫలితాలను ఏయూ వెబ్సైట్లో పొందుపరిచారు. ఎం.కామ్ విద్యార్థులు ఆగస్టు 14లోగా రీవాల్యుయేషన్ కు దరఖాస్తు చేసుకోవాలి. బీబీఏ-ఎంబీఏ విద్యార్థులు ఆగస్టు 15లోగా రీవాల్యుయేషన్ కు దరఖాస్తు చేసుకోవాలని పరీక్షల విభాగం అధికారులు సూచించారు.

News August 1, 2024

విశాఖలో ముందుకొస్తున్న సముద్రం

image

వాతావరణ మార్పుల నేపథ్యంలో విశాఖలో సముద్రం ముందుకు వస్తోందని బెంగళూరుకు చెందిన స్టడీ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ అండ్ పాలసీ సంస్థ అధ్యయనంలో తెలిపింది. విశాఖలో 1987- 2021 మధ్యకాలంలో 2,381 సెంటీమీటర్ల భూభాగం సముద్రంలో కలిసిపోయిందని తెలిపింది. 2040 నాటికి విశాఖనగరంలో ఐదు శాతం భూభాగం సముద్రంలో కలిసిపోతుందని తమ అధ్యయనంలో పేర్కొంది.

News August 1, 2024

రోడ్డు ప్రమాదంలో విజయనగరం వాసులు

image

సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కీతవారిగూడెం పెట్రోల్ బంక్ వద్ద బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 15 మందికి గాయాలయ్యాయి. షిరిడి నుంచి మైలవరం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులంతా విజయనగరం జిల్లా వాసులుగా సమాచారం. పూర్తి వివారాలు తెలియాల్సి ఉంది.

News August 1, 2024

VZM: యువతిపై హోం‌గార్డ్ అత్యాచారం.. ఎస్పీ సీరియస్

image

యువతిపై అత్యాచారానికి పాల్పడిన హోంగార్డును శాశ్వతంగా విధులు నుంచి తొలగించేందుకు చర్యలు చేపడతామని ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. బొండపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో హోం గార్డుగా పనిచేస్తున్న సురేశ్..ఓ ప్రేమ జంటను బెదిరించి యువతిని నెల్లిమర్లలోని కొండపేటకు తీసుకువెళ్లి అత్యాచారం చేసినట్లు ఆమె ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు హోంగార్డును అరెస్ట్ చేశారు. నిందితుడికి శిక్షపడేలా చూస్తామని ఎస్పీ తెలిపారు.

News July 31, 2024

VZM: యువతిపై హోం‌గార్డ్ అత్యాచారం.. ఎస్పీ సీరియస్

image

యువతిపై అత్యాచారానికి పాల్పడిన హోంగార్డును శాశ్వతంగా విధులు నుంచి తొలగించేందుకు చర్యలు చేపడతామని ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. బొండపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో హోం గార్డుగా పనిచేస్తున్న సురేశ్..ఓ ప్రేమ జంటను బెదిరించి యువతిని నెల్లిమర్లలోని కొండపేటకు తీసుకువెళ్లి అత్యాచారం చేసినట్లు ఆమె ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు హోంగార్డును అరెస్ట్ చేశారు. నిందితుడికి శిక్షపడేలా చూస్తామని ఎస్పీ తెలిపారు.

News July 31, 2024

విజయనగరం జిల్లాలో మహిళ మిస్సింగ్..

image

నెల్లిమర్ల మండలంలోని వల్లూరు గ్రామానికి చెందిన మత్స దివ్య అనే 27 ఏళ్ల మహిళ ఆచూకీ నెల రోజుల నుంచి దొరక్కపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే స్థానిక పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదు కాగా పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. సదరు మహిళ మానసిక సమస్యతో బయటకి వెళ్లినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఎవరికైనా ఆచూకీ తెలిస్తే పోలీస్ స్టేషన్ లేదా 9963111089 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.