Vizianagaram

News March 26, 2025

గొల్లాదిలో కొట్లాట.. ఏడుగురుకి గాయాలు

image

బాడంగి మండలం గొల్లాది పోలమ్మ ఆలయం సమీపంలో కామన్నవలస, గొల్లాది గ్రామానికి చెందిన వారి మధ్య మంగళవారం కొట్లాట జరిగినట్లు ఎస్ఐ తారకేశ్వరరావు చెప్పారు. ఆలయం సమీపంలో గొల్లాదికి చెందిన ఈపు ఈశ్వరరావు మేకలు మేపుతుండగా కామన్నవలసకి చెందిన ఆదినారాయణ మేకలు మేపేందుకు వచ్చాడు. వారి మధ్య కొట్లాట జరగడంతో ఇరువర్గాలకు చెందిన ఏడుగురు గాయపడ్డారు. గాయపడిన వారు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

News March 26, 2025

కలెక్టర్ల సమావేశంలో పాల్గొన్న విజయనగరం జిల్లా కలెక్టర్ 

image

విజయవాడలో జరుగుతున్న రెండు రోజుల కలెక్టర్ల సమావేశంలో విజయనగరం జిల్లా కలెక్టర్ డా.బి.ఆర్. అంబేడ్కర్ పాల్గొన్నారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి నివేదిక ఉన్నతాధికారులకు అందజేశారు. పెండింగ్ పనులు పూర్తి చేయడానికి అవసరమైన నిధులు, అనుమతులు గురించి చర్చించారు. జిల్లాలో టూరిజం అభివృద్ధి, వేసవిలో త్రాగునీటి ఇబ్బందులు లేకుండా తీసుకోవాల్సిన చర్యలు గురించి చర్చించారు.

News March 25, 2025

నెల్లిమర్ల: నర్సింగ్ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు

image

రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నర్సింగ్ విద్యార్థులకు జర్మన్ భాషలో ఉచితంగా శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు స్కిల్బీ సంస్థ ప్రతినిధి ఉజ్వల్ తెలిపారు. నెల్లిమర్ల MIMSలో నర్సింగ్ విద్యార్థులకు మంగళవారం అవగాహన కల్పించారు. ప్రభుత్వ సహకారంతో ఎనిమిది నెలల శిక్షణ అనంతరం జర్మనీలో రూ.2.50 లక్షల నుంచి రూ.3.50 లక్షల జీతంతో ఉద్యోగాలు కల్పిస్తామన్నారు.

News March 25, 2025

బొబ్బిలిలో విషాదం.. అపార్ట్‌మెంట్‌పై నుంచి పడి రిటైర్డ్ HM మృతి 

image

బొబ్బిలిలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. నాయుడుకాలనీలో అపార్ట్మెంట్ పైనుంచి ప్రమాదవశాత్తూ జారిపడి రిటైర్డ్ హెచ్ఎం వై.శ్యామసుందర్(80) మృతి చెందారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బాల్కనీలో నిల్చున్న ఆయన కళ్లు తిరిగి పడిపోయారు. ఆయన స్వగ్రామం పాల్తేరు కాగా అదే గ్రామంలో HMగా రిటైర్ అయ్యారు. ఇద్దరు కుమారులు కాగా.. ఒకరు డాక్టర్‌గా, మరో కుమారుడు సచివాలయ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. 

News March 25, 2025

విశాఖలో ఐపీఎల్ మ్యాచ్.. వారికి తీపి జ్ఞాపకం

image

వైజాగ్ క్రికెట్ స్టేడియంలో సోమవారం జరిగిన మ్యాచ్‌ను ఆంధ్రా క్రికెట్ అసోసియేష‌న్ 30 మంది అనాథ‌ చిన్నారులకు చూసే అవ‌కాశం క‌ల్పించింది. సొంత నిధుల‌తో 30 టికెట్స్ కొని వైజాగ్‌లోని పాపా హోమ్ అనాథ శ‌ర‌ణాల‌యానికి అంద‌జేశారు. ఈ సందర్భంగా ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఢిల్లీ క్యాపిట‌ల్స్ వ‌ర్సెస్ ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ క్రికెట్ మ్యాచ్ వీక్షించేందుకు చిన్నారులు స్టేడియానికి వెళ్లారు.

News March 25, 2025

VZM: నేడు,రేపు APPSC ప‌రీక్ష‌లు

image

నేడు, రేపు జ‌ర‌గ‌నున్న APPSC ప‌రీక్ష‌ల‌కు ప‌క‌డ్బందీగా ఏర్పాట్లు చేసిన DRO ఎస్‌.శ్రీ‌నివాస‌మూర్తి తెలిపారు. పరీక్షల నిర్వహణపై సోమవారం తన ఛాంబర్లో సమావేశం నిర్వహించారు. 25న అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంట‌ల్ ఇంజినీర్‌, 25, 26 తేదీల్లో పొల్యూష‌న్ కంట్రోల్ బోర్డులోని అన‌లిస్ట్ గ్రేడ్‌-2 ఉద్యోగాల‌కు, 26న డిప్యూటీ ఎడ్యుకేష‌న‌ల్ ఆఫీస‌ర్ ఉద్యోగాల భ‌ర్తీకి పరీక్షలు జరుగుతాయన్నారు.

News March 24, 2025

చీపురుపల్లి: అబ్బాయ్‌ను బాబాయ్ పక్కన పెడుతున్నారా..?

image

చీపురుపల్లి TDPలో కలహాలు తారస్థాయికి చేరుకున్నాయనే గుసగుసలు సొంత పార్టీ నుంచి వినిపిస్తున్నాయి. ఒకే కుటుంబానికి చెందిన ప్రస్తుత MLA కళా వెంకట్రావుకు, TDP జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున మధ్య పొసగడం లేదని టాక్. ఇటీవల TDP ఆఫీస్ ప్రారంభానికీ నాగార్జున రాకపోవడం ఈ వార్తలకు బలం చేకూర్చుతోంది. రానున్న ఎన్నికల్లో తన కుమారుడు రామ్ మల్లిక్‌కు లైన్ క్లియర్ చేసేందుకు కళా యత్నిస్తున్నట్లు చర్చ నడుస్తోంది.

News March 24, 2025

VZM: ఈ నెల 25,26 తేదీల్లో APPSC ప‌రీక్ష‌లు

image

ఈ నెల 25,26 తేదీల్లో జ‌ర‌గ‌నున్న APPSC ప‌రీక్ష‌ల‌కు ప‌క‌డ్బంధీగా ఏర్పాట్లు చేయాల‌ని DRO ఎస్‌.శ్రీ‌నివాస‌మూర్తి ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై సోమవారం తన చాంబర్లో సమావేశం నిర్వహించారు. 25న అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంట‌ల్ ఇంజ‌నీర్‌, 25, 26 తేదీల్లో పొల్యూష‌న్ కంట్రోల్ బోర్డులోని అన‌లిస్ట్ గ్రేడ్‌-2 ఉద్యోగాల‌కు, 26న డిప్యుటీ ఎడ్యుకేష‌న‌ల్ ఆఫీస‌ర్ ఉద్యోగాల భ‌ర్తీకి పరీక్షలు జరుగుతాయన్నారు.

News March 24, 2025

VZM: టెన్త్ పరీక్షలకు 22,786 మంది హాజరు

image

సోమవారం జిల్లా వ్యాప్తంగా 119 పరీక్షా కేంద్రాలలో నిర్వహించిన టెన్త్ గణితం పరీక్షలకు 22,786 మంది విద్యార్థులు హాజరుకాగ 104 మంది గైర్హాజరు అయ్యారని విజయనగరం జిల్లా విద్యా శాఖాధికారి మాణిక్యం నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం విద్యార్థులు 22890 మంది హాజరు కావాల్సి ఉండగా 22,786 మంది మాత్రమే హాజరైయ్యారని అన్నారు. విద్యార్థులు హజరు 99.55% శాతంగా నమోదు అయిందని, పరీక్ష సజావుగా జరిగిందని తెలియజేసారు.

News March 24, 2025

వైజాగ్‌లో IPL మ్యాచ్.. భారీ వాహనాలకు నో ఎంట్రీ

image

వైజాగ్‌లో ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా ట్రాఫిక్ మళ్లించినట్లు అధికారులు తెలిపారు. ఈరోజు మ.2 నుంచి రాత్రి 12 గంటల వరకు మధురవాడ స్టేడియం వైపు భారీ వాహనాలకు అనుమతి లేదు. అనకాపల్లి నుంచి విజయనగరం, శ్రీకాకుళం వైపు వెళ్లే వాహనాలు నగరంలోకి రాకుండా సబ్బవరం, పెందుర్తి, ఆనందపురం మీదుగా వెళ్లాలి. శ్రీకాకుళం, విజయనగరం నుంచి అనకాపల్లి వైపు వెళ్లే వాహనాలు ఆనందపురం, పెందుర్తి, సబ్బవరం మీదుగా దారి మళ్లించారు.