Vizianagaram

News July 23, 2024

విజయనగరం: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 29 ఫిర్యాదులు

image

విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సోమవారం నిర్వహించారు. ప్రజల నుంచి 29 ఫిర్యాదులను ఎస్పీ స్వీకరించి, వారి సమస్యలను విని సంబంధిత పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడారు. ఫిర్యాదుదారుల సమస్యలను పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

News July 22, 2024

విజయనగరం: ఆగ‌స్టు 15న 3 అన్న‌ క్యాంటీన్లు ప్రారంభం

image

రాష్ట్ర‌ప్ర‌భుత్వ ఆదేశాల మేర‌కు ఆగ‌స్టు 15న ప్రారంభించేందుకు విజయనగరం జిల్లాలో 3 అన్నా క్యాంటీన్లను సిద్ధం చేయాల‌ని క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ బీఆర్ అంబేడ్కర్ ఆదేశించారు. విజ‌య‌న‌గ‌రం, బొబ్బిలి, రాజాం, నెల్లిమర్ల మున్సిప‌ల్ కమిషనర్లతో త‌న ఛాంబ‌ర్‌లో సోమ‌వారం స‌మావేశం నిర్వ‌హించారు. ముందుగా మున్సిపాలిటీల్లో తాగునీటి స‌ర‌ఫ‌రా, పారిశుద్ధ్యం, వ్యాధుల వ్యాప్తిపై స‌మీక్ష నిర్వహించారు.

News July 22, 2024

గంజాయి అక్రమ రవాణా సూత్రదారులను వదలం: VZM ఎస్పీ

image

గంజాయి అక్రమ రవాణా కేసుల్లో పట్టుబడిన వ్యక్తులతోపాటు, అక్రమ రవాణకు కారకులైన ప్రధాన సూత్రధారుల మూలాలలను వెలికితీస్తామని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సోమవారం తెలిపారు. గంజాయి అక్రమ రవాణాకు ఎవరూ పాల్పడినా ఉపేక్షించేది లేదన్నారు. నిందితులనువిచారించి,సమాచారం సేకరించడంతోపాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి గంజాయి అక్రమ రవాణాకు ప్రధాన సూత్రదారులను గుర్తించి అరెస్టు చేస్తామన్నారు.

News July 22, 2024

VZM: ‘విద్యుత్ సమస్యలపై కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు’

image

వర్షాకాలంలో విద్యుత్తు ప్రమాదాల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు పాటించాలని ఈపీడీసీఎల్ ఎస్.ఈ ఎం.లక్ష్మణరావు సూచించారు. ఉమ్మడి జిల్లాలో 6 కంట్రోల్‌ రూములు ఏర్పాటు చేశామన్నారు. విద్యుత్ సమస్యలపై 1912 టోల్‌ ఫ్రీ నంబరుతో పాటు విజయనగరం సర్కిల్‌లో 94906 10102, టౌన్‌లో 63005 49126, రూరల్‌లో 94409 07289, బొబ్బిలిలో 94906 10122, పార్వతీపురంలో 83320 46778 నంబర్లను సంప్రదించాలన్నారు.

News July 22, 2024

విజయనగరంలో అసిస్టెంట్ బ్యాంక్ మేనేజర్ అరెస్ట్

image

విజయనగరంలోని ఓ ప్రైవేట్ బ్యాంక్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా పని చేస్తున్న ప్రవీణ్ కుమార్ ఖాతాదారులు చెల్లించిన సొమ్మును బ్యాంక్‌లో జమ చేయకుండా సొంత అవసరాలకు వాడేసుకున్నారు. హోమ్ లోన్లు తీసుకున్న ఖాతాదారులు చెల్లించిన డబ్బులు సుమారు రూ.34 లక్షలు వాడేసుకున్నారు. ఇది గుర్తించిన బ్యాంక్ యాజమాన్యం వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ప్రవీణ్ కుమార్‌ను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశామని S.I హరిబాబు తెలిపారు.

News July 22, 2024

విజయనగరం: గంజాయితో నలుగురు అరెస్ట్

image

గంజాయి విక్రయిస్తే పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించవచ్చని ఆశ పడ్డారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులు విశాఖపట్నానికి చెందిన ఇద్దరు వ్యక్తులకు గంజాయి విక్రయించడానికి ఎస్.కోట-విశాఖ రహదారిలో బైక్‌పై తీసుకువెళ్తుండగా కొత్తవలస పోలీసులకు చిక్కారు. వారితో పాటు గంజాయి కొనుగోలు చేసేందుకు వచ్చిన ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేసారు. 3.42 కిలోల గంజాయి, బైక్ స్వాధీనం చేసుకున్నారు.

News July 22, 2024

మీ MLA ఏ సమస్యపై ప్రస్తావించాలనుకుంటున్నారు?

image

నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలవుతున్న నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఉమ్మడి జిల్లాలోని ఏడుగురు ఎమ్మెల్యేలు తొలిసారి అసెంబ్లీలో గళం వినిపించనుండగా.. వారిలో కొండపల్లి శ్రీనివాస్, గుమ్మిడి సంధ్యారాణి మంత్రులుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎస్.కోట నుంచి కోళ్ల, చీపురుపల్లి నుంచి కిమిడి వంటి సీనియర్లు ఉన్నారు. మరి మీ MLA అసెంబ్లీలో ఏ సమస్యపై ప్రస్తావించాలనుకుంటున్నారో కామెంట్ చెయ్యండి.

News July 22, 2024

VZM: నిండు కుండల్లా జలాశయాలు

image

కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి విజయనగరం జిల్లాలో జలాశయాలు నిండుకుండాల్లా మారాయి. తోటపల్లి పూర్తి స్థాయి నీటిమట్టం 105 మీటర్లు కాగా.. ప్రస్తుతం 104 మీటర్ల వరకు నీరు చేరింది. వట్టిగెడ్డలో 121.62 M.కి 115.82మీ., పెద్దగెడ్డలో 213.80 M.కి 213.82 M., వెంగళరాయ‌సాగర్‌లో 161మీ.కి 157.45మీ., జంఝావతిలో 124మీ.కి 122.56 M నీటిమట్టం ఉంది. దీంతో నదీ తీర, లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.

News July 21, 2024

విజయనగరంలో యాక్సిడెంట్.. మృతులు గుర్తింపు

image

విజయనగరం జిల్లా జొన్నాడ సమీపంలో ఆదివారం జరిగిన ఘోర <<13674170>>రోడ్డు ప్రమాదం<<>>లో మృతులను డెంకాడ పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో తురక ప్రవీణ్ చంద్ (గుంటూరు), బాడిత మాను సన్యాసి(గుంపాం) అక్కడికక్కడే మరణించారు. మరో ఎనిమిది మంది వరకూ గాయపడ్డారు. క్షతగాత్రులను విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డెంకాడ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

News July 21, 2024

VZM: ఉపాధి వేతనాల కోసం ఎదురు చూపులు

image

ఉమ్మడి జిల్లాలో ఉపాధి హామీ వేతన దారులు వేతనాల కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. వేతన చెల్లింపులకు రెండు జిల్లాల్లో రూ.1.05 కోట్ల బకాయిలు ఉన్నాయి. వాస్తవానికి 15 రోజులకోసారి వేతనాలు చెల్లించాల్సి ఉన్నా రెండు నెలల నుంచి ఆ ప్రక్రియ సాగలేదు. ఫలితంగా విజయనగరం జిల్లాలో రూ.60లక్షలు, పార్వతీపురం మన్యం జిల్లాలో రూ.55లక్షలు పెండింగ్‌లో ఉన్నాయి. త్వరగా చెల్లింపులు చేయాలని వేతనదారులు డిమాండ్ చేస్తున్నారు.