India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మాతృ శిశు మరణాలు సంభవిస్తే, సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని విజయనగరం కలెక్టర్ డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ హెచ్చరించారు. గత 5 నెలల్లో జిల్లాలో జరిగిన మాతృ, శిశు మరణాలపై కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన ఎంపీసీడీఎస్సార్ సమావేశంలో కలెక్టర్ సమీక్షించారు. మొత్తం 10 మాతృ మరణాలు, 6 శిశు మరణాలపై కేసుల వారీగా వివరాలను తెలుసుకున్నారు. మరణాలకు కారణాలు, వారికి అందించిన చికిత్స, ఇతర పరిస్థితులపై ఆరా తీశారు.
నేరగాళ్లు జంప్డ్ డిపాజిట్ స్కామ్కు పాల్పడుతున్నారు. అకౌంట్లో నగదు వేస్తున్నారు. మెసేజ్ చూసి UPIతో బ్యాలెన్స్ చెక్ చేసుకుంటే డబ్బులు దోచేస్తున్నారు. ఈ స్కామ్ పట్ల విజయనగరం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని SP వకుల్ జిందాల్ పేర్కొన్నారు. అకౌంట్లో డబ్బులు పడినట్లు మెసేజ్ వస్తే 30 ని. తర్వాత బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలని, ఫస్ట్ టైమ్ రాంగ్ UPI పిన్ ఎంటర్ చేస్తే స్కామర్ రిక్వస్ట్ క్యాన్సిల్ అవుతుందన్నారు.
పల్లె పండుగలో భాగంగా గుంతలు లేని రహదారులే లక్ష్యంగా విజయనగరం జిల్లాలో చేపట్టిన రోడ్ల మరమ్మతు పనులు 296 కిలోమీటర్ల మేర పూర్తి అయ్యాయని కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. రోడ్ల మరమ్మతు పనులపై అధికారులతో కలెక్టర్ తమ ఛాంబర్లో బుధవారం సమీక్ష నిర్వహించారు. జిల్లాలో 884 కిలోమీటర్ల మేర రహదారుల మరమ్మతులకు 176 పనులను ప్రతిపాదించడం జరిగిందని చెప్పారు.
ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో బుధవారం ఉదయం జరగాల్సిన డిగ్రీ, పీజీ పరీక్షలను వాయిదా వేసినట్లు రిజిస్ట్రార్ E.N ధనంజయరావు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో విద్యార్థులు ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో పరీక్షలను వాయిదా వేశామని అన్నారు. మరలా ఈ పరీక్షలను ఎప్పుడు నిర్వహించేది త్వరలో ప్రకటిస్తామని ఆయన తెలిపారు.
విశాఖలో ప్రధాని మోదీ సభకు వచ్చే ప్రజలకు మధ్యాహ్నం పులిహోరా, మజ్జిగ ప్యాకెట్, వాటర్ బాటిల్ రాత్రికి బిర్యానీ, వాటర్, మజ్జిగ ప్యాకెట్, బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వనున్నారు. GVMC పరిధిలో వాహనాలు బయలుదేరే చోటే ఫుడ్ ప్యాకెట్స్ పంపిణీ చేయనున్నారు. అనకాపల్లి, విజయనగరం నుంచి వచ్చేవారికి ఆ జిల్లా అధికారులు డిస్ట్రిబ్యూట్ చేయనున్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చే వారికి నాతవలస చెక్పోస్టు వద్ద ఆహారం అందిస్తారు.
విశాఖలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చీ కీలక ఆదేశాలు జారీ చేశారు. రోడ్షో, బహిరంగ సభలో పాల్గొనే ప్రజలు తమ వెంట కేవలం సెల్ ఫోన్ మాత్రమే తీసుకురావాలని సూచించారు. మరే ఇతర బ్యాగులు, వస్తువులు తీసుకువచ్చేందుకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఒకవేళ తెచ్చినట్లయితే తమ వాహనాల్లో భద్రపరుచుకోవాలన్నారు. పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరారు. >Share it
విశాఖ నుంచి సంక్రాంతి ప్రత్యేక బస్సులను ఈనెల తొమ్మిదవ తేదీ నుంచి నడపనున్నట్లు ఆర్టీసీ విశాఖ రీజనల్ మేనేజర్ బి. అప్పలనాయుడు తెలిపారు. ద్వారక బస్ స్టేషన్, మద్దిలపాలెం, గాజువాక, సింహాచలం డిపోల నుంచి వివిధ ప్రాంతాలకు ప్రత్యేక బస్సు సర్వీసులను నడుపుతామన్నారు. ఈ మేరకు రెండువందల బస్సులను సిద్ధం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. డిమాండ్ను బట్టి రాత్రి వేళల్లో కూడా బస్సులు నడిపే ఆలోచన ఉందన్నారు.
దేశ ప్రధాని నరేంద్ర మోదీ విశాఖకు బుధవారం సాయంత్రం విచ్చేస్తున్న సంగతి తెలిసిందే. జన సమీకరణలో భాగంగా విజయనగరం ఆర్టీసీ డిపో నుంచి 70, ఎస్.కోట డిపో నుంచి 30 చొప్పున..మొత్తం 100బస్సులతో జనాలను తరలించనున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని పార్వతీపురం, సాలూరు, పాలకొండ ఆర్టీసి డిపోల నుంచి మొత్తం 80 బస్సులను ప్రధాని సభకు వైపు మళ్లించినట్లు అధికారులు తెలిపారు.
వచ్చే ఖరీఫ్ సీజన్కు రైతులకు లక్షలోపు వడ్డీ లేని పంట రుణాలు అందించనున్నందున పూర్తి స్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో బ్యాంక్ అధికారులు, పలు శాఖల అధికారులతో డీసీసీ అండ్ జిల్లా స్థాయి సమీక్షా కమిటీ సమావేశం నిర్వహించారు.
రైల్వే విద్యుత్ వైర్లు తగిలి కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న వ్యక్తి సోమవారం మృతి చెందినట్లు రైల్వే జీ ఆర్.పి ఎస్సై బాలాజీ రావు తెలిపారు. ఈ నెల రెండో తేదీన అలమండ రైల్వే స్టేషన్ వద్ద ఆగి ఉన్న గూడ్స్ బండి ఎక్కి OHE విద్యుత్ వైర్లు తాకడంతో తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే విజయనగరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఐదు రోజులుగా చికిత్స పొందుతున్న బాధితుడు సోమవారం మరణించాడని ఆచూకీ తెలిస్తే సంప్రదించాలన్నారు.
Sorry, no posts matched your criteria.