Vizianagaram

News July 21, 2024

నమ్మకం కలిగేలా పని చేయండి: జిల్లా కలెక్టర్

image

ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతులు, సౌకర్యాలు ఉన్నా రోగులు ప్రైవేటు ఆస్పత్రులకు ఎందుకు వెళ్తున్నారని కలెక్టర్ డా.బీ‌ఆర్.అంబేడ్కర్ ప్రభుత్వ వైద్యాధికారులును ప్రశ్నించారు. శనివారం ఆడిటోరియంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప మిగిలిన కేసుల్లో వెళ్లకుండా చూడాలని ఆదేశించారు. నమ్మకం కలిగించేలా పనిచేయాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో శతశాతం ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవకన్నారు.

News July 21, 2024

బొబ్బిలి: కన్న కూతురిపై తండ్రి అత్యాచారయత్నం

image

బొబ్బొలిలో జరిగిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. DSP శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని ఓ కాలనీలో ఇద్దరి కుమార్తెలతో నివాసముంటున్న తండ్రి శుక్రవారం సాయంత్రం మద్యం మత్తులో 11 ఏళ్ల కూతురిపై అత్యాచారయత్నం చేశాడు. ఈ ఘటనపై బాలిక అమ్మమ్మ స్థానికుల సాయంతో తమను ఆశ్రయించగా దర్యాప్తు చేశామన్నారు. బాలికను వైద్యం కోసం ఆస్పత్రికి తరలించి, నిందుతుడిపై పోక్సో కేసు నమోదు చేశామన్నారు.

News July 21, 2024

VZM: విద్యుత్ షాక్‌‌తో తండ్రి, కూతురు మృతి 

image

విద్యుత్ షాక్‌‌తో తండ్రి, కూతురు మృతిచెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డెంకాడ మం. డీ.తాళ్లవలసలో సూర్యారావు కుమార్తె సంధ్యారాణి(23) శుక్రవారం రాత్రి మేడపై ఉన్న బట్టలు తేవడానికి వెళ్లింది. అక్కడ విద్యుత్ వైర్లు తగలడంతో కేకలు వేస్తూ కింద పడింది. అది విన్న సూర్యారావు(55) పైకి వెళ్లాడు. కింద పడి కొట్టుకుంటున్న కుమార్తెను లేపేందుకు యత్నించగా అతను కూడా విద్యుత్‌ షాక్‌కి గురయ్యాడు.

News July 21, 2024

పార్వతీపురం: ప్రొహిబిషన్ & ఎక్సైజ్ డైరెక్టర్‌గా నిశాంత్ కుమార్

image

స్టేట్ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ డైరెక్టర్‌గా నిశాంత్ కుమార్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన ఇప్పటి వరకు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు. జిల్లాలో 2024 సాధారణ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించేందుకు కృషి చేశారు. జిల్లా ఏర్పడిన తర్వాత అన్ని శాఖల సమన్వయంతో జిల్లాను అభివృద్ధి పథంలో తీసుకువెళ్లారని ఈయనకు పేరుంది.

News July 20, 2024

విజయనగరం జిల్లా TOP NEWS @6PM

image

* పార్వతీపురం జిల్లాలో పాఠశాలలకు సెలవు ప్రకటించిన డీఈఓ
* గిరి ప్రదక్షిణ కోసం సింహాచలం చేరుకుంటున్న భక్తులు
* VZM: ఐదు నెలల్లో 87 మంది శిశువులు మృతి
* విజయనగరంలో రద్దీగా సింహాచలం బస్సులు
* VZM: 24 గంటలు బీ అలర్ట్
* విజయనగరంలో వికసించిన బ్రహ్మ కమలాలు
* పార్వతీపురం: ఆర్టీసీ ప్రయాణకులకు అలర్ట్
* విజయనగరంలో 48.2 మి.మీ. వర్షపాతం నమోదు

News July 20, 2024

విజయనగరం: సీజనల్ వ్యాధులపై కలెక్టర్ సమీక్ష

image

కలెక్టరేట్ ఆడిటోరియంలో శనివారం కలెక్టర్ డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ సీజనల్ వ్యాధులపై శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, తాగునీరు కలుషితం కాకుండ చేపట్టాల్సిన చర్యలు డెంగీ మలేరియా ఇతర సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డీసీహెచ్ఎస్, జడ్పీ సీఈవో, డీపీఓ మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

News July 20, 2024

ప్రైవేటు ఆసుప‌త్రుల‌ను త‌నిఖీ చేయాలి: బి.ఆర్ అంబేడ్కర్‌

image

జిల్లాలోని ప్ర‌యివేటు ఆసుప‌త్రుల‌పై నిఘా పెంచాల‌ని క‌లెక్ట‌ర్ బి.ఆర్ అంబేడ్కర్ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన ఆర్‌డీలతో క‌లిసి జిల్లాలోని 108 ప్రైవేటు ఆసుప‌త్రుల‌ను త‌నిఖీ చేసి, త‌న‌కు నివేదిక అంద‌జేయాల‌ని DMHOను ఆదేశించారు. క‌లెక్ట‌రేట్‌లో జిల్లా స్థాయి స‌ల‌హా క‌మిటీ స‌మావేశంలో శనివారం కలెక్టర్ మాట్లాడుతూ.. లింగ నిర్ధార‌ణ చేసిన‌వారిపై కేసులు న‌మోదు చేసి, క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు.

News July 20, 2024

VZM: ఐదు నెలల్లో 87 మంది శిశువులు మృతి

image

శిశు మరణాలను తగ్గించేందుకు ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నప్పటికీ ఆగడం లేదు. కొంతమంది తల్లులకు అవగాహన లోపం..కొన్ని చోట్ల వైద్య సేవల్లో జాప్యంతో శిశు మరణాలు సంభవిస్తున్నాయి. అధికారిక గణాంకాల ప్రకారం జిల్లాలో మార్చి నెల 16, ఏప్రిల్‌లో 17, మే నెలలో 19, జూన్ లో 25, జులై లో 10 శిశు మరణాలు సంభవించినట్లు తెలుస్తోంది. ఇవి తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు DMHO బాస్కరరావు తెలిపారు.

News July 20, 2024

పార్వతీపురం జిల్లాలో పాఠశాలలకు సెలవు ప్రకటించిన డీఈఓ

image

పార్వతీపురం మన్యం జిల్లాలో పాఠశాలలకు డీఈఓ పగడాలమ్మ సెలవు ప్రకటించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వర్షాలు విస్తారంగా కురుస్తున్న నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా జిల్లావ్యాప్తంగా పాఠశాలలకు శనివారం నాడు సెలవు ప్రకటించినట్లు ఆమె తెలిపారు. విద్యార్థులంతా సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని ఆమె కోరారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండి విద్యార్థులు తల్లిదండ్రులు జాగ్రత్తలు వహించాలని ఆమె కోరారు.

News July 20, 2024

VZM: 24 గంటలు Be Alert

image

జిల్లాలో భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లోని వాగులు, గెడ్డలు ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో అన్ని మండలాల తహశీల్దార్, రెవెన్యూ డివిజన్‌లను అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డా.బీ.ఆర్. అంబేడ్కర్ ఆదేశించారు. వాగులు, గెడ్డలు ప్రవాహం కొనసాగుతున్న ప్రదేశాల్లో ఎవరూ వాటిని దాటకుండా, ప్రమాదాలు జరగకుండా 24 గంటల పహారా ఏర్పాట్లు చేయాలన్నారు. భారీ వర్షాల దృష్ట్యా ఈ రోజు అన్నీ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.