Vizianagaram

News January 6, 2025

VZM: జాతీయ పోటీలకు 5 గురు జిల్లా క్రీడాకారులు 

image

జనవరి 8 నుంచి 12 వరకు ఉత్తరాఖండ్‌లో జరగబోయే 50 వ జాతీయ కబడ్డీ పోటీలకు జిల్లా నుంచి 5 గురు క్రీడాకారులు ఎంపికయ్యారని కబడ్డీ సంఘం ఛైర్మన్ ఐవీపీ రాజు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. జూనియర్ బాల, బాలికల విభాగంలో ఎం.రాంబాబు,సి హెచ్. మురళీ, పి.నందిని, వి.సూర్యకల, ఎం. పావని ఎంపికయ్యారన్నారు. వీరు ఆంధ్రప్రదేశ్ కబడ్డీ టీంకు ఎంపికైనందుకు హర్షం వ్యక్తం చేశారు. పోటీల్లో విజయం సాధించాలని ఆకాంక్షించారు.

News January 6, 2025

VZM: పది రోజుల ముందే మొదలైన పండగ సందడి

image

విజయనగరంలో పది రోజుల ముందే పండగ వాతావరణం కనిపిస్తుంది. ముఖ్యంగా నగర ప్రధాన రోడ్లపై జనాలు బారులు తీరుతున్నారు. వస్త్ర దుకాణాలన్నీ జనంతో కిటకిటలాడుతున్నాయి. దీంతో మెయిన్ రోడ్డులో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పాడింది. పోలీసులు దగ్గరుండి ట్రాఫిక్‌ని సరిచేస్తున్నారు. దీంతో విజయనగరం పట్టణంలో సంక్రాంతి పండగ సందడి నెలకొంది. 

News January 6, 2025

VZM: ‘8న జరగాల్సిన పరీక్ష 11కు వాయిదా’

image

కానిస్టేబుల్ పోస్టుల భర్తీలో భాగంగా విజయనగరం పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జరుగుతున్న దేహదారుఢ్య పరీక్షల్లో అధికారులు స్వల్ప మార్పు చేశారు. ఈనెల 8న జరగాల్సిన దేహదారుఢ్య పరీక్షలను 11కి వాయిదా వేసినట్లు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఛైర్మన్ ఎం.రవి ప్రకాశ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి విజయనగరం జిల్లాతో పాటు పీఈటీ పరీక్షలు జరిగే శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో అభ్యర్థులు గమనించాలని కోరారు.

News January 6, 2025

VZM: NDA కో-ఆర్డినేషన్ సమావేశంలో జిల్లా నేతలు

image

ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనను పురస్కరించుకొని విశాఖలో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన కోఆర్డినేషన్ సమావేశంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, మార్క్ ఫెడ్ ఛైర్మన్ కర్రోతు బంగార్రాజు, తదితరులు పాల్గొన్నారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లు, జన సమీకరణ తదితర అంశాలపై కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ పలు సూచనలు అందజేశారు.

News January 5, 2025

పెదమానాపురం గేట్ మధ్యలో చిక్కుకున్న వ్యాన్..!

image

దత్తిరాజేరు మండలం పెదమానాపురం రైల్వే ట్రాక్ మధ్యలో ఆదివారం రాత్రి వ్యాన్ చిక్కుకుంది. నిత్యం రద్దీగా ఉండే ఈ రహదారిపై ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉండడం, రైళ్లు ఎక్కువగా వెళ్లడంతో మాటిమాటికీ గేట్ పడుతుంది. ట్రాఫిక్ క్లియర్ అయ్యేలోపు మళ్ళీ గేట్ వేసే క్రమంలో వ్యాన్ చిక్కుకుంది. దీంతో కాసేపు ఏం జరుగుతుందోనని గందరగోళం నెలకొంది. రైల్వే సిబ్బంది గమనించి ట్రైన్ వచ్చేలోపు గేట్ తీయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

News January 5, 2025

విజయనగరం ఎస్పీ హెచ్చరిక

image

సంక్రాంతి సమీపిస్తున్న నేపథ్యంలో జిల్లాలో ఎక్కడైనా కోడిపందాలు, పేకాట స్థావరాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు. ఆదివారం ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ.. కోడి పందాలు, పేకాటలు నిర్వహించే వారిపై ఇప్పటికే నిఘా ఉంచినట్లు తెలిపారు. గతంలో ఇదే తరహా నేరాలు పాల్పడి అరెస్టు అయిన వారిపై మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ వద్ద బైండోవర్ చేయాలని అధికారులకు ఆయన ఆదేశించారు.

News January 5, 2025

VZM: హైందవ శంఖారావానికి తరలి వెళ్లిన ఉమ్మడి జిల్లా వాసులు

image

విజయవాడలోని కేసరపల్లిలో హైందవ శంఖారావం నినాదంతో భారీ బహిరంగ సభ ఆదివారం జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మహాసభకు ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన పలువురు భక్తులు, హిందూ సంఘాల సభ్యులు విజయవాడకు శనివారం పయనమయ్యారు. విజయనగరం, పార్వతీపురం జిల్లా కేంద్రాల నుంచి ప్రైవేట్ బస్సుల్లో తరలి వెళ్తున్నారు. మరి కొంతమంది ట్రైన్లను ఆశ్రయించారు.

News January 4, 2025

VZM: కానిస్టేబుల్ ఉద్యోగాలు.. 236 మంది గైర్హాజరు..!

image

విజయనగరం పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో మహిళ కానిస్టేబుల్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ శుక్రవారం ప్రశాంతంగా ముగిసింది . మొత్తం 550 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 314 మంది అభ్యర్థులు మాత్రమే PMT, PET పరీక్షలకు హాజరయ్యారు. 236 మంది అభ్యర్థులు గైర్హాజరైనట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. కాగా ఎంపిక ప్రక్రియ శుక్రవారం ఉదయం 5గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు జరిగింది.

News January 4, 2025

మార్చి 8న జాతీయ లోక్ అదాలత్: జిల్లా జడ్జి

image

మార్చి 8న జరగబోయే జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి కళ్యాణ్ చక్రవర్తి పిలుపునిచ్చారు. శుక్రవారం తన ఛాంబర్ లోని పలు ప్రైవేట్ చిట్ ఫండ్ ఫైనాన్స్ కంపెనీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఫైనాన్స్ కంపెనీకి చెందిన కేసులన్నీ లోక్ అదాలత్ లో పరిష్కరించుకోవాలని సూచించారు. ఎక్కువ కేసులు రాజీ చేసుకునే ప్రయత్నం చేయాలన్నారు.

News January 3, 2025

VZM: చిన్నారిపై అత్యాచారం కేసులో 25 ఏళ్ల జైలుశిక్ష

image

విజయనగరం జిల్లాలో సంచలనం రేపిన చిన్నారిపై అత్యాచారం కేసులో నిందితుడికి 25ఏళ్లు జైలుశిక్ష విధిస్తూ జిల్లా ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి నాగమణి తీర్పు ఇచ్చినట్లు DSP శ్రీనివాసరావు చెప్పారు. రామభద్రపురం మండలం నేరేళ్లవలసలో బి.ఎరకన్నదొర గతేడాది ఉయ్యాలలో ఉన్న బాలికపై అత్యాచారం చేశాడు. జైలుశిక్ష పడడంతో ప్రజలు, ప్రజా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. జైలుశిక్షతో పాటు రూ.5వేలు జరిమానా విధించారు.