India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఏపీ గురుకుల విద్యాలయాల జోన్-1 ఆటలపోటీలు నెల్లిమర్ల ఎంజేపీఎపి బాలికల పాఠశాలలో ఈనెల 5, 6 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు కన్వీనర్ ప్రిన్సిపల్ డా.కేబీబీ రావు తెలిపారు. విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన 14 పాఠశాలల విద్యార్థులు పోటీల్లో పాల్గొంటారన్నారు. వాలీబాల్, కబడ్డీ, షటిల్, రన్నింగ్ తదితర అంశాల్లో పోటీలు ఉంటాయన్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.
స్టెఫెండరీ మహిళా పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగ నియామకాలకు ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు PMT, PET పరీక్షల ప్రక్రియ ప్రారంభమయ్యాయి. స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన ఎంపిక ప్రక్రియను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పరిశీలించారు. అభ్యర్థులకు కల్పించిన ఏర్పాట్లను పరిశీలించారు. ఎంపిక ప్రక్రియకు ప్రత్యేక మహిళ సిబ్బందిని నియమించినట్టు ఎస్పీ తెలిపారు.
స్థానిక రాజీవ్ క్రీడా ప్రాంగణంలో ఈనెల 5 మధ్యాహ్నం 2 గంటలకు ఉమ్మడి విజయనగరం జిల్లా సీనియర్ బాలుర వాలీబాల్ జట్టు ఎంపిక నిర్వహించనున్నట్లు జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు జి.సూరిబాబు, కేవీఏఎన్.రాజు తెలిపారు. క్రీడాకారులు అందరూ ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలకు తప్పక హాజరు కావాలని సూచించారు. ఎంపికైన క్రీడాకారులు త్వరలో రాష్ట్రంలో జరిగే వివిధ సీనియర్ రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తామన్నారు.
విజయనగరం పట్టణంలోని గాంధీనగర్ కాలనీలో హృదయ విధారక ఘటన చోటు చేసుకుంది. తన 10 నెలల చిన్నారికి ఆరోగ్యం బాగోలేకపోవడంతో తల్లడిల్లిన తల్లి అన్నపూర్ణ దిష్టి తీసి డాబాపైకి వెళ్లి విసిరే క్రమంలో విద్యుత్ వైర్లు తగిలి తీవ్ర గాయాల పాలై చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటన డిసెంబర్ 28న జరగగా విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతూ జనవరి 1న ఆమె మృతి చెందింది. SI అశోక్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
విజయనగరం జిల్లాలో సౌర విద్యుత్ను ప్రోత్సాహించేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. ముందుగా 51 వేల ఎస్సీ, ఎస్టీ గృహాలకు ఫిబ్రవరి నెలాఖరిలోగా సౌర విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడమే లక్ష్యంగా అధికారులు పెట్టుకున్నారు. రాయతీపై ఆయా కుటుంబాలకు యూనిట్లను ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. దరఖాస్తు చేసిన వారికి సత్వరమే సౌర విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ అంబేడ్కర్ ఆదేశాలు జారీ చేశారు.
విజయనగరం జిల్లాకు చెందిన దంపతులు పెందుర్తి మండలం పురుషోత్త పురంలో ఉరివేసుకుని చనిపోయారు. ఈ ఘటన బుధవారం రాత్రి జరిగింది. చీపురుపల్లికి చెందిన సంతోష్ (35) విశాఖకు చెందిన సంతోష్ శ్రీ (25) లవ్ చేసుకున్నారు. ఆరేళ్ల క్రితం పెళ్లి కాగా పిల్లలు లేరు. దీంతో పాటు ఆర్థిక ఇబ్బందులు ఉండడంతో మనస్తాపం చెంది ఇంట్లోనే ఉరివేసుకుని మృతిచెందారు. పెందుర్తి పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
విజయనగరం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో కానిస్టేబుల్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ గురువారం ప్రశాంతంగా ముగిసింది . మొత్తం 600 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 341 మంది అభ్యర్థులు మాత్రమే PMT, PET పరీక్షలకు హాజరయ్యారు. రెండో రోజు 259 మంది అభ్యర్థులు గైర్హాజరైనట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. కాగా ఎంపిక ప్రక్రియ గురువారం ఉదయం 5గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు జరిగింది.
విజయనగరంలోని NTR నైపుణ్యాభివృద్ధి, మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో గృహిణులు, యువతులకు వివిధ వృత్తి శిక్షణ కోర్సుల్లో ఉచిత శిక్షణకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మేనేజర్ విమల తెలిపారు. 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివిన వారు అర్హులన్నారు. కోర్సుని బట్టి 30 నుంచి 60 రోజుల శిక్షణ వ్యవధి ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన మహిళలు, యువతులు జనవరి 10వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలన్నారు.
టీడీపీ MLC రామచంద్రయ్య కుటుంబాన్ని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ పరామర్శించారు. ఇటీవల రామచంద్రయ్య కుమారుడు విష్ణు స్వరూప్ అకాల మరణం చెందారు. ఈ నేపథ్యంలో కడప కో-ఆపరేటివ్ కాలనీలో ఆయన నివాసంలో బొత్స సత్యనారాయణ రామచంద్రయ్యతో పాటు వారి కుటుంబ సభ్యులను గురువారం పరామర్శించారు. చిన్న వయసులోనే అకాల మరణం చెందడం బాధాకరమని వారి కుటుంబానికి దేవుడు మనోధైర్యం ఇవ్వాలని ఆకాంక్షించారు.
విజయనగరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణిగా డాక్టర్ జీవరాణి గురువారం బాధ్యతలు స్వీకరించారు. విశాఖపట్నం జిల్లా ఇమ్యునైజేషన్ అధికారిణిగా పనిచేసిన ఆమె.. పదోన్నతిపై ఇక్కడకు వచ్చారు. ఈ సందర్భంగా కార్యాలయ అధికారులు, సిబ్బంది ఆమెకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
Sorry, no posts matched your criteria.