Vizianagaram

News March 7, 2025

బాడంగి ఎయిరో డ్రమ్ భూములు పరిశీలన

image

బాడంగి సమీపంలోని ఎయిరో డ్రమ్ భూమితో పాటు చుట్టూ పక్కల ఉన్న భూములలో ఆయుధ భాండాగారాన్ని ఏర్పాటు చేసేందుకు భూములను నావికా దళ జూనియర్ మేనేజర్ చైతన్య, ఆర్డీవో రామ్మోహనరావు శుక్రవారం పరిశీలించారు. బాడంగి మండలం ముగడ, పాల్తేరు, రామచంద్రపురం, మల్లంపేట, పూడివలస, కోడూరు గ్రామాలలో 1,585 ఎకరాల భూమిని సేకరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెప్పారు. వారితో ఎమ్మార్వో సుధాకర్, సిబ్బంది ఉన్నారు.

News March 7, 2025

విజయనగరం జిల్లా వ్యాప్తంగా 572మంది విద్యార్థులు గైర్హాజరు

image

విజయనగరం జిల్లాలో శుక్రవారం జరిగిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షకు 572మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఆర్.ఐ.ఓ మజ్జి ఆదినారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు జిల్లా వ్యాప్తంగా 19,603 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా 19,031మంది విద్యార్థులు పరీక్షలు రాసినట్లు తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని చెప్పారు.

News March 7, 2025

YS జగన్‌తో విజయనగరం వైసీపీ నాయకుల భేటీ

image

మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, జిల్లా నాయకులు గురువారం భేటీ అయ్యారు. తాడేపల్లిలోని జగన్ క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఉపాధి హామీ చట్టం పరిరక్షణ, ప్రజా ప్రతినిధుల హక్కుల పరిరక్షణకు చేపట్టాల్సిన కార్యాచరణపై మాజీ సీఎం జగన్‌తో చర్చించినట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ మామిడి అప్పలనాయుడు, నేతలు పాల్గొన్నారు.

News March 7, 2025

విజయనగరం జిల్లాలో ఫ్రీ బస్.. మీ కామెంట్

image

RTC ఉచిత బస్సు ప్రయాణాన్ని జిల్లా వరకే పరిమితం చేస్తామని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రకటించారు. ప్రజలు విజయనగరం నుంచి ఎక్కువగా విశాఖకు వెళ్తుంటారు. విశాఖలో ఇంజినీరింగ్ కాలేజీలు ఉండటంతో విద్యార్థినీలు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. మంత్రి ప్రకటన మేరకు వీరంతా విశాఖకు వెళ్లాలంటే టికెట్ కొనాల్సి ఉంటుంది. ఇలా జిల్లా బార్డర్‌లో ఉండే వారికి ఉచిత ప్రయాణం వర్తించదు. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.

News March 7, 2025

రామభద్రపురం: రెండు బైకులు ఢీ.. వ్యక్తి మృతి

image

రామభద్రపురం మండలం తారాపురం టీకాల లచ్చన్న గుడి వద్ద గురువారం రెండు బైక్‌లు ఢీ కొన్నాయి.ఈ ప్రమాదంలో ప్రసాద్ వర్మ(42) మృతిచెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఉత్తరప్రదేశ్‌కు చెందిన రామగోపాల్, ప్రసాద్ వర్మ ఇద్దరూ కలిసి ద్విచక్ర వాహనంపై బొబ్బిలి రైల్వేస్టేషన్‌కు వెళ్తుండగా వారికి ముందు వెళ్లుతున్న బైక్ స్లో కావడంతో రెండు బైకులు ఢీకొన్నాయి. వెనుక కూర్చున్న ప్రసాద్ వర్మ మృతి చెందినట్లు SI ప్రసాద్ తెలిపారు.

News March 7, 2025

VZM: జిల్లాలో నామినేటెడ్ పదవులు ఎవరికి దక్కేనో..?

image

మార్చిలోగా నామినేటెడ్ పదవుల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు ఇటీవల స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఆ దిశగా అధిష్ఠానం కసరత్తు ప్రారంభించింది. అయితే జిల్లాలో నామినేటెడ్ పదవులు ఎవరికి వరిస్తాయోనన్న చర్చ జోరుగా సాగుతుంది. ప్రధానంగా ఎస్.కోట నుంచి గొంప కృష్ణ, చీపురుపల్లి నుంచి కిమిడి నాగార్జున గత ఎన్నికల్లో టికెట్ ఆశించారు. జనసేన, బీజేపీలో కూడా ఆశావహులు ఉన్నట్లు చర్చ జరుగుతోంది.

News March 7, 2025

VZM: ‘పోల‌వ‌రం ప్ర‌ధాన కాల్వ భూసేక‌ర‌ణ ప్రారంభించాలి’

image

ఉత్త‌రాంధ్ర సుజ‌ల స్ర‌వంతి ప్రాజెక్టులో భాగంగా జిల్లాలో పోల‌వరం ప్ర‌ధాన కాల్వ నిర్మాణానికి అవ‌స‌ర‌మైన భూసేక‌ర‌ణ ప్ర‌క్రియ‌ను వెంట‌నే ప్రారంభించాల‌ని క‌లెక్ట‌ర్ అంబేడ్కర్ రెవిన్యూ అధికారుల‌ను ఆదేశించారు. భూసేక‌ర‌ణ‌పై క‌లెక్ట‌ర్ గురువారం త‌న ఛాంబ‌రులో జ‌ల‌వ‌న‌రుల శాఖ‌, భూసేక‌ర‌ణ అధికారుల‌తో స‌మీక్షించారు. విజయనగరం జిల్లాలోని మూడు భూసేక‌ర‌ణ యూనిట్ల ఆధ్వ‌ర్యంలో శుక్ర‌వారం నుంచే ప్రారంభించాలన్నారు.

News March 6, 2025

విజయనగరం: ‘లెక్కలు పరీక్షకు 999 మంది గైర్హాజరు

image

విజయనగరం జిల్లాలో 66 కేంద్రాల్లో గురువారం జరిగిన ఇంటర్ మొదటి సంవత్సరం లెక్కలు పరీక్షకు 999 మంది విద్యార్థులు గైర్హాజరు అయ్యారని ఆర్‌ఐ‌వోఎం ఆదినారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా లెక్కలు పరీక్షకు 23,044 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా వారిలో 22,045 మంది మాత్రమే హాజరయ్యారని పరీక్ష ఏటువంటి అవాంచనీయ ఘటనలు లేకుండా ప్రశాంతంగా జరిగిందని తెలిపారు.

News March 6, 2025

VZM: జిల్లా జడ్జిలతో ప్రధాన న్యాయమూర్తి సమావేశం

image

పట్టణంలోని స్థానిక జిల్లా కోర్టులో జడ్జిలతో జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి కళ్యాణ్ చక్రవర్తి గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 8న జరగనున్న జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. రాజీకు వచ్చే క్రిమినల్, మోటార్, ప్రమాద బీమా, బ్యాంక్, చెక్ బౌన్స్, తదితర కేసులను ఇరు పార్టీల సమక్షంలో పరిష్కరించలన్నారు.

News March 6, 2025

VZM: ఈ నెల 8 నుంచి 18 వరకు పి-4 సర్వే

image

పబ్లిక్ ప్రైవేటు పీపుల్స్ పార్టిసిపేషన్‌( పి-4) సర్వే ఈ నెల 8 నుంచి 18 వరకు జరుగుతుందని కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పి-4 సర్వే పై అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. స్వర్ణాంధ్ర సాధనకు 10 సూత్రాలను ప్రభుత్వం అమలు చేస్తోందని, ప్రధానంగా జీరో పేదరికం లక్ష్యంలో భాగంగా ప్రభుత్వం పి-4 కార్యక్రమం చేపడుతోందని కలెక్టర్ తెలిపారు.