Vizianagaram

News January 1, 2025

జియ్యమ్మవలస: RPF కానిస్టేబుల్ అనుమానాస్పద మృతి

image

పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ అనంత నాయుడు అనుమానాస్పద రీతిలో మంగళవారం మృతి చెందారు. నల్గొండలో అక్కడి రైలు పట్టాలపై మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. నాయుడు మృతితో స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News January 1, 2025

మరికొద్ది రోజుల్లోనే నదుల అనుసందానం: మంత్రి

image

సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయం వలన నూతన సంవత్సరానికి ముందుగానే పండగ వాతావరణం ఏర్పడిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. రాష్ట్ర ప్రజలకు మంగళవారం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నదుల అనుసంధానం అనేది ఎన్డీఏ ప్రభుత్వ విధానమని, మరి కొద్ది రోజుల్లోనే ఏపీలో నదుల అనుసంధానం కార్యక్రమం పట్టాలు ఎక్కబోతుందని మంత్రి తెలిపారు.

News December 31, 2024

VZM: రెండో రోజు 280 మంది అభ్యర్థులు గైర్హాజరు

image

విజయనగరం పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో కానిస్టేబుల్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ రెండో రోజు కొనసాగింది. మొత్తం 600 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 320 మంది అభ్యర్థులు మాత్రమే PMT, PET పరీక్షలకు హాజరయ్యారు. రెండో రోజు 280 మంది అభ్యర్థులు గైర్హాజరైనట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. కాగా ఎంపిక ప్రక్రియ మంగళవారం ఉదయం 5గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరుకు జరిగింది.

News December 31, 2024

VZM: కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన ప్రజాప్రతినిధులు

image

ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు నూతన సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసేందుకు వచ్చిన శ్రేయోభిలాషులను ఉద్దేశించి బొకేలు, శాలువాలు, పూలదండలు, స్వీట్లు తేవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. పేద విద్యార్థులకు అవసరమైన విద్యా సామాగ్రిని మాత్రమే తేవాలని పిలుపునిచ్చారు. దాదాపు ప్రజా ప్రతినిధులు అందరూ ఈ సందేశాన్నే ప్రజల్లోకి తీసుకెళ్లారు.

News December 31, 2024

కష్టపడి వారికే నామినేటెడ్ పదవులు: అశోక్

image

పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారికే అధిష్టానం నామినేటెడ్ పదవులు ఇస్తుందని పొలిట్ బ్యూరో సభ్యులు పి.అశోక్ అన్నారు. విజయనగరం అశోక్ బంగ్లాలో మంగళవారం జిల్లా అధ్యక్షుడు నాగార్జున అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. టీడీపీ కోసం కష్టపడి పని చేసిన వారికి మాత్రమే నామినేటెడ్ పదవులకు సిఫార్సులు చేయాలని ఎమ్మెల్యేలకు సూచించారు. సభ్యత్వ నమోదు విజయవంతంగా జరిగిందన్నారు. సమావేశంలో మంత్రి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

News December 31, 2024

VZM: వాటి ఉనికి దాదాపు కనుమరుగు..!

image

కొత్త సంవత్సరం వస్తోందంటే వారం పది రోజుల ముందు గ్రీటింగ్ కార్డులు, రంగుల దుకాణాల వద్ద సందడి నెలకొని ఉండేది. ఆత్మీయులకు శుభాకాంక్షలు తెలిపేందుకు గ్రీటింగ్ కార్డులు కొనుగోలు చేసి వారం ముందే పోస్టుల్లో పంపేవారు. అందుబాటులో ఉన్నవారికి స్వయంగా ఇచ్చేవారు. హీరో, హీరోయిన్ల ఫొటోలతో కూడిన గ్రీటింగ్స్‌కు మంచి గిరాకీ ఉండేది. ప్రస్తుతం సెల్ మోజులో పడి దాదాపు ఆ సందడి కనుమరుగయ్యిందనే చెప్పాలి. 

News December 31, 2024

VZM: న్యూ ఇయర్ హంగామా

image

పాత సంవత్సరం పూర్తి కావడానికి మరికొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది. డిసెంబర్ 31వ తేదీ అంటే తెలియని సంతోషం అందరిలో కలుగుతుంటుంది. ఇంటి ముంగిట రంగుల ముగ్గులు అద్దుతూ కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతుంటారు. మరీ ముఖ్యంగా యువత పర్యాటక ప్రాంతాలను సందర్శించి అర్ధరాత్రి 12 గంటలకు కేకును కట్ చేస్తూ సంబరాలు చేసుకుంటారు. మరి ఈ ఏడాది మీ న్యూ ఇయర్ ప్లాన్ ఏంటి? కామెంట్ చేయండి.

News December 31, 2024

VZM: 2024@ కొత్త ఎమ్మెల్యేలకు అవకాశం

image

2024 ఏడాది వెళ్తూ వెళ్తూ కొత్త ఎమ్మెల్యేలకు అవకాశం ఇచ్చింది. కూటమి తరఫున విజయనగరం, నెల్లిమర్ల, గజపతినగరం, పార్వతీపురం, కురుపాం, బొబ్బిలి, సాలూరులో పోటీ చేసిన అదితి, లోకం నాగమాధవి, కొండపల్లి శ్రీనివాస్, విజయచంద్ర, తోయిక జగదీశ్వరి, బేబినాయన, సంధ్యారాణి ఎన్నికల్లో ఘన విజయం సాధించి తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. వీరిలో కొండపల్లి శ్రీనివాస్, సంధ్యారాణికి మంత్రి పదవులు కూడా దక్కాయి.

News December 31, 2024

హత్య కేసులో నిందితునికి జీవిత ఖైదు: ఎస్పీ

image

గంట్యాడ పోలీసు స్టేషనులో 2023 సంవత్సరంలో నమోదైన హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు, రూ.2,500 జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు చెప్పిందని ఎస్పీ వకుల్ జిందల్ సోమవారం తెలిపారు. గంట్యాడ మండలం తాడిపూడికి చెందిన పదాల సత్యనారాయణ భార్యతో గొడవలు కారణంగా మామ అప్పలస్వామిని కత్తితో పొడిచి చంపడంతో కేసు నమోదు చేసి నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టగా, నేరం రుజువు కావడంతో పై విధంగా శిక్ష ఖరారైందని చెప్పారు.

News December 31, 2024

ఆ కేసులు సత్వరమే పరిష్కారం కావాలి: మంత్రి కొండపల్లి

image

ఎస్.సి, ఎస్.టి అత్యాచారాలపై నమోదైన కేసులు సత్వరమే పరిష్కారం చేయాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా స్థాయి విజిలెన్సు అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం సోమవారం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ ఎస్.సి., ఎస్.టి వర్గాల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం అంకిత భావంతో పని చేస్తోందని తెలిపారు. వారి రక్షణకు రూపొందించిన చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.