Vizianagaram

News July 16, 2024

నేటి నుంచి పారిశుద్ధ్య వారోత్సవాలు ప్రారంభం: కలెక్టర్

image

ప్రజల భాగస్వామ్యంతోనే పారిశుద్ధ్య వారోత్సవాలు విజయవంతం అవుతాయని పార్వతీపురం కలెక్టరు ఎ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. జూలై 16వ తేదీ నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు పారిశుద్ధ్య వారోత్సవాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. వారోత్సవాల ఏర్పాట్లు, సన్నద్ధతపై అధికారులతో సోమవారం కలెక్టరు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.

News July 15, 2024

విజయనగరం జిల్లాలో 83 పోస్టల్ ఉద్యోగాలు

image

పదో తరగతి అర్హతతో పోస్టల్‌లో BPM/ABPM ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. విజయనగరం డివిజన్‌లో 43, పార్వతీపురం డివిజన్‌లో 40 పోస్టులను పోస్టల్ డిపార్ట్‌‌మెంట్ భర్తీ చేయనుంది. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. ఎంపికైన వారికి బీపీఎం అయితే రూ.12 వేలు+అలవెన్సులు, ఏబీపీఎం అయితే రూ.10 వేలు+అలవెన్సులు జీతంగా ఇవ్వనున్నారు. పూర్తి వివరాలకు https://indiapostgdsonline.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు. >Share It

News July 15, 2024

VZM: పాము కాటు.. చికిత్స పొందుతూ మహిళ మృతి

image

గంట్యాడ మండలం పెనసాంకి చెందిన కడుపుట్ల రమణమ్మ గత నెల 28న పొలంలో పనులు చేస్తున్న సమయంలో పాముకాటుకు గురైంది. వైద్యం కోసం విజయనగరం ఆసుపత్రిలో చేరిందని, అనంతరం మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్ తరలించారని గంట్యాడ ఎస్సై సురేంద్ర నాయుడు తెలిపారు. ఆమె ఈరోజు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వెల్లడించారు. ఆమె మేనల్లుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

News July 15, 2024

నెల్లిమర్ల ఎమ్మెల్యే మాధవిని సత్కరించిన పవన్ కళ్యాణ్

image

నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవికి ఘన సత్కారం లభించింది. తాడేపల్లి జనసేన కార్యాలయంలో జనసేన ప్రజా ప్రతినిధుల సత్కార సభ సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధకి జనసేన అధినేత, డిప్యూటీ సీఎం కొణెదల పవన్ కళ్యా‌ణ్ దుశ్శాలువ కప్పి పుష్పగుచ్చం అందించి సత్కరించారు. ఈ సందర్భంగా సార్వత్రిక ఎన్నికలలో ఘనవిజయం సాధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలను పవన్ సత్కరించారు.

News July 15, 2024

విజయనగరంలో ఇద్దరు చిన్నారులు మిస్సింగ్

image

విజయనగరం పట్టణానికి చెందిన బూర ప్రసాద్, దొడ్డిరేసి రాఘవేంద్రరావు అనే ఇద్దరు పిల్లలు కనబడడం లేదని స్థానిక 1వ పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. వారి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై హరిబాబు నాయుడు సోమవారం తెలిపారు. పిల్లల ఆచూకీ తెలిసిన వారు విజయనగరం 84990 04114, 91211 09419 ఫోన్ నంబర్లకు తెలియజేయాలని కోరారు.

News July 15, 2024

గుమ్మలక్ష్మీపురంలో యూట్యూబర్ హర్షసాయి పేరిట ఛీటింగ్

image

యూట్యూబర్ హర్షసాయి పేరిట గుమ్మలక్ష్మీపురం మండలం టిక్కబాయికి చెందిన బిడ్డిక సోమేశ్ సైబర్ మోసానికి గురయ్యాడు. హర్షసాయి హెల్పింగ్ టీమ్ నుంచి రూ.3 లక్షలు సాయం చేస్తామని యువకుడి ఫోన్ కు మెసేజ్ వచ్చింది. ఖాతా నిర్ధారణకు రూ.1150 వేయాలని కోరగా సోమేశ్ నగదు చెల్లించాడు. తొలి విడత లక్ష వేసినట్లు నకిలీ స్క్రీన్ షాట్ పంపించారు. జీఎస్టీ లేని కారణంగా నగదు జమకాలేదని.. మరికొంత వేయాలనగా నగదు చెల్లించి మోసపోయాడు.

News July 15, 2024

విజయనగరం: గత రెండేళ్లలో జరిగిన అత్యాచారాలు ఎన్నంటే..!

image

రామభద్రపురంలో ఆదివారం 6నెలల చిన్నారిపై జరిగిన ఘటన తల్లుల గుండెల్ని పిండేస్తోంది.అయితే విజయనగరం జిల్లాలో 18 ఏళ్లకు పైబడిన వారికి సంబంధించి 2022లో 179,2023లో 108 లైంగిక వేధింపులు కేసులు నమోదయ్యాయి. మరోవైపు గత రెండేళ్లగా మైనర్లపై 57 అత్యాచారాలు జరిగినట్లు నివేదిక చెప్తోంది. ప్రేమ పేరుతో కొందరు మృగాళ్లుగా ప్రవర్తిస్తుంటే, మరికొందరు బంధువులే తమ కామ వాంఛలకు ముక్కపచ్చలారని చిన్నారులను కాటేస్తున్నారు.

News July 15, 2024

తాటిపూడి జలాశయంలో మృతదేహం కలకలం

image

గంట్యాడ మండలంలోని తాటిపూడి జలాశయంలో గుర్తు తెలియని మృతదేహం ఆదివారం సాయంత్రం లభ్యమైందని గంట్యాడ ఎస్‌.ఐ సురేంద్ర నాయుడు తెలిపారు. మృతుని వయస్సు సుమారు 45 – 50 మధ్య ఉంటుందన్నారు. మూడు రోజుల క్రితమే ఈ సంఘటన జరిగి ఉంటుందని ప్రాథమిక నిర్ధారణలో తెలిపారు. స్థానిక VRO సమాచారంతో కేసు నమోదు చేసి మృతదేహాన్ని విజయనగరం కేంద్ర ఆస్పత్రికి తరలించామన్నారు. ఆచూకీ తెలిసినవారు పోలీస్ స్టేషన్‌‌ను సంప్రదించాలన్నారు.

News July 15, 2024

నెల్లిమర్ల: రోడ్డుప్రమాదంలో మహిళ మృతి

image

బైక్‌ను లారీ ఢీకొనడంతో ఓ మహిళ మృతిచెందిన ఘటన నెల్లిమర్ల మండలం వల్లూరు సమీపంలో జరిగింది. సతివాడ గ్రామానికి చెందిన శారద(39) రణస్థలం మండలం గిడిజాలపేటలోని బంధువుల అంత్యక్రియలకు కుమారుడు చందుతో కలిసి వెళ్లారు. తిరిగి వస్తున్న క్రమంలో వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. కొంతదూరం బైక్‌ను లారీ ఈడ్చుకెళ్లింది. శారద అక్కడికక్కడే మృతిచెందగా చందు గాయపడ్డాడు. ఎస్ఐ రామ గణేశ్‌ కేసు నమోదు చేశారు.

News July 15, 2024

బల్లంకిలో పసలమ్మ పండుగ మహోత్సవం

image

వేపాడ మండలం బల్లంకి గ్రామంలో ఆదివారం సాయంత్రం పసలమ్మ పండగ ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ వరలక్ష్మీ కనకరాజు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దల సమక్షంలో అమ్మవారి పండుగ జరుపుకున్నారు. పూర్వీకుల సాంప్రదాయం మేరకు ప్రతి ఏటా ఖరీఫ్ సాగుకు వరి నారు వేసిన అనంతరం ఆదివారం పశువుల పండుగ చేయడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. పంటలు సమృద్ధిగా పండాలని అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటామని గ్రామస్థులు చెప్పారు.