India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆకాశమే హద్దుగా సంద్రంలో నావికాదళం చేసే యాక్షన్-ప్యాక్డ్ క్షణాలను తిలకించేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని నేవీ అధికారులు పిలుపునిచ్చారు. విశాఖ ఆర్కే బీచ్లో జనవరి 4న(2025) సాయంత్రం 4 గంటలకు మెరైన్ కమాండోలు, NCC క్యాడెట్లు, నావల్ బ్యాండ్ అద్భుతమైన విన్యాసాలు చేయనున్నట్లు ప్రకటించారు. దీనిలో భాగంగా ఈనెల 28,29, జనవరి 2న రిహార్సల్స్ చేయనున్నట్లు వెల్లడించారు. >Share it
ఎస్.కోట మండలం రాజీపేటకి చెందిన వాడుబోయిన ఎర్రినాయుడు (19) పై పోక్సో కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, మోసగించాడని యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతని మీద కేసు నమోదు చేశామని సీఐ మూర్తి తెలిపారు. అతడిని కాపు సోంపురం వద్ద మంగళవారం అదుపులోకి తీసుకొని విచారణ నిమిత్తం విజయనగరం డీఎస్పీ వద్దకు తీసుకెళ్ళగా అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు.
విజయనగరం – కోరుకొండ రైల్వే స్టేషన్ మధ్యలో సారిక సమీపంలో పట్టాలు పక్కన గుర్తు తెలియని మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది. రైల్వే ఎస్ఐ బాలాజీరావు వివరాలు మేరకు.. వయసు 25-30 ఏళ్ల మధ్యలో, ఐదు అడుగులున్న ఎత్తు ఉంటుంది. ఆమె వివరాలను గుర్తించిన వారు స్థానిక పోలీస్ స్టేషన్లలో సంప్రదించాలని కోరారు.
విజయనగరం జిల్లాలో వివిధ పోలీసు స్టేషన్లలో పని చేస్తున్న పోలీసు అధికారులతో మాసాంతర నేర సమీక్షను ఎస్పీ వకుల్ జిందల్ పోలీసు కార్యాలయంలో మంగళవారం నిర్వహించారు. ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ.. గంజాయి రవాణ నియంత్రణలో కఠినంగా వ్యవహరించాలని, రవాణకు పాల్పడిన వారిని అరెస్టు చేస్తూనే, వారికి గంజాయి సరఫరా చేసిన వ్యక్తులు, మధ్యవర్తులుగా వ్యవహరించిన వారిని గుర్తించాలన్నారు.
బొబ్బిలి హైవేపై అదివారం స్కూటీపై ప్రయాణిస్తున్న యువకుడుని లారీ ఢీ కొట్టింది. గుర్ల మండలం గొలగంకి చెందిన నడిమువలస రాంబాబు (26) బొబ్బిలిలో ఓ శుభకార్యానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రెండు రోజులుగా ప్రాణాలతో పోరాడి హాస్పిటల్లో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమారై ఉన్నారు. దీంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఉత్తరాంధ్ర భక్తుల ఇలవేల్పు విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయంలో మంగళవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకుజామున అమ్మవారికి విశేష అర్చనలు జరిపించి, పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలతో సుందరంగా అలంకరించారు. అనంతరం కుంకుమ పూజలు నిర్వహించారు. అమ్మవారి దర్శనానికి భక్తులు సుదూర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చారు.
కొత్తవలస మండలం రామలింగాపురంలో <<14964633>>బ్రైన్ ట్యామర్<<>>తో అఖిర్ నందన్(6) చనిపోయిన విషయం తెలిసిందే. అయితే ఆ బాలుడి తండ్రి అప్పలరాజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు వీరాభిమాని. దీంతో పవన్ కళ్యాణ్ కుమారుడి పేరు కలిసేలా అఖిర్ నందన్ అని తన కుమారిడికి పేరు పెట్టుకుని మురిసిపోయాడు. కానీ విధి ఆడిన వింతనాటకంలో చిన్న వయస్సులో తన కుమారుడు చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఉమ్మడి విజయగనరం జిల్లాలో క్షేత్రస్థాయిలో జనసేన ఇప్పుడిప్పుడే బలం పుంజుకుంటోంది. అయితే జిల్లా అధ్యక్ష పదవికి తీవ్ర పోటీ నెలకొన్నట్లు తెలుస్తోంది. నెల్లిమర్ల MLA లోకం మాధవి భర్త లోకం ప్రసాద్ 2017లో జిల్లా ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వహించగా..2019 ఎన్నికల అనంతరం ఆయన్ను తప్పించారు. ప్రస్తుతం ఈ పదవికి ప్రసాద్తో పాటు అవనాపు విక్రమ్, మర్రాపు సురేశ్, పాలవలస యశస్వి, అయ్యలు, తదితరులు ఆశిస్తున్నట్లు సమాచారం.
ఆరేళ్ల బాలుడు బ్రెయిన్ ట్యూమర్తో మృతి చెందిన ఘటన కొత్తవలస మండలం రామలింగపురంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ పిల్లల అప్పలరాజు, లక్ష్మీ దంపతులకు అకిరా నందన్, జైకృష్ణ ఇద్దరు కుమారులు. అఖిర్ నందన్(6)కు ఆదివారం వాంతులు కావడంతో మెరుగైన చికిత్సకు విశాఖపట్నం తరలించారు. చికిత్స అందించినప్పటికీ సోమవారం బాలుడు మృతి చెందాడు. తల్లిదండ్రులు గ్రామస్థులు కన్నీటి పర్యంతమయ్యారు.
ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకొని యాత్రికులు అరకు వెళ్లేందుకు విశాఖపట్నం నుంచి అరకు ప్రతి శనివారం, ఆదివారం ప్రత్యేక స్పెషల్ రైలు నడుపనున్నట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కే.సందీప్ తెలిపారు. ఈనెల 28 నుంచి వచ్చే ఏడాది 19 వరకు అందుబాటులో ఉంటుందన్నారు. రైలు నంబర్ 08525/26 ఉదయం 8.30 విశాఖలో బయలుదేరి 11.45లకు అరకు చేరుతుందన్నారు. అరకులో మధ్యాహ్నం 2.గంటలకు బయలుదేరి విశాఖకు సాయంత్రం 6 వస్తుందన్నారు.
Sorry, no posts matched your criteria.