Vizianagaram

News July 11, 2024

సీఎం చంద్రబాబు పర్యటన షెడ్యూల్ ఇదే

image

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం ఉదయం 10 గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి 11.20 నుంచి 11.50 వరకు అనకాపల్లి జిల్లాలోని దార్లపూడి వద్ద పోలవరం ఎడమ కాలువను పరిశీలిస్తారు. అనంతరం అక్కడ నుంచి బయలుదేరి 12.35కు భోగాపురం చేరుకుంటారు. 1.30 వరకు ఎయిర్ పోర్టు ప్రాంతాన్ని సందర్శిస్తారు. అనంతరం పనులు జరుగుతున్న తీరుపై అధికారులతో సమీక్షిస్తారు. అనంతరం విశాఖకు వెళ్లనున్నారు.

News July 11, 2024

విజయనగరం: సచివాలయ కార్యదర్శులకు మెమోలు

image

విజయనగరం పట్టణంలోని గోకపేటలో 45వ సచివాలయాన్ని విజయనగరం కమిషనర్ మల్లయ్య నాయుడు బుధవారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇద్దరు సచివాలయ కార్యదర్శులు విధులకు గైర్హాజరు కావడంతో వారికి శ్రీముఖాలు జారీ చేశారు. రికార్డులను సక్రమంగా నిర్వహించకపోవడంపై సిబ్బందిపై మండిపడ్డారు. విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News July 11, 2024

విజయనగరం: టీచర్ ఖాతా నుంచి నగదు మాయం

image

గజపతినగరం మండలానికి చెందిన ఓ ఉపాధ్యాయుడి బ్యాంకు ఖాతా నుంచి సైబర్ నేరగాళ్లు రూ.1.40 లక్షలు తస్కరించారు. ఈ మేరకు ఆయన బుధవారం గజపతినగరం సబ్ ఇన్స్పెక్టర్ మహేశ్‌కు ఫిర్యాదు చేశారు. నగదు ఖాతా నుంచి డెబిట్ అయినట్లు సంక్షిప్త సందేశాలు వచ్చాయని, బ్యాంక్ ఖాతాను పరిశీలిస్తే సొమ్ము లేదని వాపోయారు.

News July 11, 2024

సీఎం బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన డీఐజీ

image

భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణ పనులను పరిశీలించేందుకు సీఎం నారా చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్న నేపథ్యంలో భద్రతా, బందోబస్తు ఏర్పాట్లను విశాఖపట్నం రేంజ్ డీఐజీ విశాల్ గున్ని బుధవారం పరిశీలించారు. జిల్లా ఎస్పీ దీపిక పాటిల్‌తో కలిసి బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం పోలీస్ అధికారులు, సిబ్బందికి పలు భద్రతాపరమైన సూచనలు అందజేశారు.

News July 10, 2024

VZM: రబ్బరు డ్యామ్‌ వద్ద యువకుడు మృతి

image

పార్వతీపురం జిల్లాలోని జంఝావతి రబ్బరు డ్యామ్‌లో ప్రమాదవశాత్తు జారిపడి యువకుడు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. బుధవారం ఉదయం స్నానానికి వెళ్లిన పార్వతీపురం మండలం మరికి పంచాయతీ కొత్తూరుకి చెందిన కడ్రక గోపాలరావు(25) ప్రమాదవశాత్తు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు కొమరాడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

News July 10, 2024

పద్మనాభం యుద్ధానికి నేటితో 230 ఏళ్లు..!

image

విశాఖపట్నం జిల్లా పద్మనాభంలో 1794 జులై 10న ఆంగ్లేయులు విజయనగరం సంస్థానాధీశులు మధ్య జరిగిన యుద్ధానికి నేటికి 230 ఏళ్లు. ఆ యుద్ధంలో చినవిజయరామరాజుతో పాటు 394 మంది మరణించారు. దీంతో ఆ యుద్ధాన్ని స్కాట్లాండ్ ప్లోడెన్ యుద్ధంతో పోల్చారు. చినవిజయరామరాజును మచిలీపట్నం పంపించడానికి పన్నాగం పన్నగా అతను తన సామంతులతో కలిసి పద్మనాభం వద్ద ఆంగ్లేయులపై యుద్ధం చేసి వీరమరణం పొందారు. అక్కడే ఆయనకు సమాధి నిర్మించారు.

News July 10, 2024

సింహాద్రి అప్పన్న గిరిప్రదక్షిణ రూట్ మ్యాప్ ఇదే

image

ఈనెల 20న జరిగే సింహాద్రి అప్పన్న గిరి ప్రదర్శనకు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. 32 కిలోమీటర్ల మేర జరిగే ప్రదక్షిణలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. సింహాచలం, అడివివరం, బి.ఆర్.టీ.ఎస్ రహదారి మీదుగా, ముడసర్లోవ, హనుమంతువాక, వెంకోజిపాలెం, సీతమ్మధార, మాధవధార, ఎన్.ఎ.డి కూడలి నుంచి గోపాలపట్నం మీదుగా సింహాచలం వరకు భక్తులు కాలి నడకన చేరుకుంటారు. > Share it

News July 10, 2024

ప్రతిభ చూపితే భవిత విద్యార్థులదే: డీఈవో

image

ప్రతిభ చూపితే భవిత విద్యార్థుల దేనని జిల్లా విద్యాశాఖ అధికారిని జి.పగడాలమ్మ పేర్కొన్నారు. విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనలు పెంపొందించేందుకు విద్యార్థి విజ్ఞాన్ మందన్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆమె తెలిపారు. 6-11 తరగతి విద్యార్థులకు అర్హులని వెల్లడించారు. సెప్టెంబర్ 15 వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని అన్నారు.

News July 10, 2024

సీఎం చంద్రబాబు భోగాపురం పర్యటన వివరాలు

image

ఈనెల 11న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విజయనగరం జిల్లా భోగాపురంలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12.35 గంటలకు ఆయన హెలికాప్టర్లో భోగాపురం చేరుకుంటారు. 12.35 నుంచి 1.30 వరకూ భోగాపురం విమానాశ్రయ నిర్మాణ పనులను పరిశీలించి, సమీక్షిస్తారు. 1.35 నిమిషాలకు హెలిపాడ్‌కు చేరుకుని విశాఖపట్నం బయలుదేరి వెళ్తారు.

News July 10, 2024

VZM: రోడ్డు ప్రమాదంలో విశ్రాంత పశువైద్యాధికారి మృతి

image

పూసపాటిరేగ మండలం చోడమ్మఅగ్రహారం వద్ద హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో విశ్రాంత పశువైద్యాధికారి మృతి చెందారు. శ్రీకాకుళం నుంచి విశాఖ వెళ్తున్న లారీని వెనుక నుంచి కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో విశ్రాంత పశువైద్యాధికారి పక్కి నర్సింగరావు మృతి చెందగా.. డ్రైవర్ గాయాలతో బయటపడ్డాడు. మృతుడిని విశాఖ జిల్లా మర్రిపాలెం చెందినవారుగా పోలీసు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.