Vizianagaram

News December 24, 2024

విజయనగరం: జిల్లాలో మూడు రోజుల‌పాటు భారీ వ‌ర్షాలు

image

విజయనగరం జిల్లాలో రానున్న మ‌రో మూడు రోజుల‌ు భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని, జిల్లా యంత్రాంగ‌మంతా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ బి.ఆర్ అంబేడ్కర్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. సోమ‌వారం ఒక మోస్త‌రు వ‌ర్షాలు, మంగ‌ళ‌, బుధ‌వారాల్లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చిరిక‌ల నేప‌థ్యంలో రైతులంతా త‌గిన జాగ్ర‌త్త‌ల‌ను తీసుకోవాల‌ని ఓ ప్ర‌క‌ట‌న‌లో క‌లెక్ట‌ర్‌ కోరారు.

News December 23, 2024

VZM: యువతకు దారి చూపిస్తున్న రిటైర్డ్ ఆర్మీ అధికారి

image

విజయనగరంలో నిరుద్యోగ యువతి, యువకులు కోసం గత రెండు సంవత్సరాలుగా అలుపెరుగని సాధనతో రామారావు (రిటైర్డ్ ఆర్మీ) ఉద్యోగి నిరుద్యోగులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. ఇతని దగ్గర శిక్షణ పొందిన వందలాది మంది నిరుద్యోగులు ఉద్యోగుల్లో కోలువులు తీరారు. ఇటీవల స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసిన జీడీ ఫలితాలలో మొత్తం 80 విద్యార్థులు ఉద్యోగం సాధించారు. ఈ సందర్భంగా కోచ్ రామారావుని విద్యార్దులు ఘనంగా సన్మానించారు.

News December 23, 2024

విజయనగరం వై జంక్షన్‌లో యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

image

వీటీ అగ్రహారానికి చెందిన మురళీ విజయనగరం వైజంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. ఏఎస్ఐ రామరావు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం ఇంటివద్ద నుంచి బైక్‌పై వెళ్తుండగా అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టాడు. తలకి తీవ్ర గాయం కావడంతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు.

News December 23, 2024

VZM: నేడు జిల్లాకు ఓటర్ల జాబితా పరిశీలకులు రాక

image

ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ కార్యక్రమంపై పరిశీలించే నిమిత్తం ఎలెక్టోరల్ రోల్ పరిశీలకులు, రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్ శేషగిరి బాబు సోమవారం జిల్లాకు వస్తున్నట్టు కలెక్టర్ అంబేద్కర్ తెలిపారు. కలెక్టరేట్లో మధ్యాహ్నం 3-00 గంటలకు జిల్లాలోని ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు, సహాయ అధికారులు, జిల్లాకు చెందిన ఎం.పి., ఎం.ఎల్.ఏ.లు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమేక్షిస్తారన్నారు.

News December 22, 2024

VZM: వారిపై ప్రత్యేక నిఘా

image

గంజాయి అక్రమ రవాణా నివారణకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు VZM పోలీసు యంత్రాంగం తెలిపింది. ఇదివరకే అరెస్ట్ చేసిన వారిపై హిస్టరీ షీట్లను ప్రారంభిస్తామంది. ఏడు మార్గాల్లో 5 చెక్‌పోస్టులతో నిరంతర తనిఖీలు చేస్తున్నట్లు తెలిపింది. గంజాయి సేవించే వారిని, రవాణా చేస్తున్న వారిని ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటామని SP వకుల్ జిందాల్ తెలిపారు. ఇప్పటివరకు 81 కేసులు నమోదు చేసి, 247 మందిని అరెస్ట్ చేశామన్నారు.

News December 22, 2024

భామిని : ఆటో-కారు ఢీ.. ఐదుగురికి గాయాలు

image

పాతపట్నం మండలం కొరసవాడ వద్ద జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే వారు మన్యం జిల్లా భామిని (M) లివిరికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పాతపట్నం నుంచి నవతల వైపు వస్తున్న ఆటోని ఎదురుగా వస్తున్న కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రులను పాతపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు సమాచారం.

News December 22, 2024

VZM: గుండెపోటుతో భవానీ భక్తుడు మృతి

image

విజయవాడలో విషాదం చోటుచేసుకుంది. భవాని దీక్షలు జరుగుతున్న నేపథ్యంలో దీక్ష విరమణకు వచ్చిన ఓ భక్తుడు గుండెపోటుతో మృతి చెందాడు. పోలీసుల వివరాల మేరకు.. విజయనగరం జిల్లా చీపురుపల్లికి చెందిన అప్పలనాయుడు 15 మంది భవానీలతో కలిసి క్యూలైన్‌లో ఉండగా శనివారం గుండెపోటు వచ్చింది. ఈ క్రమంలో అక్కడే ఉన్న పోలీసులు ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించినట్లు సీపీ రాజశేఖర్ బాబు తెలిపారు.

News December 22, 2024

విజయనగరం జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎంపీ కలిశెట్టి

image

విజయనగరం క్రికెట్ అసోషియేన్ అధ్యక్షుడిగా ఎంపి కలిశెట్టి అప్పలనాయుడు ఎన్నికయ్యారు. కార్యదర్శిగా పెనుమత్స సీతారామరాజు, వైస్ ప్రెసిడెంట్‌గా వెంకట లక్ష్మి పతిరాజు, జాయింట్ సెక్రటరీగా దంతులూరి సీతారామరాజు, కోశాధికారిగా సూర్య నారాయణ వర్మ, అపెక్స్ మెంబర్‌గా పిన్నింటి సంతోష్ కుమార్, ప్లేయర్ మెంబర్‌గా కొండపల్లి పైడితల్లి నాయుడు, మహిళా ప్లేయర్ మెంబర్‌గా పాకలపాటి విజయలక్ష్మి ఎన్నికయ్యారు.

News December 22, 2024

విజయనగరం జిల్లా DM&HOగా జీవనరాణి

image

విజయనగరం  జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిగా డాక్టర్ జీవనరాణి నియమితులయ్యారు. DM&HO కార్యాలయంలో శనివారం ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు పని చేసిన ఎస్.భాస్కరరావు పార్వతీపురం మన్యం జిల్లాకు బదిలీ అయ్యారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు పని చేస్తామని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రిలలో మెరుగైన వైద్య సేవలు అందించేలా చూస్తామన్నారు.

News December 22, 2024

11 దేశాల ప్రవాసాంధ్రులతో మంత్రి కొండపల్లి జూమ్ కాన్ఫరెన్స్

image

యూరప్ లోని 11 దేశాల్లో నివసిస్తున్న తెలుగు ప్రతినిధులతో ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శనివారం జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. వివిధ దేశాలలో ప్రవాసాంధ్రుల పరిస్థితులను, కష్టనష్టాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ ప్రవాసాంధ్రుల సమస్యలను పరిష్కరించేందుకు, సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారన్నారు.