Vizianagaram

News December 21, 2024

జియ్యమ్మవలస: ఆ ఇంట విషాదం వర్ణనాతీతం

image

పొలం పనులకు వెళ్లిన అన్నదమ్ములు <<14944957>>కరెంట్ షాక్‌తో మృతి<<>> చెందిన ఘటన జియమ్మవలస మండలం శిఖబడిలో చోటుచేసుకుంది. గ్రామానికి శ్రీనివాసరావు, సింహాచలం శనివారం సాయంత్రం నీరు కట్టడానికి వెళ్లి వారు విగతజీవులయ్యారు. మొత్తం ముగ్గురు అన్నదమ్ముల్లో ఏడాది క్రితం పాముకాటుతో పెద్దన్నయ్య మృతి చెందాడు. ఇప్పుడు ఈ ఇద్దరూ మృతి చెందడంతో ఆ ఇంటికి మగ దిక్కు లేకుండా పోయిందని కుటుంబ సభ్యుల రోదిస్తున్నారు.

News December 21, 2024

పార్వతీపురం: కరెంట్ షాక్‌తో అన్నదమ్ములు మృతి

image

కరెంటు షాక్ తగిలి ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందిన ఘటన జియ్యమ్మవలస మండలం శిఖబడి గ్రామంలో శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికులు అందించిన సమాచారం మేరకు వైకుంఠపు శ్రీను, సింహాచలం అనే ఇద్దరు అన్నదమ్ములు మరువాడలో పొలం పని నిమిత్తం వెళ్లారు. పనులు చేస్తుండగా.. కరెంట్ షాక్ తగిలి మృతి చెందారు. ఈ ఘటన సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News December 21, 2024

పార్వతీపురం: స్పందించి.. ప్రాణాన్ని కాపాడారు..! 

image

ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్యకు యత్నించిన ఓ వ్యక్తిని పార్వతీపురం GRP, RPF పోలీసులు శనివారం కాపాడారు. GRP హెచ్సీ రత్నాకర్ వివరాల ప్రకారం.. పార్వతీపురం బైపాస్ కాలనీకి చెందిన B.తిరుపతిరావు ఆత్మహత్య చేసుకోడానికి బెలగాం స్టేషన్ సమీపంలో పట్టాలపై పడుకున్నాడు. అతనిని గమనించిన గూడ్స్ గార్డు సమాచారమివ్వగా.. వెంటనే స్పందించి ఘటనా స్థలానికి వెళ్లి ఆ వ్యక్తికి కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

News December 21, 2024

ఎస్ కోటలో స్కూళ్లకు సెలవులు

image

తుఫాన్ నేపథ్యంలో ఎస్. కోట మండలంలోని ప్రభుత్వ పాఠశాలలకు శనివారం సెలవు ప్రకటించినట్లు ఎంఈవో నర్సింగరావు తెలిపారు. తుఫాన్ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలకు జిల్లా కలెక్టర్ బి. ఆర్ అంబేడ్కర్ ఆదేశాల మేరకు సెలవు ప్రకటించినట్లు తెలిపారు. కాగా ముందస్తు సమాచారం లేకపోవడంతో శనివారం పాఠశాలలకు యథావిధిగా వెళ్లిన విద్యార్థులు ఇంటి ముఖం పట్టారు. మరి మీ మండలంలో సెలవు ప్రకటించారా ? కామెంట్ చేయండి.

News December 21, 2024

విజయనగరం పోలీసులను అభినందించిన మంత్రి లోకేశ్

image

విజయనగరం పోలీసులకు మంత్రి నారా లోకేశ్ ‘ఎక్స్’ వేదికగా ప్రశంసలు కురిపించారు. బొడ్డవర చెక్ పోస్ట్ వద్ద కేరళ రాష్ట్రానికి తరలిస్తున్న 117 కిలోల గంజాయిని ఎస్.కోట పోలీసులు గురువారం చాకచక్యంగా పట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లోకేశ్ స్పందించారు. సినిమాల్లో స్మగ్లర్ల మాదిరి సెపరేట్ డెన్‌లో రవాణా చేస్తున్న గంజాయిని పట్టుకున్న పోలీసులను అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు.

News December 21, 2024

ముచ్చటైన ముగ్గులకు ఆహ్వానం!

image

ధనుర్మాసం ప్రారంభమైంది. విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన ఈ మాసంలో మహిళలు ఉదయాన్నే ఇంటి వాకిటను శుభ్రం చేసి ముగ్గులు వేస్తారు. న్యూ ఇయర్, సంక్రాంతి వరకు రంగురంగుల రంగవళ్లులను తీర్చిదిద్దుతుంటారు. మరి మీ అందమైన ముగ్గులను మాకు పంపండి. మీ పేరుతో Way2Newsలో మేము పబ్లిష్ చేస్తాం.
● ఇలా పంపండి: ముగ్గు ఫొటో, మీ పేరు, ఊరి పేరు, పాస్‌పోర్టు సైజు ఫొటోను 97036 22022కు వాట్సాప్ చేయండి.

News December 21, 2024

కొత్తవలసలో సెప్టిక్ ట్యాంకులో పడి చిన్నారి మృతి

image

అంగన్వాడీ కేంద్రం వద్ద ఉన్న సెప్టిక్ ట్యాంకులో పడి రెండున్నరేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన శుక్రవారం కొత్తవలసలోని కంటకాపల్లిలో జరిగింది. స్థానికుల కథనం.. ఊళ్లో ఓ పెళ్లి వేడుక జరుగుతోంది. ఆ సమయంలో దశ్వంత్ అటుగా వెళ్తూ గుంతలో పడిపోయాడు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు గుంత నీటితో నిండి ఉంది. ఎవ్వరూ గమనించక పోవడంతో మృతి చెంది సాయంత్రానికి తేలాడు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

News December 21, 2024

VZM: అసభ్య ప్రవర్తన ఆరోపణలతో టీచర్ సస్పెండ్ 

image

కొత్తవలస మండలం వీరభద్రపురం ఎంపీయూపీ పాఠశాల టీచర్ సన్యాసిరావుపై పలు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. తనను కులం పేరుతో తిట్టి అసభ్యకరంగా ప్రవర్తించాడని అదే స్కూల్ టీచర్ వాపోయారు. విద్యార్థినులతో సైతం అసభ్యకరంగా ప్రవర్తించి.. వారికి అసభ్యకరమైన వీడియోలు చూపిస్తున్నారని ఆమె విమర్శించారు. దీంతో సన్యాసిరావును డీఈవో మాణిక్యం నాయుడు సస్పెండ్ చేశారు. ఆ స్కూల్ హెచ్ఎం శ్రీనివాసరావును HM బాధ్యతలు తప్పించారు.

News December 21, 2024

నులక మంచమే సభా వేదిక..!

image

రాష్ట్రానికి డిప్యూటీ సీఎం.. ఓ పార్టీ అధినేత. లక్షలాది మంది అభిమానులున్న పవర్ స్టార్. పవన్ కళ్యాణ్ మరోసారి తన సింప్లిసిటీ చాటుకున్నారు. పార్వతీపురం జిల్లా బాగుజోలలో పర్యటించిన ఆయన బురదలో కాళ్లకు చెప్పులేకుండా కిలో మీటరు నడిచి గిరిజనులతో మమేకమయ్యారు. ఆయన ప్రసంగానికి నులక మంచమే వేదికైంది. తెల్లని లాల్చి.. చలిని తట్టుకోవడానికి ఒంటిపై శాలువా కప్పుకున్నారు. ఈ ఫొటోలను ఆయన అభిమానులు వైరల్ చేస్తున్నారు.

News December 21, 2024

రైతులతో ఫోన్‌లో మాట్లాడిన విజయనగరం కలెక్టర్ 

image

జిల్లాలో చేపడుతున్న ధాన్యం సేకరణ పై జిల్లా కలెక్టర్ డా.బి.ఆర్.అంబేద్కర్ శుక్రవారం రైతులతో ఫోన్లో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. గోనె సంచుల సమస్యలు ఏమైనా ఉన్నాయా అమ్మకాల పై ఏమైనా సమస్యలున్నాయా, డబ్బులు సక్రమంగా అందుతున్నాయా వంటి ప్రశ్నలు వేశారు. ఎటువంటి సమస్యలు లేవని రైతులంతా సానుకూలంగా తెలిపారని కలెక్టర్ స్పష్టం చేశారు.