Vizianagaram

News February 23, 2025

VZM: సబ్ జైలును తనిఖీ చేసిన న్యాయమూర్తి

image

విజయనగరం సబ్ జైలును అదనపు సివిల్ న్యాయమూర్తి టీవీ రాజేష్  తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఖైదీలకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించి పలు చట్టాలపై అవగాహన కల్పించారు. ఖైదీల పట్ల సిబ్బంది గాని తోటి ఖైదీలు కానీ ఎటువంటి వివక్షత చూపించరాదని సూచించారు. ఖైదీల పట్ల వివక్షత చూపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం లీగల్ ఎయిడ్ కేంద్రాన్ని సందర్శించారు.

News February 22, 2025

రైతు ఆత్మహత్యాయత్నం.. విచారణకు కలెక్టర్ ఆదేశం

image

నెల్లిమర్ల మండలం చనుమల్లు పేట గ్రామానికి చెందిన చనుమల్లు అబద్ధం అనే రైతు మ్యుటేషన్ కోసం రెవెన్యూ అధికారులు లంచం డిమాండ్ చేస్తున్నారని, శుక్రవారం నెల్లిమర్ల తహశీల్దార్ కార్యాలయం వద్ద<<15539536>> ఆత్మహత్యాయత్నం<<>> చేసిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనపై కలెక్టర్ అంబేడ్కర్ శనివారం స్పందించారు. విజయనగరం RDOను విచారణా అధికారిగా నియమించి సంఘటన పై సమగ్రంగా విచారణ జరిపి నివేదికను అందించాలని ఆదేశించారు.

News February 22, 2025

విజయనగరం: 10వ తరగతి విద్యార్థి మృతి

image

విజయనగరం జిల్లాలో విషాద ఘటన జరిగింది. డెంకాడ మండలం పినతాడివాడకు చెందిన గంగరాజు కుమారుడు రాజు(17) మెర్సి మిషన్‌ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. పెదతాడివాడలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో జరిగిన శుభకార్యానికి అతను వెళ్లాడు. తిరిగి బైకుపై ఇంటికి వస్తుండగా పెదతాడివాడ, పినతాడివాడ గ్రామాల మధ్య ట్రాక్టర్‌ ట్యాంకర్‌ను ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడటంతో అతను చనిపోయాడు.

News February 22, 2025

 విజయనగరం వైసీపీ ప్రచార కార్యదర్శిగా బొద్దల

image

వైసీపీ విజయనగరం జిల్లా ప్రచార కార్యదర్శిగా బొద్దల సత్యనారాయణను నియమిస్తూ అధిష్టానం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడుకు సత్యనారాయణ కృతజ్ఞతలు చెప్పారు. బొబ్బిలి మండలం ముత్తావలస గ్రామానికి చెందిన సత్యనారాయణ సర్పంచిగా పని చేశారు. వైసీపీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు.

News February 22, 2025

గరివిడి: గుండెపోటుతో కుప్పకూలిన ఉపాధ్యాయుడు

image

గరివిడి మండలంలోని కొండదాడి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు రామారావు(50) గుండెపోటుతో శుక్రవారం మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఉదయం పాఠశాలలో ప్రార్థన ముగిసిన తరువాత అసౌకర్యంగా ఉండడంతో రామారావు బాత్ రూమ్ కు వెళ్లారు. ఒక్కసారిగా ఛాతిలో నొప్పి రావడంతో అక్కడే కుప్పకూలిపోయారు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

News February 22, 2025

VZM: అధికారులకు కలెక్టర్ కీలక ఆదేశాలు

image

విజయనగరం జిల్లాలో టాయిలెట్లు, విద్యుత్ సౌకర్యం లేకుండా ఉన్న ప్రైవేటు భవనాల్లో ఉంటున్న అంగన్వాడీ కేంద్రాలను ఖాళీ చేయించాలని కలెక్టర్ అంబేద్కర్ అధికారులను ఆదేశించారు. వారిని కొత్త భవనాల్లోకి మార్చాలని విద్యుత్ శాఖా, విద్యాశాఖాధికారులకు ఆయన సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో సంబంధిత శాఖాధికారులతో సమావేశం నిర్వహించారు. పాఠశాలల్లోని మరుగుదొడ్లు, విద్యుత్ సదుపాయం లేని జాబితాను అందించాలన్నారు.

News February 21, 2025

విజయనగరం నుంచి కుంభమేళాకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

image

మహా కుంభమేళాకు శుక్రవారం విజయనగరం ఆర్టీసీ బస్టాండ్ నుంచి 70 మంది భక్తులతో రెండు సూపర్ లగ్జరీ బస్సులు బయలుదేరాయి. జిల్లా ప్రజా రవాణాధికారి సీ హెచ్. అప్పలనారాయణ జెండా ఊపి ప్రారంభించారు. కుంభమేళా త్రివేణి సంగమం దర్శించుకుని 27వ తేదీన విజయనగరం చేరుకుంటారని డిపో మేనేజరు శ్రీనివాసరావు తెలిపారు. ఆర్టీసీ ఆదరించిన భక్తులందరికీ ధన్యవాదాలు తెలిపారు.

News February 21, 2025

విజయనగరం జిల్లాలో బ‌ర్డ్ ఫ్లూ లేదు: జేడీ

image

విజయనగరం జిల్లాలో బర్డ్ ఫ్లూ లేదని పశుసంవర్ధక శాఖ జేడీ వైవీ రమణ స్పష్టం చేశారు. కోళ్ల ఫారాల్లో జీవ‌భ‌ద్ర‌త చ‌ర్య‌ల‌పై అవ‌గాహ‌న స‌ద‌స్సు శుక్రవారం నిర్వహించారు. ‘జిల్లాలో గుడ్లు, మాంసం ర‌వాణాపై ఎలాంటి ఆంక్ష‌లు లేవు. ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించడానికి ప్రయత్నిస్తున్నాం. అందరూ చికెన్, గుడ్లు తినవచ్చు’ అని జేడీ సూచించారు. డాక్టర్ మహాలక్ష్మి, డాక్టర్ ఎంబీవీ ప్రకాశ్ పాల్గొన్నారు.

News February 21, 2025

విజయనగరం జిల్లా యువకుడికి జైలుశిక్ష

image

భీమిలి పరిధిలో 2023 నవంబర్ 6న జరిగిన దొంగతనం కేసులో ఓ యువకుడికి జైలుశిక్ష పడింది. విజయనగరం జిల్లా డెంకాడ మండలం గొండేయపాలేనికి చెందిన ఎర్నింటి కృష్ణబాబు(22) తగరపువలస పరిధిలోని వైటీవై ఎలైట్ అపార్ట్మెంట్లో వాత్సాయి నరసింహారాజు నివాసంలో రూ.లక్ష నగదు దొంగలించారు. భీమిలి పోలీసులు దర్యాప్తు చేశారు. నేరం నిరూపణ కావడంతో భీమిలి కోర్టు జడ్జి నిందితుడికి సంవత్సరం జైలుశిక్ష విధించారు.

News February 21, 2025

VZM: రాష్ట్ర స్థాయిలో జిల్లా ర్యాంకులు ఇలా!

image

ప్రభుత్వ పథకాల అమలు, కార్యక్రమాలు, వివిధ శాఖల ద్వారా అందుతున్న సేవలపై ప్రధాన కార్యదర్శి విజయానంద్ ర్యాంకులను విడుదల చేశారు. మద్యం నిర్వహణలో 1వ ర్యాంక్, ఘన వ్యర్ధాల నిర్వహణలో 2వ ర్యాంక్, ఆసుపత్రుల్లో సేవలకు 5వ ర్యాంక్, ఆర్టీసీ బస్ స్టేషన్ల నిర్వహణలో 1వ ర్యాంక్, గ్యాస్ సిలిండర్ల సరఫరాలో 5వ ర్యాంక్, రేషన్ సరుకుల పంపిణీలో 7వ ర్యాంక్, పింఛన్ల పంపిణీలో 18వ ర్యాంక్, అన్న కాంటీన్‌లకు 25వ ర్యాంక్ లభించాయి.