India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి జిల్లాలో శుక్రవారం నలుగురు మంత్రులు పర్యటించనున్నారు. డిప్యూటీ CM పవన్ కళ్యాణ్, మంత్రి గుమ్మడి సంధ్యారాణి పార్వతీపురం మన్యం జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి, NRI వ్యవహారాల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విజయనగరంలో విజ్జీ స్టేడియాన్ని ప్రారంభిస్తారు. ప్రముఖుల పర్యటన నేపథ్యంలో ఉమ్మడి జిల్లా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శుక్రవారం పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. ఉదయం 10:30 గంటలకు కొత్తవలస మండలంలో ఓ ట్రస్ట్కు సంబంధించి వంద పడకల ఆసుపత్రిని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 1:00కు రవాణా శాఖ మంత్రితో కలిసి విజయనగరంలో విజ్జి స్టేడియం ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3:15 గంటలకు స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్లో కొత్త బస్సులను ప్రారంభిస్తారని మంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి.
<<14926757>>Dy.Cm పవన్ కళ్యాణ్ <<>>సాలూరు నియోజకవర్గంలో శుక్రవారం పర్యటించనున్నారు. విశాఖ ఎయిర్ పోర్ట్లో ఉ.9:30కి బయలుదేరి విజయనగరం బైపాస్, రామభద్రపురం, సాలూరు మీదుగా 12:30కు బాగుజోల గ్రామానికి చేరుకుంటారు. 12:30 ఫొటో ఎగ్జిబిషన్, 12:45 రూ.9 కోట్లతో బాగుజోల నుంచి సిరివర రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన, 12:55 సమీప గ్రామాల పరిశీలన, 1:25 బాగుజోలలో మాటామంతి, 2:10 బాగుజోల నుంచి రిటన్ సాలూరు మీదుగా వైజాగ్ చేరుకుంటారు.
ఉమ్మడి విజయనగరం జిల్లాలో Dy.Cm పవన్ కళ్యాణ్ పర్యటనపై తర్జన భర్జన నెలకొంది. గురువారం సాయంత్రం భోగాపురం చేరుకుని PCOలతో మీటింగ్ ఏర్పాటు చేస్తారని తొలుత చర్చ జరిగింది. అయితే ఆ కార్యక్రమం క్యాన్సిల్ అయ్యింది. శుక్రవారం ఉదయం వైజాగ్ చేరుకుని అక్కడ నుంచి రోడ్డు మార్గంలో విజయనగరం, గజపతినగరం, రామభద్రపురం, సాలూరు మీదుగా మక్కువ చేరుకుంటారని తెలుస్తోంది. కాగా దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటనా రాలేదు.
ధనుర్మాసం ప్రారంభమైంది. విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన ఈ మాసంలో మహిళలు ఉదయాన్నే ఇంటి వాకిటను శుభ్రం చేసి ముగ్గులు వేస్తారు. న్యూ ఇయర్, సంక్రాంతి వరకు రంగురంగుల రంగవళ్లులను తీర్చిదిద్దుతుంటారు. మరి మీ అందమైన ముగ్గులను మాకు పంపండి. మీ పేరుతో Way2Newsలో మేము పబ్లిష్ చేస్తాం.
● ఇలా పంపండి: ముగ్గు ఫొటో, మీ పేరు, ఊరి పేరు, పాస్పోర్టు సైజు ఫొటోను 97036 22022కు వాట్సాప్ చేయండి.
ఈనెల 20 తేదీ నుంచి జనవరి 19 తేదీవరకు ఆర్టీసీ కార్గో డోర్ డెలివరీ మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు విజయనగరం ప్రజా రవాణా అధికారి అప్పలనారాయణ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 90 ముఖ్య పట్టణాల్లో డెలివరీ సౌకర్యముందన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయనగరంలో రేపు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. సమీప బుకింగ్ కౌంటర్ నుంచి పది కిలోమీటర్ల వరకు 50 కిలోల బరువు గల పార్సిళ్లను ఇంటికే అందజేస్తారని చెప్పారు.
బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడింది. ఈక్రమంలో విజయనగరం జిల్లాలో రానున్న మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరంలో 55 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని ప్రభుత్వ అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురువారం భోగాపురం రానున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పర్యటనలో భాగంగా భోగాపురానికి నేడు రాత్రి చేరుకుంటారు. ఈ నేపథ్యంలో చేయాల్సిన బందోబస్తు ఏర్పాట్లను డీఎస్పీ శ్రీనివాసరావు సిబ్బందితో ఇప్పటికే సమీక్షించారు. ప్రధాన కూడళ్ల వద్ద బందోబస్తు నిర్వహించాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
సంతకవిటిలో ATM కార్డును మార్చి రూ. 2.17లక్షల సొమ్ము కాజేసిన ఘటనపై కేసు నమోదుచేసినట్లు SI గోపాలరావు తెలిపారు. పోలీసుల కథనం.. గడిముడిదాం వాసి గోపాలరావు పింఛను సొమ్ము డ్రా చేసివ్వమని మోహన్రావుకు కార్డు ఇచ్చాడు. మోహన్రావు సమీపంలో మరో వ్యక్తిని డబ్బులు డ్రా చేసివ్వమన్నాడు. అతను రూ.10వేలు డ్రా చేసి కార్డు మార్చి ఇచ్చి,పలు దఫాలుగా నగదు కాజేశాడు. బాధితుని ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టామన్నారు.
జిల్లాలో పండించే వ్యవసాయ ఉత్పత్తుల ఆధారంగా పరిశ్రమల ఏర్పాటుకు యువ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేలా విధానాలను రూపొందించాలని కలెక్టర్ అంబేడ్కర్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని జిల్లా స్థాయి నైపుణ్యాభివృద్ధి కమిటీ సమావేశాన్ని అధికారులతో కలిసి నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ..ప్రాముఖ్యత కలిగిన ఉత్పత్తులకు జనవరిలో పారిశ్రామిక సదస్సు నిర్వహించాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.