Vizianagaram

News May 24, 2024

బొబ్బిలి: హత్యకేసులో నిందితుడు ఆత్మహత్య

image

బొబ్బిలి మండలంలోని కమ్మవలస గ్రామానికి చెందిన కవిటి నాయుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఫిబ్రవరి 20న తన భార్యను ఇనుప రాడ్డుతో కొట్టి చంపిన కేసులో నిందితుడిగా ఉన్నాడు. గురువారం రాత్రి పొలంలో చెట్టుకు ఉరి వేసుకుని అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడి తమ్ముడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

News May 24, 2024

VZM: తహశీల్దార్ హత్య కేసులో నిందితుడికి బెయిల్

image

విశాఖ రూరల్ తహశీల్దార్ రమణయ్య హత్య కేసులో నిందితుడికి విశాఖ జిల్లా కోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. మూడు నెలల తర్వాత నిందితుడికి ఊరట లభించింది. కోర్టు షరతుల ప్రకారం బెయిల్ మంజూరు చేసింది. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలోనే హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితుడు ప్రణాళిక ప్రకారం హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.

News May 24, 2024

VZM: సైబర్ నేరగాళ్ల నుంచి 60 మందికి విముక్తి

image

కంబోడియా సైబర్ నేరగాళ్ల నుంచి ఎట్టకేలకు 60 మందికి విముక్తి లభించింది. సైబర్ నేరగాళ్ల నుంచి తప్పించుకున్న విశాఖ వాసి ఒకరు ఇచ్చిన సమాచారంతో విశాఖ నగర కమిషనర్ స్పందించారు. విశాఖకు చెందిన 150 మంది, దేశవ్యాప్తంగా 5,000 మంది కంబోడియా మోసగాళ్ల చెరలో ఉన్నట్లు తెలుస్తోంది. విముక్తి లభించిన 60 మంది గురువారం భారత్‌కు బయలుదేరినట్లు విశాఖ పోలీసులకు సమాచారం అందింది. వారి కోసం కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు.

News May 24, 2024

కార్యాలయ వెబ్సైట్‌లో పది రీకౌంటింగ్ ఫలితాలు: ప్రేమ్‌కుమార్

image

పదోతరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 2024కు సంబంధించి రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఫలితాలను కార్యాలయ వెబ్సైట్ www.bse.ap.gov.inలో అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. సంబంధిత ప్రధానోపాధ్యాయులు ఆయా వెబ్‌సైట్‌లో డౌన్లోడ్ చేసి సంబంధిత కాపీలను విద్యార్థులకు అందజేయవలసిందిగా విజయనగరం జిల్లా విద్యాశాఖాధికారి ఎన్.ప్రేమ్‌కుమార్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.

News May 23, 2024

ఓట్ల లెక్కింపు అత్యంత కీల‌క‌ం: కలెక్టర్ నాగ‌ల‌క్ష్మి

image

ఎన్నిక‌ల ప్రక్రియలో భాగంగా చేపట్టే ఓట్ల లెక్కింపు అత్యంత కీలకమని, ఈ ప్ర‌క్రియ‌ను ప‌క‌డ్బందీగా పూర్తి చేయాల‌ని విజయనగరం క‌లెక్ట‌ర్‌, ఎన్నిక‌ల అధికారి నాగ‌ల‌క్ష్మి ఆదేశించారు. ఆర్ఓలు, ఏఆర్వోలు, డీటీలు, నోడ‌ల్ అధికారుల‌కు ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ‌పై క‌లెక్ట‌రేట్ ఆడిటోరియంలో తొలివిడ‌త అవ‌గాహ‌న‌, శిక్ష‌ణ కార్య‌క్ర‌మాన్ని గురువారం నిర్వ‌హించారు. ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభం అవుతుందని చెప్పారు.

News May 23, 2024

విజయనగరం: లిఫ్ట్ పేరుతో బంగారం గొలుసు చోరీ

image

పట్టణంలో చైన్ స్నాచింగ్‌కు పాల్పడిన నిందితుడిని 24 గంటల్లోనే అరెస్టు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఐ బి.వెంకటరావు తెలిపిన వివరాల మేరకు.. గాజులరేగకు చెందిన వెంకటేశ్ 21న ఆంజనేయస్వామి గుడివద్ద నిలబడ్డాడు. లంకాపట్నంకు చెందిన ఏసు లిఫ్ట్ ఇస్తానని నమ్మించి, చైన్ లాక్కోగా నిందితుడిని బుధవారం అరెస్టు చేశారు. అతని వద్ద స్కూటీని, బంగారం గొలుసు రికవరీ చేసినట్లు చెప్పారు.

News May 23, 2024

కుమ్మపల్లి జంక్షన్‌లో టాటా మ్యాజిక్ ఢీకొని వ్యక్తి మృతి

image

వేపాడ మండలంలో కుమ్మపల్లి జంక్షన్ వద్ద కొత్తవలస నుంచి ఆనందపురం వైపు వస్తున్న టాటా మ్యాజిక్ వ్యక్తిని ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వల్లంపూడి ఎస్సై రాజేశ్ వివరాల మేరకు ఎల్.కోట మండలం పిల్ల అగ్రహారానికి చెందిన గొలగాని అప్పన్న కుమ్మపల్లి జంక్షన్ కోళ్ల ఫారమ్‌లో పనిచేస్తున్నాడు. బుధవారం సాయంత్రం టాయిలెట్‌కు వెళుతున్న అప్పన్నను టాటా మ్యాజిక్ ఢీకొంది. డ్రైవర్‌ను అరెస్టు చేసి కేసు నమోదు చేసారు.

News May 23, 2024

విజయనగరం :11 ఏళ్ల బాలికపై అఘాయిత్యం

image

గంట్యాడ మండలంలోని ఒక గ్రామానికి చెందిన 11 ఏళ్ల బాలిక ఆడుకుంటున్న సమయంలో 54 సంవత్సరాలు వయస్సు గల అడ్డూరి చందర్రావు మంగళవారం అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీంతో రక్తం మడుగులో ఉన్న బాలికను విజయనగరం హాస్పిటల్‌కి చికిత్స నిమిత్తం తరలించారు. బాలిక అమ్మమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విజయనగరం దిశ పోలీస్ స్టేషన్ ఎస్సై నారాయణరావు కేసు నమోదు చేసి నిందితుడిని పట్టుకొని రిమాండ్‌కి తరలించారు.

News May 23, 2024

VZM: పీజీ ప్రవేశాల గడువు పొడిగింపు

image

విజయనగరం గిరిజన యూనివర్సిటీలో వివిధ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలకు తుది గడువును ఈ నెల 26వ తేది వరకు పొడిగిస్తున్నట్లు వైస్ ఛాన్స్‌లర్ ప్రొ.తేజస్వి కట్టిమని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశ పరీక్ష రాసిన వారు 26వ తేదీ రాత్రి 11.55 వరకు https://www.ctuap.ac.in లో గాని https://ctuapcuet.samarth.edu.in/pg లో గాని దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

News May 23, 2024

ఆర్థిక ఇబ్బందుల్లో సాలూరు లారీ పరిశ్రమ

image

రాష్ట్రంలో విజయవాడ తరువాత జిల్లాలో సాలూరు లారీ పరిశ్రమకు పెట్టింది పేరు. ఇక్కడ సుమారు 2300 వరకు లారీలు ఉన్నాయి. ఈ మోటారు పరిశ్రమపై 18 వేల కుటుంబాలు ప్రత్యక్షంగా పరోక్షంగాను ఆధారపడి జీవిస్తున్నాయి. ఇంతమందికి జీవనాధారమైన ఈ పరిశ్రమ పెరిగిన ఆయిల్, విడిభాగాలు ధరలకు అనుగుణంగా కిరాయిలు పెరగకపోవడంతో బాటు లోడింగ్ లేక అధిక మొత్తం లారీలు యార్డ్‌లోనే ఉంటున్నాయి. దీనివలన చాలా కుటుంబాల వారు రోడ్డున పడ్డారు.