WestGodavari

News September 2, 2025

జాతీయ అవార్డుకు మంచిలి ఉపాధ్యాయుడు ఎంపిక

image

మంచిలి జడ్పీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నేలపాటి వెంకటరమణ జాతీయ స్థాయి అవార్డుకు ఎంపికయ్యారు. విద్యారంగంలో ఆయన చేసిన విశేష కృషికిగాను న్యూఢిల్లీకి చెందిన గ్లోబల్ టీచర్స్ ఎక్సలెన్స్ అవార్డుకు ఎంపిక చేసినట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఈ నెల 16న న్యూఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి సెమినార్‌లో వెంకటరమణకు ఎన్‌టీఈఈ అవార్డును అందజేయనున్నారు. ప్రస్తుతం ఆయన రాష్ట్ర ప్రధానోపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు.

News September 2, 2025

నేత్రదానంపై అవగాహన పెంచాలి: కలెక్టర్ నాగరాణి

image

జాతీయ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్ నాగరాణి అవగాహన కరపత్రాలను విడుదల చేశారు. సెప్టెంబర్ 8వ తేదీ వరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నేత్రదాన పక్షోత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. మరణానంతరం నేత్రదానం చేయడం ద్వారా ఇద్దరు అంధుల జీవితాల్లో వెలుగులు నింపవచ్చని, ఇది ఒక గొప్ప దానమని ఆమె పేర్కొన్నారు.

News September 2, 2025

భీమవరం: సోషలిజమే ప్రత్యామ్నాయం: బీవీ రాఘవులు

image

ప్రపంచంలో అనేక దేశాల్లో పెట్టుబడిదారీ వ్యవస్థ విఫలమైందని, దేశానికి సోషలిజమే సరైన ప్రత్యామ్నాయమని సీపీఎం అగ్రనేత బీవీ రాఘవులు అన్నారు. సోమవారం భీమవరంలో సోషలిజం విశిష్ఠత అనే అంశంపై జరిగిన సెమినార్‌లో ఆయన ప్రసంగించారు. పెట్టుబడిదారీ విధానంలో ఉన్న సామ్రాజ్యవాద దేశాల్లో సంక్షోభాలు పెరుగుతున్నాయని, ప్రపంచవ్యాప్తంగా సోషలిజానికి ఆదరణ పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు.

News September 1, 2025

నేత్రదానంపై అవగాహన పెంచాలి: కలెక్టర్ నాగరాణి

image

జాతీయ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్ నాగరాణి అవగాహన కరపత్రాలను విడుదల చేశారు. సెప్టెంబర్ 8వ తేదీ వరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నేత్రదాన పక్షోత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. మరణానంతరం నేత్రదానం చేయడం ద్వారా ఇద్దరు అంధుల జీవితాల్లో వెలుగులు నింపవచ్చని, ఇది ఒక గొప్ప దానమని ఆమె పేర్కొన్నారు.

News September 1, 2025

భీమవరం: పీజీఆర్ఎస్‌కు 210 అర్జీలు

image

భీమవరం కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రజల నుంచి 210 అర్జీలను స్వీకరించారు. అర్జీదారులకు సంతృప్తి కలిగేలా సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. తమ పరిధిలో లేని అర్జీలను సైతం సంబంధిత శాఖలకు పంపించాలని సిబ్బందికి సూచించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

News September 1, 2025

ఆకివీడులో పెన్షన్ పంపిణీ చేసిన జేసీ

image

ఆకివీడు (M) దుంపగడపలో జేసీ రాహుల్ కుమార్ రెడ్డి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు. ఆయనే స్వయంగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి అందజేశారు. సిబ్బంది పెన్షన్ సక్రమంగా అందిస్తున్నారా? లేదా? అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెన్షన్లు సక్రమంగా అందజేయకపోవడం, లబ్ధిదారులకు ఇబ్బందులు కలిగినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News September 1, 2025

గణపవరం మండలం ప.గోలోనే కొనసాగుతుంది: కేంద్రమంత్రి హామీ

image

ప.గో జిల్లాలోనే గణపవరం మండలం కొనసాగుతుందని కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ స్పష్టం చేశారు. ఆదివారం గణపవరం మండలానికి చెందిన వివిధ వ్యాపార సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు భీమవరంలోని కేంద్రమంత్రి నివాసం వద్ద వర్మను కలిసి మాట్లాడారు. ఈ మేరకు వారందరికీ ఆయన హామీ ఇచ్చారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా మండలాన్ని వేరే జిల్లాలోకి మారుస్తారనే ఆందోళన చెందవద్దని భరోసానిచ్చారు.

News September 1, 2025

గణపవరం మండలం ప.గోలోనే కొనసాగుతుంది: కేంద్రమంత్రి హామీ

image

ప.గో జిల్లాలోనే గణపవరం మండలం కొనసాగుతుందని కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ స్పష్టం చేశారు. ఆదివారం గణపవరం మండలానికి చెందిన వివిధ వ్యాపార సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు భీమవరంలోని కేంద్రమంత్రి నివాసం వద్ద వర్మను కలిసి మాట్లాడారు. ఈ మేరకు వారందరికీ ఆయన హామీ ఇచ్చారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా మండలాన్ని వేరే జిల్లాలోకి మారుస్తారనే ఆందోళన చెందవద్దని భరోసానిచ్చారు.

News August 31, 2025

గణపవరం మండలం ప.గోలోనే కొనసాగుతుంది: కేంద్రమంత్రి హామీ

image

ప.గో జిల్లాలోనే గణపవరం మండలం కొనసాగుతుందని కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ స్పష్టం చేశారు. ఆదివారం గణపవరం మండలానికి చెందిన వివిధ వ్యాపార సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు భీమవరంలోని కేంద్రమంత్రి నివాసం వద్ద వర్మను కలిసి మాట్లాడారు. ఈ మేరకు వారందరికీ ఆయన హామీ ఇచ్చారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా మండలాన్ని వేరే జిల్లాలోకి మారుస్తారనే ఆందోళన చెందవద్దని భరోసానిచ్చారు.

News August 31, 2025

స్నేహపూర్వక వాతావరణంలో పండుగలు జరుపుకోవాలి: కలెక్టర్

image

భీమవరం కలెక్టరేట్‌లో ఆదివారం కలెక్టర్, పీస్ కమిటీ చైర్మన్ అధ్యక్షతన శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ.. పశ్చిమగోదావరి జిల్లాకు ప్రశాంతమైన జిల్లాగా పేరు ఉందని, ఇకముందు కూడా ఇదే విధంగా ఉండాలని ఆకాంక్షించారు. పండుగ పర్వదినాలను కుల, మతాలకు అతీతంగా స్నేహభావంతో అందరూ కలిసికట్టుగా జరుపుకోవాలని కోరారు.