India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పశ్చిమగోదావరి జిల్లాలో పాకిస్థానీలు ప్రస్తుతానికి ఎవరూ లేరని జిల్లా అద్నాన్ నయీమ్ అస్మి శనివారం తెలిపారు. కేంద్ర హోం శాఖ మంత్రి ఆదేశాలతో పాస్పోర్ట్, వీసాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామన్నారు. జిల్లావ్యాప్తంగా పోలీసులు తనిఖీల్లో ప్రజల సహకరించాలని కలెక్టర్ నయీమ్ అస్మి విజ్ఞప్తి చేశారు.
ప. గో. జిల్లా ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రజాసమస్యల పరిష్కారవేదిక (PGRS) మీకోసం సోమవారం జిల్లా కలెక్టరేట్లో యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. అలాగే “1100 మీకోసం కాల్ సెంటర్” ద్వారా ఫిర్యాదులను నమోదు చేయుట, నమోదు అయిన ఫిర్యాదుల స్థితిగతులు తెలుసుకోవచ్చన్నారు. అన్ని మండల స్థాయి డివిజన్ స్థాయిలో యథావిధిగా పీజిఆర్ఎస్ జరుగుతుందన్నారు.
సీఎం చంద్రబాబు, డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్ను సోషల్ మీడియాలో దూషిస్తూ అసభ్య పోస్టులు పెట్టిన తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం చిగురుపాడుకు చెందిన అమిత్ హరిప్రసాద్ను పాలకొల్లు పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. అనంతరం పాలకొల్లు పీఎస్లో మీడియాకు వివరాలు తెలిపారు. హరిప్రసాద్ సోషల్ మీడియాలో పెట్టిన అసభ్య పోస్టులపై బీసీ నాయకుడు ధనాని సూర్య ప్రకాష్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామన్నారు.
పశ్చిమగోదావరి జిల్లాలో ఓపెన్ స్కూల్, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు మే 19 నుంచి నిర్వహించనున్నట్లు ఓపెన్ స్కూల్ సొసైటీ తెలిపింది. మే 24 వరకు పరీక్షలు జరుగుతాయని పేర్కొంది. మే 26 నుంచి 30 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ నిర్వహించనున్నట్లు తెలిపింది. విద్యార్థులు గమనించాలని కోరింది.
ఇరగవరం(M) కొత్తపాడు సొసైటీ కార్యదర్శి చల్లా సాయిబాబా మృతి ఘటనపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. శుక్రవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందినట్లు ప్రచారం జరిగింది. అయితే ఆయన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆత్మహత్యకు ముందు రెండు లేఖలు రాసినట్లుగా తెలుస్తోంది. అవి వెలుగులోకి వస్తే ఆత్మహత్యకు గల కారణాలు తెలిసే అవకాశం ఉందని సొసైటీ సిబ్బంది చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు కాలేదు.
మొగల్తూరు మండలం పేరుపాలెం గ్రామంలో శుక్రవారం బిల్డింగ్ స్లాబ్ సెంట్రింగ్ ఊడతీస్తుండగా ప్రమాదవశాత్తు యువకుడు పైనుంచి కింద పడిపోయారు. ఆసమంలో అతని కాలు తొడ భాగంలో ఇనుప ఊస చొచ్చుకుని పోయింది. నరసాపురం మండలం కొండవీటి కొడపకి చెందిన చామకూరి వెంకట గణేశ్ పని చేస్తుండగా ఈప్రమాదం జరిగింది. సకాలంలో 108 సిబ్బంది ఊసలు కట్ చేసి వైద్యం నిమిత్తం పాలకొల్లులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
స్నేహితులకు పార్టీ ఇవ్వాలని దొంగతనానికి పాల్పడ్డ ఓ విద్యార్థి జైలు పాలయ్యాడు. భీమవరానికి చెందిన జి.వాసవి గురువారం ఇంటికి వస్తుండగా అలెగ్జాండర్ సూర్యపాల్ ఆమె మెడలో సూత్రాల తాడు లాక్కుని పారిపోతుండగా స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఇంటర్ పాసైన సందర్భంగా ఫ్రెండ్స్కి పార్టీ ఇచ్చేందుకు డబ్బు కోసం దొంగతనానికి పాల్పడినట్లు సూర్యపాల్ కోర్టులో చెప్పాడు. నిందితుడికి కోర్టు రిమాండ్ విధించింది.
చెల్లెలు మరణాన్ని తట్టుకోలేక అన్న ఆత్మహత్య చేసుకున్న ఘటన పెనుగొండ మండలం సిద్ధాంతంలో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్ఐ గంగాధర్ తెలిపిన వివరాల ప్రకారం.. సిద్ధాంతంకు చెందిన ఈ.లక్ష్మీనరసింహ ఏసీ మెకానిక్గా పనిచేస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం అతని చెల్లెలు అనారోగ్యంతో బాధపడుతూ ఉరివేసుకుంది. అది తట్టుకోలేక లక్ష్మీనరసింహ ఆత్మహత్యాయత్నం చేయగా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు.
చెత్త, మంచినీటి పన్ను వసూళ్లలో ప.గో.జిల్లా రెండో స్థానంలో నిలిచిందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి ఎంపికకు 26 జిల్లాలు పోటీపడగా, మన జిల్లాకు రెండో స్థానం రావడం ఆనందంగా ఉందని అన్నారు. 24న గుంటూరు జిల్లా మంగళగిరిలో ఈ అవార్డును జిల్లా పంచాయతీరాజ్ అధికారి అరుణశ్రీ అందుకున్నట్లు తెలిపారు. అనంతరం పంచాయతీరాజ్ సిబ్బందిని ఆమె అభినందించారు.
పేరుపాలెం తీరానికి వచ్చి సేద తీరుతూ అలల ఉదృతికి లోపలికి కొట్టుకుపోతున్న ఒక యువకుడుని తీరం వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసులు రక్షించారు. శుక్రవారం ద్వారకాతిరుమలకు చెందిన వీరవల్లి మధు అనే యువకుడు పేరుపాలెం సాగర తీరానికి వచ్చాడు. మద్యాహ్నం సమయంలో సముద్ర స్నానం చేస్తూ అలల ఉదృతికి గురై కొట్టుకుపోతున్నాడు. పోలీస్ కానిస్టేబుల్ పి.శ్రీనివాస్, హెచ్సీ హరి యువకుడిని కాపాడి ఒడ్డుకు తీసుకువచ్చారు.
Sorry, no posts matched your criteria.