WestGodavari

News May 27, 2024

ప.గో: భార్య ఉండగా రెండో పెళ్లి.. భర్తపై కేసు

image

భార్య ఉండగానే భర్త మరో పెళ్లి చేసుకున్న ఘటనలో 12మందిపై కేసు నమోదు చేసినట్లు SI సత్యనారాయణరాజు తెలిపారు. ప.గో జిల్లా నరసాపురంలోని బొంతవారివీధికి చెందిన ముదినపల్లి దుర్గామాణిక్యానికి, సూరేపల్లికి చెందిన దుర్గారావుకు 2014లో వివాహమైంది. ఉపాధి నిమిత్తం దుర్గామాణిక్యం విదేశాలకు వెళ్లగా.. భర్త మరో పెళ్లి చేసుకున్నాడు. దీంతో పెళ్లికి సహకరించిన పాస్టర్, రెండో భార్య బంధువులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

News May 27, 2024

JSP Vs YCP ‘నేమ్ ప్లేట్ల’ ట్రెండ్.. ఎవరూ తగ్గట్లేగా..!

image

ఎన్నికల ఫలితాలకు మరో వారమే ఉండగా.. పిఠాపురంలో ‘నేమ్ ప్లేట్స్’ ట్రెండ్ నడుస్తోంది. ‘పిఠాపురం MLA గారి తాలూకా’ అంటూ జనసైనికులు, పవన్ అభిమానులు నేమ్ ప్లేట్స్ చేయించినట్లు సోషల్ మీడియాలో వైరల్‌ అయిన విషయం తెలిసిందే. తాజాగా ‘డిప్యూటీ CM వంగా గీత’ అంటూ ఓ కారుపై రాసి ఉన్న ఫొటోను వైసీపీ నేతలు, కార్యకర్తలు షేర్ చేస్తున్నారు. ఎవరి కాన్ఫిడెంట్‌లో వారున్నారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

News May 27, 2024

ప.గో.: ఏఈఓల సంఘ ఉమ్మడి జిల్లాధ్యక్షుడిగా రాంబాబు

image

తాడేపల్లిగూడెం పట్టణంలోని వ్యవసాయ పరీక్ష కేంద్రంలో ఆదివారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యవసాయ విస్తరణ అధికారుల సంఘం నూతన కార్యవర్గ ఎన్నిక జరిగింది. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా నెక్కంటి రాంబాబు, MDR.శివప్రసాద్ ఎన్నికయ్యారు. వీరితో పాటు ఇతర కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు వేణుమాధవరావు, రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ, నాయకులు పాల్గొన్నారు.

News May 26, 2024

ప.గో.: పెన్సిల్‌పై ‘గెట్ రెడీ SRH’ 

image

IPL-2024 ఫైనల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీం విజయం సాధించాలని ఓ కళాకారుడు పెన్సిల్‌పై ఆంగ్లంలో గెట్ రెడీ SRH అంటూ చెక్కారు. ప.గో. జిల్లా నరసాపురం పట్టణంలోని రుస్తుంబాదకు చెందిన మైక్రో ఆర్టిస్ట్ కొప్పినీడి విజయ్ SRH విజయాన్ని కాంక్షిస్తూ ఈ కళాఖండాన్ని ఆవిష్కరించారు. కాగా ఆయన లిఖితపూడి సచివాలయంలో సర్వేయర్‌గా పనిచేస్తున్నారు. 

News May 26, 2024

తణుకులో ఏడేళ్ల బాలికపై లైంగిక వేధింపులు

image

ఏడేళ్ల బాలికపై ఓ వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన తణుకు పట్టణంలో ఆదివారం జరిగింది. స్థానిక ఎన్టీఆర్‌ పార్కు సమీపంలో నివాసం ఉంటున్న చదలవాడ తిమోతి స్థానికంగా ఉంటున్న ఏడేళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాధిత బాలిక విషయాన్ని ఇంట్లో చెప్పడంతో తిమోతీని స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News May 26, 2024

ప.గో.: జనసేన అభ్యర్థులు గెలవాలని ప్రత్యేక పూజలు

image

సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 21 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసిన జనసేన అభ్యర్థులు గెలవాలని ఆ పార్టీకి చెందిన ఓ నాయకుడు ప్రత్యేకపూజలు చేయించారు. ప.గో. జిల్లా నరసాపురం మండలం LB.చర్ల గ్రామానికి చెందిన జనసైనికుడు కటకంశెట్టి సంజీవరావు అన్నవరం సత్యనారాయణస్వామి ఆలయంలో పవన్‌కళ్యాణ్, నాయకర్ చిత్రపటాలతో కూర్చొని ప్రత్యేక పూజలు చేయించారు.

News May 26, 2024

ప.గో: గోదావరి ఒడ్డున వ్యక్తి డెడ్‌బాడీ

image

గోదావరిలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కొట్టుకొచ్చినట్టు నరసాపురం రూరల్ ఎస్ఐ కె.గుర్రయ్య తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నరసాపురం మండలం రాజులంక ఏటిగట్టు వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం పడిఉంది. మృతుడి వయసు 40-50 ఏళ్ల మధ్య ఉండవచ్చని, సదరు వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. మృతుడి ఒంటిపై తెలుపు రంగు ఆఫ్ హాండ్స్ బనియన్, నలుపు రంగు చొక్కా ఉందని తెలిపారు.

News May 26, 2024

ప.గో: ALERT.. కూల్ డ్రింక్స్ తాగుతున్నారా..?

image

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కొందరు వ్యాపారులు హానికర రంగులు, కెమికల్స్‌తో కూల్ డ్రింక్స్ తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడుతున్నారు. భీమవరం, తాడేపల్లిగూడెంలోని రామన్నగూడెం, మండవల్లిలోని లోకుమూడి, పాలకొల్లులో ఈనెల 21-24 వరకు జరిగిన విజిలెన్స్ తనిఖీల్లో ఈ గుట్టురట్టయ్యింది. అనుమతులు లేకుండా కొందరు.. గడువు తీరిన, హానికర రసాయనాలతో డ్రింక్స్ తయారు చేస్తూ ఇంకొందరు సొమ్ము చేసుకుంటున్నారు.

News May 26, 2024

ప.గో: వెంకన్న దర్శనానికి వెళ్తూ అనంతలోకాలకు..!

image

మొగల్తూరు మండలం కాళీపట్నంలో లారీని ఆటో ఢీకొన్న ఘటనలో <<13312994>>మహిళ మృతి<<>> చెందిన విషయం తెలిసిందే. SI వెంకటరమణ వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం శేరిదగ్గుమిల్లికి చెందిన బి.ప్రసాద్ భార్య విష్ణువర్ధిని మరో ఐదుగురు చిన్నారులతో వాడపల్లి వెంకన్న ఆలయానికి ఆటోలో బయలుదేరారు. విజయవాడ నుంచి సిమెంట్‌తో వస్తున్న లారీ పక్కన ఆగి ఉండగా.. వీరి ఆటో వెళ్లి ఢీకొంది. విష్ణువర్ధిని అక్కడికక్కడే మృతి చెందింది.

News May 26, 2024

ప.గో: ‘ఎన్నికల ఓట్ల లెక్కింపుకి పకడ్బందీ ఏర్పాట్లు’

image

ఎన్నికల కమీషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్ ఆదేశించారు. శనివారం ఏలూరు సమీపంలో వట్లూరులోని సర్‌ సీఆర్ రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌లను, కౌంటింగ్ కేంద్రాలను, భధ్రతా చర్యలను కలెక్టర్ పరిశీలించారు.