WestGodavari

News October 26, 2024

భీమవరం: ఆర్టీసీ బస్సులోనే కండక్టర్ మృతి

image

భీమవరం నుంచి రాజమండ్రి వెళ్తున్న కొవ్వూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కండక్టర్ కె.ఎస్.నారాయణ శుక్రవారం రాత్రి బస్సులోనే మృతి చెందారు. పెనుగొండ మండలం వడలి గ్రామంలోని శ్రీనివాస సర్వీసింగ్ సెంటర్ వద్దకు వచ్చేసరికి కండక్టర్ నారాయణకు గుండె నొప్పి రావడంతో అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందారు. ఆయన కుటుంబం కొవ్వూరులో నివాసం ఉంటున్నట్లు తోటి ఉద్యోగులు చెబుతున్నారు.

News October 26, 2024

భీమడోలు: చిరుత ఎక్కడ.?

image

ద్వారకా తిరుమల పరిసర ప్రాంతాల్లో కనిపించిన చిరుతను పట్టుకునేందుకు అటవీ శాఖ విశ్వప్రయత్నాలు చేస్తోంది. అయితే చిరుత మాత్రం కానరాలేదు. శుక్రవారం ఏర్పాటు చేసిన కెమెరాలలో చిరుత ఎక్కడా కనిపించలేదు. కానీ పెదవేగిలో చిరుత తిరుగుతోందని చెప్తున్న అధికారులు, బోన్లు మాత్రం భీమడోలు పరిసరాల్లో ఏర్పాటు చేశారు. చిరుత కోసం రేంజర్ కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది నిఘా కొనసాగిస్తున్నారు.

News October 26, 2024

నరసాపురం: సినిమా చూసిన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే

image

నరసాపురం నియోజకవర్గం సర్దుగోడప గ్రామానికి చెందిన ఉల్లిశెట్టి శ్రీనివాస్ నటించిన ‘ఎంతపని చేశావ్ చంటి’ సినిమా శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా సినిమా వీక్షించేందుకు నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు స్థానికంగా ఉన్న థియేటరుకు వెళ్లారు. స్థానిక ప్రేక్షకులతో కలిసి సినిమాని తిలకించారు.

News October 26, 2024

జిల్లాలో 21వ జాతీయ పశుగణన ప్రారంభం: కలెక్టర్ 

image

జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నుంచి 21వ జాతీయ పశు గణన సర్వే ప్రారంభమైంది. ఈ సందర్భంగా స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో 21వ జాతీయ పశుగణన సర్వే ప్రారంభ సందర్భంగా సంబంధిత గోడ పత్రికను కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆవిష్కరించారు. పశుగణన సర్వే ప్రక్రియలో భాగంగా జిల్లా పశువైద్యాధికారులు పశుగణన కోసం నియమించి, శిక్షణ పూర్తి చేసుకున్న సిబ్బందితో 2025 ఫిబ్రవరి 28 వరకు గణన జరుగుతుందన్నారు.

News October 25, 2024

ప.గో: జిల్లా TODAY TOP NEWS

image

*విశాఖలో టూరిజం సమ్మిట్‌లో పాల్గొన్న మంత్రి దుర్గేశ్
*ప.గో జిల్లాలోనే మాటేసి తిరుగుతున్న చిరుత
*జంగారెడ్డిగూడెంలో వెలుగు చూసినా ఘరానా మోసం
*భీమడోలు స్టేషన్‌లో ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆపాలని ఎంపీకి వినతి
*ఉండ్రాజవరం: వివాహిత అదృశ్యంపై కేసు నమోదు
*వేలేరుపాడు: ‘పోలవరం నిర్వాసితులకు న్యాయం చేస్తాం’
*నిడదవోలు: ఆర్టీసీ బస్సులు రూట్ మళ్లింపు
*12.040 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు: జేసీ ధాత్రిరెడ్డి

News October 25, 2024

ఏలూరు: పోలీస్ శాఖ కార్యాలయంలో ఎస్పీ సమావేశం

image

జిల్లాలో పోలీస్ శాఖలో పనిచేస్తూ మృతి చెందిన వారి కుటుంబాలతో ఏలూరు పోలీస్ శాఖ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ కారుణ్య నియామకాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు, వాటి స్థితి పరిస్థితులను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాలకు అండగా ఉంటామని అన్నారు.

News October 25, 2024

జంగారెడ్డిగూడెంలో వెలుగు చూసినా ఘరానా మోసం

image

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఘరానా మోసం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కనకదుర్గ గోల్డ్ ఫైనాన్స్ సంస్థలో నకిలీ బంగారం తాకట్టు పెట్టుకొని సంస్థ మేనేజర్, క్యాషియర్ రూ. 23 లక్షలు కాజేశారు. ఈ వ్యవహారంలో మేనేజర్ కు సహకరించిన మరో ఇద్దరితోపాటు మొత్తం నలుగురిపై జంగారెడ్డిగూడెం పోలీసులు చేసిన నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మేనేజర్, క్యాషియర్ మరో ఇద్దరు స్నేహితులు ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నట్లు సమాచారం.

News October 25, 2024

పెదవేగి: చిక్కని చిరుత

image

పెదవేగిలోని జగన్నాథపురం పంటపొలాల్లో చిరుత సంచారం ఉన్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే. కానీ చిరుత మాత్రం కానరాలేదు, పట్టుబడలేదు. అయితే చిరుత పోలవరం కుడి కాలువ గట్టు వెంబడి వెళ్లి ఉంటుందని భావిస్తున్నారు. గ్రామస్థులంతా అప్రమత్తంగా ఉండాలని , చిరుతను బంధించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నామని రేంజర్ కుమార్ తెలిపారు.

News October 25, 2024

పోలవరంలో రూ.2 వేల కోట్లతో నౌకదళ ఆయుధగారం ప్రాజెక్ట్: MP

image

పోలవరం నియోజకవర్గంలో రూ.2 వేల కోట్లతో నౌకాదళ ఆయుధగారం ప్రాజెక్టు ఏర్పాటు చేసేందుకు కేంద్రం సుముఖంగా ఉందని ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా గురువారం ఆయన మాట్లాడుతూ..నేవీ ప్రాజెక్టుకు సంబంధించి ప్రస్తుతం స్థల పరిశీలన జరుగుతుందని త్వరలోనే కార్యరూపం దాల్చుతుందని తెలిపారు. ప్రాజెక్ట్ ఏర్పాటుకు ఈ ప్రాంత ప్రజలు సహకరించాలని ఎంపీ విజ్ఞప్తి చేశారు. సమావేశంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

News October 25, 2024

ప.గో: జిల్లా TODAY TOP NEWS

image

* ఏలూరు: పాఠశాలలో మంత్రి ఆకస్మిక తనిఖీలు
* సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: డీఎస్పీ జైసూర్య
* నేను ఎప్పుడూ ప్రజల సేవకుడినే: మంత్రి దుర్గేశ్
* భీమవరంలో సైబర్ వలలో వైద్యుడు
* కామవరపుకోటలో నలుగురు అరెస్ట్
* పెదవేగిలో చిరుత సంచారంపై సీఐ వివరణ
* ఏలూరు: పంచారామ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు
* హెల్మెట్ ధరించి ప్రయాణించాలి: MLA రోషన్
* భీమవరంలో టాలీవుడ్ హీరో సందడి