WestGodavari

News May 23, 2024

ప.గో: రైలు పట్టాలపై మహిళ మృతదేహం

image

నిడదవోలు – చాగల్లు రైల్వే స్టేషన్ల మధ్య నిన్న రాత్రి గుర్తు తెలియని మహిళ మృతి చెంది పడి ఉన్నట్లు తాడేపల్లిగూడెం రైల్వే ఎస్సై శ్రీహరిబాబు తెలిపారు. దారవరం రైల్వే గేటు సమీపంలో డౌన్ లైన్ పక్కన మహిళ మృతదేహం లభ్యమైందని, సుమారు 55 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు ఉంటుందని తెలిపారు. వివరాలేమీ లభ్యం కాలేదని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.

News May 23, 2024

ఏలూరు: చిన్నారితో అసభ్య ప్రవర్తన.. పోక్సో కేసు

image

ఏలూరు జిల్లా చింతలపూడికి చెందిన 8 ఏళ్ల చిన్నారి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన 40 ఏళ్ల వ్యక్తిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు SI కుటుంబరావు తెలిపారు. చిన్నారి తినుబండారాలు కొనుక్కునేందుకు దుకాణానికి వెళ్లగా.. దుకాణదారుడు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక ఇంటికి వచ్చి కుటుంబీకులకు చెప్పగా.. వారు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

News May 23, 2024

ఓట్ల లెక్కింపు.. ప.గో జిల్లాలో తొలి ఫలితం ఇదే 

image

సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌కు సంబంధించి తొలి ఫలితం నరసాపురం అసెంబ్లీ నుంచి వెలువడనున్నది . నరసాపురం పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం 14 టేబుల్స్‌పై కౌంటింగ్‌కు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 12 రౌండ్లలో నరసాపురం, 13 రౌండ్లలో ఆచంట, 14 రౌండ్లలో పాలకొల్లు, 15 రౌండ్లలో తాడేపల్లిగూడెం, తణుకు, ఉండి ఫలితాలు వెల్లడికానున్నాయి. 17వ రౌండ్‌లో భీమవరం ఫలితం వెలువడనుంది.

News May 23, 2024

ఏలూరు: దారుణం.. స్కూల్ గదిలోనే బాలికపై అత్యాచారం

image

ఏలూరు జిల్లాలో దారుణం జరిగింది. మండవల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికపై చింతపాడుకు చెందిన బాలుడు అత్యాచారానికి పాల్పడ్డట్లు SI రామచంద్రారావు తెలిపారు. బాలిక ఈనెల 15న ఫ్రెండ్ పిలిచిందని స్కూల్ దగ్గరికి వెళ్లింది. ఆ సమయంలో బాలుడు ఆమెను బలవంతంగా గదిలోకి లాక్కెల్లి ఆత్యాచారం చేయగా.. మరో నలుగురు వీడియో తీసి బాలిక తల్లికి పంపారు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నామన్నారు.

News May 23, 2024

నన్ను జైలులోనే చంపాలని చూశారు: రఘురామ

image

జగన్‌ చేస్తున్న తప్పులపై ప్రశ్నించినందుకు తనను జైలులో పెట్టించి, అక్కడే చంపాలని చూశారని MP రఘురామకృష్ణరాజు అన్నారు. రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ.. ‘నా పుట్టిన రోజునే అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అప్పుడే చనిపోయినట్లు భావించా. తెల్ల పేపర్‌పై సంతకం చేయాలని కస్టడీలో ముగ్గురు ముసుగులేసుకొని చిత్రహింసలకు గురి చేశారు. జగన్‌‌లో మార్పు రావాలనుకున్నా.. చివరికి ఆయన్నే మార్చాలన్నా ఆలోచన వచ్చింది’ అని అన్నారు.

News May 23, 2024

ఏలూరు: స్ట్రాంగ్ రూములను పరిశీలించిన డీఐజీ

image

ఏలూరు సీఆర్ రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో ఎన్నికల అనంతరం ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌లను డీఐజీ అశోక్ కుమార్ బుధవారం పరిశీలించారు. ప్రతి స్ట్రాంగ్ రూమ్ పరిసరాలలో సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘా పెట్టడం జరిగిందన్నారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యేవరకు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ సమర్థవంతంగా విధులు నిర్వహించాలని అధికారులకు సూచించారు.

News May 22, 2024

ఏలూరు: అందుబాటులో టెన్త్, ఇంటర్ హాల్ టికెట్స్

image

ఏపీ దూరవిద్య ద్వారా జూన్ 1 నుంచి 8 వరకు నిర్వహిస్తున్న టెన్త్, ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లమెంటరీ పరీక్ష హాల్ టికెట్లను ఆన్‌లైన్‌లో పొందుపరిచామని జిల్లా విద్యాశాఖ అధికారి అబ్రహం బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. www.apopenschool.ap.gov.in వెబ్‌సైట్‌లో హాల్ టికెట్లు ఉన్నాయని చెప్పారు. లేదా ఓపెన్ స్కూల్స్ సెంటర్ల కో-ఆర్డినేటర్ల నుంచి హాల్ టికెట్స్ పొందవచ్చు అని స్పష్టం చేశారు.

News May 22, 2024

ప.గో: గుండెపోటుతో ఉపాధ్యాయుడు మృతి

image

ముత్యాపల్లి ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు ఐసెట్టి మల్లిఖార్జునరావు బుధవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. మొగల్తూరుకు చెందిన మల్లిఖార్జునరావు గత ఏడాది బండి ముత్యాలమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు బదిలీపై వచ్చి విధులు నిర్వహిస్తున్నారు. బుధవారం తన ఇంటిలో ఉండగా ఉదయం 6గంటల సమయంలో ఒక్కసారిగా గుండె పోటు రావడంతో అదే నిమిషంలో తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

News May 22, 2024

అల్లర్లు సృష్టించే వారు ఒకసారి ఆలోచించండి: ఎస్పీ

image

ఏలూరు జిల్లాలో విధ్వంసానికి ప్రయత్నించే అల్లరి మూకను తిప్పి కొట్టడానికి శాఖ టీంలు రెడీగా ఉన్నాయని జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి స్పష్టం చేశారు. బుధవారం ఏలూరులో జరిగిన మాక్ డ్రిల్, మాబ్ ఆపరేషన్ అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. అల్లర్లు సృష్టించాలని రోడ్డు ఎక్కేవారు ఒకసారి తమ కుటుంబాల గురించి కూడా ఆలోచించి రోడ్డుపైకి వెళ్లాలని సూచించారు. ఏది ఏమైనా ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ నిర్వహిస్తామన్నారు.

News May 22, 2024

పెదవేగి: మహిళ అనుమానాస్పద మృతి

image

పెదవేగి మండలం మండూరు పంచాయతీ పరిధి బొడ్డువారిగూడెంలో బడుగు ధనలక్ష్మి (39) అనే వివాహిత ఊరికి వేలాడుతూ విగతజీవిగా బుధవారం స్థానికులకు కనిపించింది. దీంతో వారు మండల పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతికి గల కారణాలపై విచారణ చేస్తున్నారు. మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అటు మృతురాలికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.