India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి జాతీయ రహదారిపై బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ద్విచక్రవాహనం ముందెళ్తున్న ఇటుక ట్రాక్టర్ నుంచి ఓ ఇటుక కిందపడగా దానిపై నుంచి బైక్ వెళ్లడంతో అదుపుతప్పి కిందపడింది. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి.
స్థానికుల సాయంతో వారిని జంగారెడ్డిగూడెం ఏరియా హాస్పిటల్కి తరలించారు.
పురుగు మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ప.గో. జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెనుమంట్ర మండలం భట్లమగుటూరుకు చెందిన పి.శివకుమార్ (22) తండ్రి మందలించాడని మనస్తాపం చెంది పొలంలో పురుగు మందు తాగాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతణ్ని స్థానికులు గుర్తించి కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి చూడగా అప్పటికే చనిపోయి ఉన్నాడు. తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేశారు.
ఏలూరు జిల్లాలో ఒక CI, ఇద్దరు SIలు, ఐదుగురు కానిస్టేబుళ్లపై కేసు నమోదైంది. పోలీసుల వివరాలు.. సత్రంపాడుకు చెందిన అవుటుపల్లి సీతయ్య 2021లో ఓ హోటల్లో భోజనం చేసి, బిల్లుచెల్లించే విషయంలో హోటల్ నిర్వాహకులతో గొడవైంది. PSలో ఫిర్యాదుచేయగా.. అప్పటి CI ఆదిప్రసాద్, SIలు నాగబాబు, కిషోర్ బాబు కానిస్టేబుళ్లతో కలిసి కొట్టారని మానవహక్కుల కమిషన్కు విన్నవించారు. విచారించిన మొబైల్ కోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఈనెల 24 నుంచి జూన్ 1 వరకు జరిగే ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు పశ్చిమ గోదావరి జిల్లా ప్రజా రవాణా అధికారి ఏ.వీరయ్య చౌదరి ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష రాసే విద్యార్థులందరూ ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని కోరారు.
భీమవరం పట్టణంలోని ఓ హోటల్లో ఈనెల 13న బిర్యానీలో చనిపోయిన ఎలుక వచ్చినట్లు ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు నిన్న (సోమవారం) తనిఖీలు నిర్వహించారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫుడ్ సేఫ్టీ అధికారి రామిరెడ్డి ఆహార పదార్థాలు పరిశీలించారు. శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపామని, నివేదిక వచ్చాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు.
కొవ్వూరు మాజీ MLA పెండ్యాల కృష్ణబాబు మృతికి సంతాపంగా బుధవారం కొవ్వూరు మార్కెట్కు సెలవు ప్రకటించినట్లు చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు పరిమి రాధాకృష్ణ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని అన్ని వ్యాపారవర్గాలు గమనించి సహకరించాలని సూచించారు. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కృష్ణబాబు మార్కెట్ అభివృద్ధికి విశేష సేవలు అందించారని కొనియాడారు. కాగా.. రేపు దొమ్మేరులో కృష్ణబాబు అంత్యక్రియలు జరగనున్నాయి.
ఉపాధి నిమిత్తం ఖతర్ వెళ్లిన తన భార్య అక్కడ అనారోగ్యంతో ఇబ్బంది పడుతోందని, ఆమెను స్వదేశానికి తీసుకువచ్చేలా చూడాలని ప.గో జిల్లా తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లికి చెందిన ఉర్ల నవీన్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం తాడేపల్లిగూడెంలోని హెల్ప్డెస్క్ కార్యాలయంలో గట్టిం మాణిక్యాలరావుకు వినతిపత్రం అందజేశారు. యజమానులు భోజనం సైతం పెట్టడం లేదని నవీన్ ఆవేదన వ్యక్తం చేశారు.
కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల వెంకట కృష్ణారావు (కృష్ణబాబు) మృతిచెందిన విషయం తెలిసిందే. కాగా ఆయన ఎమ్మెల్యేగా 5 సార్లు ఎన్నికయ్యారు. 1983లో ఇండిపెండెంట్గా పోటీచేసిన ఆయన 65,893 ఓట్లు సాధించి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. అనంతరం టీడీపీలో చేరిన ఆయన 1985, 1989, 1994, 2004 వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.
కొవ్వూరు మాజీ MLA పెండ్యాల వెంకట కృష్ణారావు (కృష్ణ బాబు) మంగళవారం మృతి చెందారు. కొవ్వూరు మండలం దొమ్మేరు గ్రామంలో ఆయన స్వగృహంలో మృతిచెందారు. తణుకు, కొవ్వూరు, గోపాలపురం, నిడదవోలు నియోజకవర్గాల్లో టీడీపీ సీనియర్ నేతగా పేరుగాంచిన కృష్ణ బాబు తదనంతర కాలంలో వైసీపీలో చేరారు. పారిశ్రామికవేత్తగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో కృష్ణబాబు విశేష సేవలు అందించారు.
ఎన్నికల నేపథ్యంలో నగదు, మద్యం తదితర అక్రమ రవణాను అడ్డుకునేందుకు స్టాటిక్, ఫ్లయింగ్ సర్వేలెన్స్ బృందాలను ఏర్పాటుచేశారు. అయితే ఉంగుటూరు నియోజకవర్గంలోని ఒక్కో మండలానికి రెండేసి చొప్పున బృందాలను నియమించారు. 2నెలలపాటు 12గంటల చొప్పున పనిచేశారు. వేతనం కోసం తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లగా రోజుకు రూ.20 చొప్పున రూ.1200 చొప్పున చెల్లిస్తామన్నారు. ECఆదేశాల్లో ఇంతే ఉందని తహశీల్దార్ వెంకటశివయ్య స్పష్టం చేశారు.
Sorry, no posts matched your criteria.