WestGodavari

News May 18, 2024

భార్య కాపురానికి రావడంలేదని భర్త సూసైడ్

image

భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపానికి గురై భర్త ఆత్మహత్మ చేసుకున్నాడు. నిడదవోలు మండలం తాడిమల్లకు చెందిన దిరిసిమిల్లి పోతురాజు(47) శనివారం పురుగు మందు తాగి సూసైడ్ చేసుకున్నట్లు ఎస్సై రమేష్ తెలిపారు. భార్యాభర్తల మధ్య గొడవ కారణంగా కొద్దిరోజులుగా విడిగా జీవనం సాగిస్తున్నారన్నారు. పోతురాజు ఆత్మహత్యకు పాల్పడినట్లు భార్య నాగలక్ష్మి ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

News May 18, 2024

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదు: కలెక్టర్

image

ప.గో జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సుమిత్ కుమార్ శనివారం హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా ఓటింగ్ ప్రక్రియ శాంతియుతంగా జరిగిందని తెలిపారు. 7 నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను ఎస్‌ఆర్‌కేఆర్, విష్ణు కళాశాలలో భద్రపరిచామన్నారు. ఓట్ల లెక్కింపు వరకు, లెక్కింపు రోజుల ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తావుండొద్దని అన్నారు.

News May 18, 2024

జూన్ 6 వరకు ‘నో మ్యాన్ జోన్‌’గా నన్నయ వర్సిటీ: వీసీ

image

ఎన్నికల నేపథ్యంలో తూ.గో కలెక్టర్ సూచనల మేరకు నన్నయ విశ్వవిద్యాలయంలో రోజువారి కార్యక్రమాలను జూన్ 6 వరకు నిలిపివేస్తున్నట్లు వీసీ కె.పద్మరాజు తెలిపారు. ఈవీఎంలు, ఎన్నికల సామగ్రి, ఓట్ల లెక్కింపు కోసం టేబుల్స్, స్ట్రాంగ్ రూమ్స్ ఉన్న కారణంగా క్యాంపస్‌ను ‘నో మ్యాన్ జోన్’గా కలెక్టర్ ప్రకటించారని పేర్కొన్నారు. విశ్వవిద్యాలయ అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు సహకరించాలని వీసీ కోరారు.

News May 18, 2024

పెట్రోల్ ట్యాంకర్ టైర్ పేలి అయిదుగురికి తీవ్ర గాయాలు

image

ఏలూరు జిల్లా నూజివీడు మండలం మీర్జాపురం గ్రామంలో రోడ్డు ప్రమాదం జరిగింది. పెట్రోల్ ట్యాంకర్ టైర్ పేలడంతో ఆ ట్యాంకర్ అదుపుతప్పి ఆటోను ఢీకొంది. ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న కారణంగా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నూజివీడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 18, 2024

ఏలూరు జిల్లాకు సాయిధరమ్ తేజ్

image

ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం పెదపాడు మండలం అప్పనవీడులో వేంచేసియున్న అభయ ఆంజనేయ స్వామిని సినీ హీరో సాయిధరమ్ తేజ్ శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దెందులూరు జనసేన పార్టీ ఇన్‌ఛార్జి ఘంటసాల వెంకటలక్ష్మి శాలువాతో ఆయణ్ను సత్కరించారు. అనంతరం స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

News May 18, 2024

ఏలూరు: ప్రాణం తీసిన కరెంట్ తీగ

image

చేపల చెరువు వద్ద పనిచేసే ఓ యువకుడు విద్యుదాఘాతంతో మృతిచెందిన ఘటన ఏలూరు జిల్లా పెదపాడు మండలంలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. కొనికి గ్రామానికి చెందిన పండు చైతన్యబాబు (28) అదే గ్రామంలోని శివప్రసాదరాజుకు చెందిన చేపల చెరువుకు కాపలాదారుగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం చెరువుగట్టుపై విద్యుత్తు తీగతెగిపడి ఉండటాన్ని గమనించక కాలు వేయగా విద్యుదాఘాతానికి గురవడంతో అక్కడికక్కడే చనిపోయాడు.

News May 18, 2024

నేడు ఉమ్మడి ప.గో. జిల్లాలో ప్రవీణ్ ప్రకాష్ పర్యటన

image

రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాశ్ శనివారం ఉమ్మడి ప.గో. జిల్లాలో పర్యటించనున్నారు. ఏలూరు జిల్లాలోని భీమడోలు, ఉంగుటూరు మండలాల్లో, ప.గో.జిల్లాలోని తాడేపల్లిగూడెం, తణుకులో వివిధ పాఠశాలలను సందర్శించనున్నారు. పాఠ్యపుస్తకాల వివరాలను స్టాక్ పాయింట్లను పరిశీలిస్తారు. గత విద్యా సంవత్సరంలో విద్యార్థులకు పంపిణీ చేయగా మిగిలిన పాఠ్యపుస్తకాల వివరాలను పరిశీలిస్తారని అధికారులు తెలిపారు.

News May 18, 2024

ఏలూరు: కాపాడబోయి.. యువకుడు స్పాట్ డెడ్

image

రొయ్యల చెరువులో పనిచేస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఓ యువకుడు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలైన ఘటన ఏలూరు జిల్లాలో జరిగింది. కైకలూరు నియోజకవర్గ పరిధి ముదినేపల్లిలోని రొయ్యల చెరువులో కోల్‌కతాకు చెందిన షైపుల్లా, ముదినేపల్లి మండలానికి చెందిన బొర్రా బాలసాయి పనిచేస్తున్నారు. శుక్రవారం షైపుల్లా స్విచ్ వేస్తుండగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. అతడిని కాపాడే క్రమంలో బాలసాయి మృతి చెందాడు.

News May 18, 2024

ప.గో: క్రాస్ ఓటింగ్.. ఇరు పార్టీ నేతల్లో గుబులు

image

ఉమ్మడి ప.గో. జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎక్కువగా క్రాస్ ఓటింగ్ జరిగిందని వైసీపీ, కూటమి పార్టీల నేతల్లో టెన్షన్ నెలకొంది. ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికలు ఒకేసారి జరగడంతో ఓటర్లు ఇరు పార్టీల్లో సమానంగా ఓటువేశారని ప్రచారం జరుగుతోంది. రెండు ఓట్లు ఒకే పార్టీకి వేశారా..? లేక వేర్వేరు పార్టీలకు వేశారా..? అన్నది అంతు చిక్కని ప్రశ్నగా మారింది. ఏదేమైనా జూన్ 4వ తేదీ వరకు ఆగాల్సిందే.

News May 18, 2024

ఏలూరు: ఇదికదా అమ్మతనం అంటే

image

ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం కురుములతోగు గ్రామానికి చెందిన జ్యోతి నిండు బాలింత. కలుషిత నీరుతాగి అతిసారం బారిన పడగా భధ్రాచలం ప్రభుత్వాసుపత్రిలో ఆసుపత్రిలో చికిత్సపొందుతోంది. జ్యోతి కోలుకోవడమే కష్టంగా ఉన్నతరుణంలో ఆమె బిడ్డను మరో తల్లి దగ్గరకు తీసుకుంది. అదే గ్రామానికి చెందిన సోమమ్మ సైతం బాలింత కావడంతో తన బిడ్డతో పాటు జ్యోతి బిడ్డకు సైతం చనుబాలు ఇస్తోంది. ఇంట్లో 2 చీరలతో ఊయలలు ఏర్పాటుచేసింది.