WestGodavari

News May 18, 2024

ఐరన్ రాడ్ దొంగలించిన వ్యక్తికి 6 నెలల జైలు శిక్ష

image

ఏలూరు మండలం వెంకటాపురం పంచాయతీ పరిధి ఇందిరమ్మ కాలనీలో ఈ ఏడాది అక్టోబర్ 29న ఓ గదిలో భద్రపరిచిన ఐరన్ రాడ్స్ చోరీకి గురయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు ఎస్ఐ లక్ష్మణ్ బాబు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా నేరం రుజువు కావడంతో అదే కాలనీకి చెందిన చోటే ఖాన్(25)కు 6 నెలల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ ఏలూరు ఎక్సైజ్ కోర్ట్ జడ్జి స్పందన శుక్రవారం తీర్పునిచ్చారని పోలీసులు తెలిపారు.

News May 17, 2024

టీడీపీ ఆత్మీయ సమావేశాన్ని అడ్డుకున్న పోలీసులు

image

నల్లజర్ల మండలం అనంతపల్లిలో శుక్రవారం ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశాన్ని పోలీసులు అడ్డుకున్నారు. అనుమతులు లేకుండా ఆత్మీయ సమావేశం పెట్టకూడదని హెచ్చరించారు. ఎన్నికల నేపథ్యంలో 144 సెక్షన్ అమలులో ఉందని, ఇలాంటి సమయంలో ముందస్తు అనుమతులు లేకుండా ఎటువంటి సమావేశాలకు అనుమతి లేదని కొవ్వూరు డీఎస్పీ రామారావు తెలిపారు.

News May 17, 2024

ఉపాధి పని ముగించుకొని వస్తూ కూలీ మృతి

image

ప.గో జిల్లా తాడేపల్లిగూడెం మండలం మాధవరంలోని మేజర్ కెనాల్‌లో ఉపాధి హామీ పనులు ముగించుకొని వస్తూ ఓ కూలి మృత్యువాత పడ్డాడు. గ్రామానికి చెందిన రొట్టె వీర్రాజు(63) శుక్రవారం ఉదయం పని ముగించుకుని వస్తూ ఇంటికి కూతవేటు దూరంలో గుండెపోటుకు గురయ్యాడు. స్థానికులు స్పందించి ఏఎన్ఎం వద్దకు తీసుకువెళ్లారు. అప్పటికే వీర్రాజు మృతి చెందినట్లు వారు తెలిపారు. దీంతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది.

News May 17, 2024

చంద్రబాబు నాయుడిని కలిసిన రఘురామ

image

ఉండి నియోజకవర్గ MLA అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిని శుక్రవారం ఆయన నివాసంలో మర్యాదపూర్వంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్చాన్ని అందజేసి, ముందస్తు శుభాకాంక్షలు తెలిపినట్లు RRR పేర్కొన్నారు.

News May 17, 2024

చింతమనేని ప్రభాకర్ రావుపై కేసు నమోదు

image

దెందులూరు అసెంబ్లీ కూటమి అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ రావుపై పెదవేగి పోలీస్ స్టేషన్లో గురువారం కేసు నమోదైందని SI దుర్గాప్రసాద్ శుక్రవారం తెలిపారు. పెదవేగి మండలం కొప్పులవారిగూడెంలో టీడీపీ- వైసీపీ గొడవల నేపథ్యంలో రాజేష్ అనే వ్యక్తిని గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తెలిసిన చింతమనేని ప్రభాకర్ రావు అక్కడికి వెళ్లి రాజేష్‌ను తీసుకువెళ్లాడు. దీంతో పోలీసులు చింతమనేనిపై కేసు నమోదుచేశారు.

News May 17, 2024

ఏలూరు: SO SAD: నాలుగేళ్ల బాలుడు గోతిలో పడి మృతి

image

నాలుగేళ్ల బాలుడు గోతిలో పడి మృతిచెందిన ఘటన ఏలూరు జిల్లా చింతలపూడి మండలం నామవరం గ్రామంలో జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన చంటి అమలాపురంలో SIగా విధులు నిర్వహిస్తున్నారు. వేసవి సెలవులు కావడంతో భార్య, తన ఇద్దరు పిల్లలతో కలిసి గ్రామానికి వచ్చారు. కాగా గురువారం ఎస్ఐ కుమారుడు (4) ఆడుకుంటూ ఇంటి వెనకాల ఉన్న గోతిలో పడి మృతి చెందారు. దీంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.

News May 17, 2024

ప.గో.: ఓ వైపు IPL.. మరోవైపు ఎన్నికలు.. జోరుగా బెట్టింగులు

image

ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగులు జరుగుతున్నాయి. ఉమ్మడి ప.గో. జిల్లాలో ఎవరికి వారు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ పందేలు కాస్తున్నారు. ఓవైపు IPL బెట్టింగులు కొనసాగుతుండగా.. మరోవైపు ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, మెజారిటీ ఎంతవస్తుందని బెట్టింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. తణుకులో రూ.లక్షల్లో పందేలు కాస్తున్నారు. దీనికోసం ప్రత్యేకంగా డెన్లు ఏర్పాటుచేసుకుంటున్నట్లు సమాచారం.
– మీ వద్ద ఉందా..?

News May 17, 2024

ఏలూరు: బాలికతో బలవంతంగా పెళ్లి.. అత్యాచారం

image

ఓ బాలికపై యువకుడు అత్యాచారం చేసిన ఘటన ఏలూరు జిల్లాలో జరిగింది. పెదవేగి SI రాజేంద్రప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. పెదవేగి మండలంలోని ఓ గ్రామానికి చెందిన 9వ తరగతి చదివిన బాలికను పెళ్లిచేసుకుంటానని ఈ నెల 10న కవ్వకుంటకు చెందిన బెజవాడ పవన్ బయటకు తీసుకెళ్లాడు. బలవంతంగా పెళ్లి చేసుకొని అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తల్లి ఫిర్యాదుతో.. యువకుడిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI తెలిపారు.

News May 17, 2024

ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలకు 12,797 మంది: DRO

image

ఏలూరు జిల్లాలో ఇంటర్ సప్లమెంటరీ పబ్లిక్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని DRO పుష్పరాణి అధికారులను ఆదేశించారు. గురువారం ఆమె మాట్లాడుతూ.. ఈ పరీక్షలు మే 24 నుంచి జూన్ 1 వరకు జరుగుతాయన్నారు. పరీక్షల కోసం జిల్లాలో 27 కేంద్రాలు ఏర్పాటు చేసామన్నారు. ఫస్ట్ ఇంటర్ 7,744 మంది, ఒకేషనల్ 920 మంది, సెకండ్ ఇంటర్ 3,209 మంది, ఒకేషనల్ 924 మంది కలిపి మొత్తం 12,797 మంది పరీక్షకు హాజరుకానున్నట్లు తెలిపారు.

News May 16, 2024

ప.గో: పిల్లలు, భర్త కోసం భార్య నిరసన దీక్ష

image

ప.గో జిల్లా తాడేపల్లిగూడెంలోని ఎఫ్‌సీఐ కాలనీలో భర్త ఇంటి ముందు భార్య నిరసన దీక్ష చేపట్టింది. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. పెళ్లై 13 సంవత్సరాలైనా తన భర్త తనను దూరం చేస్తూ వచ్చాడని, ఇప్పుడు పిల్లల్ని చూసుకుందామని వస్తే వారిని తీసుకొని ఎక్కడికో వెళ్లిపోయాడని ఆవేదన వ్యక్తం చేసింది. భర్త, పిల్లలు వచ్చేవరకు ఇంటిముందే నిరాహార దీక్ష చేస్తూ ఉంటానని ఆమె తెలిపింది.