India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఈనెల 14 నుంచి 20 వరకు ప.గో జిల్లాలో గ్రామ స్థాయిలో పల్లె పండగ పంచాయతీ వారోత్సవాలు జరగనున్నాయి. దీంతో సంబంధిత శాఖల అధికారులు సమన్వయం చేసుకొని విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ నాగరాణి పిలుపునిచ్చారు. జిల్లాలో 423 పనులను రూ.51.03 కోట్ల వ్యయంతో చేపట్టనున్నట్లు తెలిపారు. వీటిలో 351 సీసీ రోడ్లు రూ.41.94 కోట్లు, 5 BT రోడ్స్ రూ.2.46 కోట్లు, 67CC డ్రైన్స్ రూ.6.63 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు.
ప.గో. జిల్లాలో అక్టోబర్ 14వ తేది జరగబోయే మద్యం షాపుల లాటరీ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదివారం తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. జిల్లాలోని మొత్తం 175 షాపులకు 5,627 దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. పెదమిరం నిర్మల ఫంక్షన్ హాల్లో ఉదయం 8 గంటల నుంచి లాటరీ విధానం మొదలవుతుందని అన్నారు. దరఖాస్తుదారుడు ఐడీ ప్రూఫ్తో రావాలన్నారు.
గడచిన 24 గంటల్లో జిల్లాలో కురిసిన వర్షపాతం 183.4 మీ.మీ. అని జిల్లా వాతావరణ శాఖాధికారులు ఆదివారం తెలిపారు. అత్యధికంగా ఆకివీడులో 29.0 మి.మీ, అత్తిలిలో 28.8 మి.మీ, ఇరగవరంలో 22.4 మి.మీ, పెనుగొండలో 16.8 మి.మీ, అత్యల్పంగా గణపవరంలో 2.6 మి.మీ పోడూరులో 3.8 మి.మీ, యలమంచిలిలో 4.4 మి.మీ నమోదు కాగా నరసాపురం, మొగల్తూరు, ఆచంటలో అసలు వర్షపాతం నమోదు కాలేదని అధికారులు తెలిపారు.
ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో నేటి నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని అధికారులు కన్నుల పండుగగా అలంకరించారు. ఈ నెల 20 వరకు జరగనున్న ఈ ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజు స్వామివారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. 17వ తేదీ రాత్రి స్వామివారి తీరు కళ్యాణం, 18వ తేదీ రాత్రి 7 గంటలకు స్వామివారి రథోత్సవం కార్యక్రమం జరుగుతుందని అధికారులు తెలిపారు.
అక్టోబర్ 14 నుంచి 16 వరకు భారీ వర్షాలు కురిసే నేపథ్యంలో అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి ఓ ప్రకటన ద్వారా తెలిపారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న నేపథ్యంలో 14 నుంచి 15 వరకు తేలిక పాటు వర్షాలు కురుస్తాయని, 16 నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
ద్వారకాతిరుమల అఖిలాండ కోటి బ్రహ్మాండనాయుడి వైభవాన్ని చాటే శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 13 నుంచి ప్రారంభం కానున్నాయి. చిన్నతిరుపతిగా పేరొందిన ద్వారకాతిరుమల దివ్య క్షేత్రంలో స్వామివారికి ఏటా రెండు పర్యాయాలు(వైశాఖ, ఆశ్వీయుజ మాసాల్లో)ఈ బ్రహ్మోత్సవాలు వైఖానస ఆగమోక్తంగా జరపడం సంప్రదాయంగా వస్తోంది. ఈనెల 13 నుంచి 20 వరకు ఈ ఉత్సవాలను నిర్వహిస్తామని ఆలయ అధికారులు తెలిపారు.
ఏలూరు జిల్లాలో మద్యం షాపులకు దరఖాస్తుల గడువు శుక్రవారంతో ముగిసింది. మద్యం షాపులకు దరఖాస్తులు వెల్లువెత్తడంతో రాష్ట్రంలోనే ఏలూరు జిల్లా రెండో స్థానంలో నిలిచింది. మొత్తం5,339 దరఖాస్తులు అందినట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది.ఈ నెల 14న లాటరీ పద్ధతిలో షాపులను కేటాయించనున్నారు. దీంతో దరఖాస్తు దారులంతా టెన్షన్ తో ఎదురుచూస్తున్నారు.
నల్లజర్లలోని శ్రీనివాసరావు కాలనీలో ఉంటున్న సురేశ్పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారి కథనం.. అదే ప్రాంతానికి చెందిన యువతిని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని చెప్పి గర్భవతిని చేశాడు. కుల పెద్దల సమక్షంలో యువతి తల్లిదండ్రులు యువకుడిని నిలదీయడంతో తనకు సంబంధం లేదని ముఖం చాటేసాడు. యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసామని సీఐ శ్రీనివాస్ శుక్రవారం తెలిపారు.
ప.గో జిల్లాలో మద్యం షాపులకు దరఖాస్తుల గడువు శుక్రవారంతో ముగిసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10,848 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు.
భీమవరం- 1,258,
తాడేపల్లిగూడెం-1,222,
తణుకు- 876,
నరసాపురం- 946,
పాలకొల్లు- 873,
ఆకివీడు-240,
ఏలూరు-738,
చింతలపూడి- 783,
భీమడోలు-1,095,
పోలవరం- 597,
జంగారెడ్డిగూడెం-959, అందినట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది.ఈ నెల 14న లాటరీ పద్దతిలో షాపులను కేటాయించనున్నారు.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తెడ్లూం గ్రామానికి చెందిన 3 ఏళ్ల బాలుడు సాత్విక్ వివిధ అనారోగ్య కారణాలతో ఆసుపత్రుల్లో వైద్యం చికిత్స పోందుతున్నాడు. తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థతి అంతమాత్రంగానే ఉండటంతో సాయం కోసం సంబంధిత చికిత్స పత్రాలతో ట్విటర్లో మంత్రి నారా లోకేశ్కు ట్యాగ్ చేశారు. మంత్రి లోకేశ్ స్పందిస్తూ.. సమస్యను పరిశీలించానని త్వరలోనే తన బృందం బాధిత కుటుంబాన్ని సంప్రదిస్తుందని ఆయన పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.