India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎన్నికల సంగ్రామంలో ప్రచార ఘట్టం నేటితో ముగియనుంది. నాయకులు కొద్దిరోజులుగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజల మద్దతును కూడగట్టుకున్నారు. ప్రచారంలో విమర్శలు, హామీలతో తమదైన రీతిలో ఓట్లు అభ్యర్థించారు. అభ్యర్థుల కుటుంబీకులు సైతం ప్రచారంలో నిమగ్నమయ్యారు. నేటి సాయంత్రంతో ఆ క్రతువు ముగియనుంది. ఐదేళ్ల పాలనకు ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో చూడాలి. – మన ప.గో. జిల్లాలో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుంది..?
ఎన్నికల నేపథ్యంలో రేపు సాయంత్రం నుంచి 48 గంటలు పాటు మద్యం అమ్మకాలు నిలిపివేయనున్నారు. దీంతో భీమవరం పట్టణంలో మద్యం దుకాణాల వద్ద మందుబాబులు పోటెత్తారు. ఇప్పటికే దుకాణాలలో మద్యం నిల్వలు చాలా వరకు అమ్ముడయ్యాయని నిర్వాహకులు చెబుతున్నారు.- మీ వద్ద పరిస్థితి ఏంటి..?
ఏలూరు జిల్లా కామవరపుకోటకు చెందిన వీరమల్ల మధు కుటుంబీకులు ‘ఈ ఇంట్లో ఓట్లు అమ్మబడవు.. డబ్బులు తీసుకోము కానీ తప్పకుండా ఓటు వేస్తాము’ అనే బ్యానర్ను ఇంటి గేటుకు ఏర్పాటుచేశారు. కాగా ఈ బ్యానర్ పలువురిని ఆలోచింపచేస్తుంది. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ.. ఎవరూ ప్రలోభాలకు లొంగకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పారు.
భీమవరంలో రేపు జరగవలసిన బీజేపీ అగ్రనేత అమిత్ షా రోడ్షో రద్దయింది. షా బిజీ షెడ్యూల్ వల్ల ఈ కార్యక్రమం రద్దయినట్లు పార్టీ శ్రేణులు వెల్లడించాయి.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమరావతిలో రైతుల మధ్య మంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుందని ఉండి నియోజకవర్గ కూటమి MLA అభ్యర్థి రఘురామకృష్ణరాజు తెలిపారు. ‘రచ్చబండ’ కార్యక్రమంలో భాగంగా గురువారం ప.గో. జిల్లా పెదఅమిరంలో ఆయన మాట్లాడారు. సీఎం జగన్ 5 నెలల కింద నగదు విడుదల చేసిన పథకాలకు డబ్బు జమ చేయాలంటూ కోర్టుకు వెళ్లడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
– RRR వ్యాఖ్యలపై మీరేమంటారు..?
ప.గో జిల్లా భీమవరం మండలం లోసరి చెక్పోస్ట్ వద్ద ఉదయం రూరల్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో రూ.1.87 కోట్ల విలువైన బంగారు ఆభరణాలతో పాటు రెండున్నర కిలోల బంగారం, ఐదున్నర కిలోల వెండిని సీజ్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ బంగారానికి సంబంధించి సరైన పత్రాలు చూపించకపోవడంతో వాటిని సీజ్ చేశామని తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఒకే ఊరికి చెందిన ఇద్దరు MLA అభ్యర్థులు ఒకే పార్టీ నుంచి వేర్వేరు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు. వారే శ్రీరంగనాథరాజు, పీవీఎల్ నరసింహరాజు. ప.గో జిల్లా ఉండి మండలం యండగండికి చెందిన వీరిద్దరూ వైసీపీ నుంచి బరిలో ఉన్నారు. శ్రీరంగనాథరాజు ఆచంట నుంచి.. పీవీఎల్ ఉండి నుంచి పోటీలో ఉన్నారు. గత ఎన్నికల్లోనూ వీరిద్దరూ పోటీ చేయగా.. శ్రీరంగనాథరాజు పితాని సత్యనారాయణపై గెలిచారు. పీవీఎల్ మంతెన శివరామరాజుపై ఓడారు.
ఉండిలో నేడు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం సభలో పాల్గొననున్న విషయం తెలిసిందే. ఉదయం 9.30 గంటలకు హెలికాప్టర్లో భీమవరం చేరుకుంటారు. అక్కడి నుంచి కాన్వాయ్లో ఉండి ప్రధాన వంతెన కూడలి వద్ద ఏర్పాటు చేసిన సభా ప్రాంగణానికి చేరుకుంటారు. 10 గంటలకు సభ ప్రారంభం కానున్నట్లు టీడీపీ నేతలు తెలిపారు. నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు రామరాజు కోరారు.
ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా జరిగేందుకు ఈ నెల 11న 6pm నుంచి 14న సాయంత్రం 6 గంటల వరకు 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు పశ్చిమ గోదావరి, ఏలూరు కలెక్టర్లు ఓ ప్రకటన విడుదల చేశారు. సమావేశాలు, బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహించడం నిషేధమని తెలిపారు. జనం గుంపులు గుంపులుగా, అయిదుగురి కంటే ఎక్కువ మంది సమూహంగా ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రశాంత ఎన్నికలకు సహకరించాలని కోరారు.
ఉండి నియోజకవర్గ కేంద్రంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు నేడు పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ఉండి ప్రధాన కూడలిలో నిర్వహించనున్న ప్రజాగళం బహిరంగ సభలో పాల్గొంటారని నియోజకవర్గ కూటమి అభ్యర్థి రఘురామకృష్ణరాజు తెలిపారు. కూటమి పార్టీల నాయకులు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అటు ఏలూరులోనూ పర్యటించనున్నారు.
Sorry, no posts matched your criteria.