WestGodavari

News May 9, 2024

ప.గో :11 నెలల తర్వాత నేటి నుంచి దర్శనాలు

image

వైశాఖ మాసం ప్రారంభం నేపథ్యంలో నత్తారామేశ్వరం క్షేత్రంలోని రామలింగేశ్వరస్వామి ఆలయం తలుపులు తెరవనున్నట్లు పాలక మండలి సభ్యులు తెలిపారు. నేటి నుంచి జూన్ 6 వరకు స్వామిని దర్శించుకోవచ్చని తెలిపారు. ఏడాదిలో 11 నెలలు నీటిలో ఉండే స్వామి కేవలం వైశాఖ మాసం నెలరోజులు భక్తులకు దర్శనమిస్తారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి స్వామి దర్శనానికి వచ్చే భక్తుల కోసం ఏర్పాట్లు చేసినట్లు ఈవో ఆర్. గంగా శ్రీదేవి చెప్పారు.

News May 9, 2024

ఓట్లు తారుమారు.. 15ని. వ్యవధిలో పరిష్కారం

image

ప్రతి ఓటరు తమ ఓటును వినియోగించుకోవాలని ఉమ్మడి ప.గో జిల్లా ఏపీ ఎన్జీవోస్ అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్ కోరారు. ఆయన మాట్లాడుతూ.. బుధవారం గోపాలపురం అసెంబ్లీకి చెందిన పలువురి ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు తారుమారు కాగా.. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రసన్న వెంకటేష్‌కు తెలిపామన్నారు. 15 నిమిషాల వ్యవధిలో ఆ ఉద్యోగులు ఓట్లు వినియోగించుకునేలా కలెక్టర్ చర్యలు తీసుకున్నారని చెప్పారు.

News May 8, 2024

దివ్యాంగ యువతిపై అత్యాచారం.. పదేళ్ల జైలు శిక్ష

image

దివ్యాంగురాలైన యువతిపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష పడింది. ఏలూరులోని ఓ కాలనీకి చెందిన యువతిపై అదే కాలనీకి చెందిన వెంకటరమణ 2016 ఏప్రిల్‌లో అత్యాచారానికి పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు. నేరం రుజువు కావడంతో బుధవారం మహిళా కోర్టు న్యాయమూర్తి రాజేశ్వరి ఆ నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారని కోర్టు పీపీ డీవీ రామాంజనేయులు తెలిపారు.

News May 8, 2024

ప.గో: చుక్కలేక మందు బాబులు తిప్పలు

image

ఎన్నికల నేపథ్యంలో మద్యంకు భారీ డిమాండ్ నెలకొంది. ప్రచారంలో భాగంగా రాజకీయ పార్టీలు మద్యం పంపిణీకి రంగం సిద్ధం చేయడంతో కొరత ఏర్పడింది. ముందుగానే ప్రభుత్వ మద్యం షాపుల్లో, ప్రైవేటు మాల్స్‌లో కొనుగోలు చేసి నిల్వలు ఉంచిన్నట్లు తెలుస్తోంది. పరిమితంగానే అమ్మకాలు జరగాలనే సంబంధిత శాఖ ఆదేశాలు ఉన్నాయి. చుక్కలేక మద్యం ప్రియులు అల్లాడిపోతున్నారు. పాలకొల్లులోని ప్రభుత్వ మాల్స్‌లో నిల్వలు లేక వెలవెలబోతున్నాయి.

News May 8, 2024

యలమంచిలి: ఫ్లయింగ్ స్క్వాడ్‌పై దాడి చేసిన వ్యక్తి అరెస్ట్

image

యలమంచిలి మండలం పెనుమర్రు గ్రామంలో ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బందిపై దాడి చేసిన వ్యక్తిని పోలీసులు మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. స్క్వాడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇలపకుర్రు గ్రామానికి చెందిన కొండేటి దుర్గాప్రసాద్‌పై 114/2024 U/s 188, 353,341,332,506,427 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. విధుల్లో ఉన్న వారిపై దాడులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ అన్నారు.

News May 8, 2024

ఉమ్మడి ప.గో జిల్లాలో నేడే ఈ సెట్

image

పాలిటెక్నిక్ పూర్తి చేసిన విద్యార్థులు ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశానికి బుధవారం ఈసెట్ నిర్వహించనున్నారు. ఏలూరులోని సీఆర్ఆర్ ఇంజినీరింగ్ కళాశాల , ఏలూరు కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, సిద్ధార్థ క్వెస్ట్ సీబీఎస్ఈ పాఠశాలలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం , సాయంత్రం వేళల్లో పరీక్ష నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

News May 8, 2024

చంద్రబాబు జేబు సంస్థగా ఎన్నికల కమిషన్: కొట్టు

image

రాష్ట్రంలో రైతులు ఆనందంగా ఉంటే చంద్రబాబు కడుపు మంటగా ఉందని వైసీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ అభ్యర్థి కొట్టు సత్యనారాయణ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల కమిషన్ చంద్రబాబు జేబు సంస్థగా పనిచేస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. ఐదేళ్లుగా కొనసాగుతున్న సంక్షేమ పథకాల అమలును ఈసీ అడ్డుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

News May 7, 2024

ప.గో.: వర్షం.. కొబ్బరిచెట్టు మీదపడి వ్యక్తి మృతి

image

ప.గో. జిల్లా పాలకోడేరు మండలంలో మంగళవారం వీచిన ఈదురుగాలులు, భారీ వర్షానికి కొబ్బరిచెట్టు పడి శృంగవృక్షం గ్రామానికి చెందిన రైతు నిమ్మల శ్రీను(45) మృతిచెందారు. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామంలో వర్షం కురవగా.. ధాన్యం రాశులపై కప్పేందుకని బరకాలు తీసుకునేందుకు తన ఇంటి సమీపంలో ఉన్న బాబాయ్ సుబ్బారావు ఇంటికి బైక్‌పై వెళ్లాడు. ఈ క్రమంలో కొబ్బరిచెట్టు అతనిపై పడింది. దీంతో శ్రీను అక్కడికక్కడే మృతిచెందాడు.

News May 7, 2024

ఏలూరు: పిడుగుపాటుకు RCM పాస్టర్ మృతి

image

ఏలూరు జిల్లా లింగపాలెం మండలం యడవల్లి గ్రామంలో విషాదం జరిగింది. మంగళవారం పిడుగుపాటుకు ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. మృతిచెందిన వ్యక్తి పరస రామారావుగా గుర్తించారు. పశువులు మేపుతుండగా పిడుగు పడినట్లుగా సమాచారం. మృతుడు RCM పాస్టర్ గా పనిచేస్తున్నాడు. రామారావు మృతితో యడవల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

News May 7, 2024

భీమవరంలో ఆసక్తికర పోరు.. ఎందుకో తెలుసా..?

image

భీమవరంలో పోరు ఆసక్తికరంగా మారింది. ఇక్కడ కాంగ్రెస్ నుంచి అంకెం సీతారం బరిలో దిగారు. కాగా.. వైసీపీ నుంచి బరిలో ఉన్న గ్రంధి శ్రీనివాస్, జనసేన అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు కూడా కాంగ్రెస్ నుంచి వచ్చినవారే. గంధ్రి తొలిసారి(2004) కాంగ్రెస్ నుంచి MLA అయ్యి, 2వసారి(2019) YCP నుంచి గెలిచారు. పులపర్తి రామాంజనేయులు మొదట(2009) కాంగ్రెస్‌ నుంచి, తర్వాత(2014) టీడీపీ నుంచి గెలిపారు. వీరిలో ఈసారి గెలిచేదెవరో.