India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాజమండ్రిలో నేడు ‘విజయ శంఖారావం’ పేరిట నిర్వహిస్తున్న బహిరంగ సభకు ప్రధాని మోదీ రానున్న విషయం తెలిసిందే. 60 ఎకరాల్లో సభకు ఏర్పాట్లు చేశారు. ప్రాంగణంలో 50వేల మంది, వేదికపై 44 మంది ఆశీనులు అయ్యేట్లు ఏర్పాట్లు చేశారు. మోదీతో పాటు పవన్ కళ్యాణ్, నారా లోకేశ్, పురందీశ్వరి, కాకినాడ, అమలాపురం, ఏలూరు, నరసాపురం MP అభ్యర్థులు, రాజమండ్రి పార్లమెంట్ పరిధిలోని ఏడుగురు MLA అభ్యర్థులకు స్థానం కల్పించనున్నారు.
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 11న భీమవరానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రానున్నట్లు బీజేపీ నేతలు తెలిపారు. ఆయన పర్యటన నేపథ్యంలో హెలిప్యాడ్ స్థలాన్ని, రూట్ మ్యాప్ను స్థానిక నేతలతో కలిసి ఆదివారం బీజేపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ గారపాడు తపనా చౌదరి పరిశీలించారు. అమిత్ షా పర్యటనను విజయవంతం చేయాలని నాయకులు, కార్యకర్తలను కోరారు.
రాణి రుద్రమదేవి ఏలిన పోరుగడ్డ మన నిడదవోలు. బ్రిటిష్ వారి వ్యాపారాలకు జల రావాణాలో ముఖ్య కేంద్రం ఇది. 2008 వరకు కొవ్వూరు నియోజకవర్గంలో భాగంగా ఉన్న నిడదవోలు.. ఆ తర్వాత విడిపోయింది. ఇప్పటివరకు ఇక్కడ 3సార్లు ఎన్నికలు జరగగా.. 2009, 14లో టీడీపీ, 2019లో వైసీపీ విజయం సాధించాయి. 4వ సారి జరుగుతున్న పోరులో కందుల దుర్గేశ్(జనసేన), శ్రీనివాస్ నాయుడు (వైసీపీ), పెద్దిరెడ్డి సుబ్బారావు(కాంగ్రెస్) తలపడుతున్నారు.
ప.గో. జిల్లా భీమడోలు రైల్వేస్టేషన్లో రైలు నుంచి జారిపడి గుర్తుతెలియని ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన ఆదివారం జరిగింది. ఈ నేపథ్యంలోనే రైల్వే SI ఆదినారాయణ ఘటన స్థలికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లేవన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో భద్రపరచామన్నారు. మృతుడి శరీరంపై రాజి అనే పేరు, పాము పచ్చబొట్లు ఉన్నాయన్నారు.
నరసాపురం నియోజకవర్గంలో 50 ఏళ్లుగా రాజకీయం అంతా కొత్తపల్లి సుబ్బారాయుడు, పరకాల శేషావతారం కుటుంబాలదే నడిచింది. 1967 నుంచి 82 వరకు 3 సార్లు MLA అయి పరకాల కీలకంగా వ్యవహరించగా.. ఆయన మరణానంతరం 1994 వరకు ఆయన సతీమణి, కొడుకు ప్రభాకర్ ఉన్నారు. 94లో జరిగిన ఎన్నికల్లో కొత్తపల్లి గెలుపుతో పరకాల కుటుంబ రాజకీయం నియోజకవర్గంలో కొంత తగ్గింది. 2009 వరకు కొత్తపల్లి హవా కొనసాగింది. ఇప్పటికీ ఆయనకు ప్రత్యేకస్థానం ఉంది.
మే 3 జరిగిన హోం ఓటింగ్ తొలి విడతలో 85సం. నిండిన వారు 192 మంది, దివ్యాంగులు 233 మంది మొత్తం 425 మంది ఇంటి వద్ద ఓటు వేశారని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సుమిత్ కుమార్ శనివారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. మే 4న 85సం. పైబడినవారు 307 మంది, దివ్యాంగులు 272 మంది మొత్తం 579 ఓటు వేశారని స్పష్టం చేశారు. దీంతో జిల్లాలో మొత్తం 1,004 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారని తెలిపారు.
ఏలూరు జిల్లా భీమడోలు రైల్వే స్టేషన్ పరిధి పాతూరు రైల్వే గేట్ వద్ద శనివారం ఓ వ్యక్తి రైలు నుంచి జారి పడి ప్రాణాలు కోల్పోయాడు. తిరుమల ఎక్స్ప్రెస్ రైలు నుంచి జారిపడి మృతి చెందినట్లు రైల్వే ఎస్ఐ నరసింహారావు తెలిపారు. మృతుడి వద్ద ఎటువంటి ఆధారాలు దొరకలేదన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచామని స్పష్టం చేశారు.
కాళ్ళ మండలం కలవపూడి గ్రామంలో శనివారం ఉండి నియోజకవర్గ కూటమి MLA అభ్యర్థి రఘు రామకృష్ణరాజు స్థానిక ప్రజలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. కూటమి అధికారంలోకి రాగానే పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. కూటమి గెలుపునకు సహకరించాలని ప్రజలను అభ్యర్థించారు.
వచ్చే ఎన్నికల్లో కూటమి ప్రభంజనం తథ్యమని ప.గో. జిల్లా ఉండి MLA అభ్యర్థి రఘురామకృష్ణరాజు అన్నారు. ఎమ్మెల్యే మంతెన రామరాజు, సినీనటుడు పృథ్వీరాజ్లతో కలిసి పాలకోడేరు, కొండేపూడి, వేండ్ర, గ్రామాల్లో ఆయన శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి అభ్యర్థులు 136 అసెంబ్లీ, 21 ఎంపీ సీట్లలో విజయం సాధిస్తారన్నారు. కూటమి మ్యానిఫెస్టో అద్భుతంగా ఉందన్నారు.
ద్వారకాతిరుమల శ్రీవారి సేవాటికెట్ల రుసుములను పెంచినట్లు ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు. సుప్రభాత సేవా టికెట్ రుసుము రూ.200 నుంచి రూ.300, అష్టోత్తరం శతనామార్చన రూ.300 నుంచి రూ.500, దీపారాధన సేవ రూ.10 నుంచి రూ.20లకు పెంచినట్లు పేర్కొన్నారు. ఈ నెల 10 నుంచి పెంచిన ధరలు అమల్లోకి వస్తాయని వెల్లడించారు.
Sorry, no posts matched your criteria.