WestGodavari

News April 24, 2024

ప.గో.: ఇండిపెండెంట్ MLA అభ్యర్థి స్థిరాస్థులు రూ.4,36,07,949

image

➤ నియోజకవర్గం: ఉండి
➤ అభ్యర్థి: వేటుకూరి శివరామరాజు (ఇండిపెండెంట్)
➤ చరాస్తులు: రూ.81,58,379
➤ స్థిరాస్తులు: రూ.4,36,07,949
➤ అప్పులు: లేవు
➤ భార్య చరాస్తులు: రూ.50,57,238
➤ భార్య స్థిరాస్తులు: రూ.80,00,000
➤ ఇద్దరి చేతిలో ఉన్న డబ్బులు: రూ.54,000
➤ 4 క్రిమినల్ కేసులు (పెండింగ్)
NOTE: ఎన్నికల అఫిడవిట్ వివరాలు ఇవి.

News April 24, 2024

ఏలూరు ఎంపీ అభ్యర్థిగా కారుమూరి సునీల్ నామినేషన్

image

ఏలూరు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థిగా కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ మంగళవారం నామినేషన్ వేశారు. ముందుగా ఏలూరు నగరంలో పార్టీ నాయకులు, కార్యకర్తలుతో భారీ ర్యాలీగా కలెక్టరేట్ వద్దకు తరలి వెళ్లారు. అనంతరం జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్‌కు నామినేషన్ పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు పాల్గొన్నారు.

News April 24, 2024

ప.గో.: తోట సీతారామలక్ష్మికి అభినందనలు

image

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో తోట సీతారామలక్ష్మి నాయకత్వంలో కూటమి విజయం సాధిస్తుందని తెలుగు మహిళా జిల్లాధ్యక్షురాలు శిరిగినీడి రాజ్యలక్ష్మి అన్నారు. టీడీపీ పొలిట్ బ్యూరో రాష్ట్ర సభ్యురాలుగా నియమితులైన ఆమెను భీమవరం పార్టీ కార్యాలయంలో కలిసి అభినందనలు తెలిపారు. నరసాపురం పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడు మంతెన రామరాజు, ఉండి అభ్యర్థి రఘురామకృష్ణంరాజు ఉన్నారు.

News April 24, 2024

RRRకు ఒక కారు.. ఆయన భార్యకు 3 కార్లు

image

➤ నియోజకవర్గం: ఉండి
➤ అభ్యర్థి: రఘురామకృష్ణ (TDP)
➤ చరాస్తులు: రూ.13,69,80,134
➤ స్థిరాస్తులు: రూ. 11,86,86,250
➤ అప్పులు: రూ.8,15,28,587
➤ భార్య చరాస్తులు: రూ.17,75,30,245
➤ భార్య స్థిరాస్తులు: రూ.175,45,16,634
➤ భార్య అప్పులు: రూ.4,45,15,536
➤ ఇద్దరి చేతిలో ఉన్న డబ్బులు: రూ.38,00,884
➤ వాహనాలు: RRRకు 1 (గోల్ఫ్ కార్), ఆయన భార్యకు 3 కార్లు.
NOTE: ఎన్నికల అఫిడవిట్ వివరాలు ఇవి.

News April 24, 2024

ప.గో.: మహిళపై అత్యాచారం.. జైలు

image

మహిళపై అత్యాచార యత్నానికి పాల్పడిన నిందితుడికి ఐదేళ్ల జైలు శిక్ష పడింది. కామవరపుకోట మండలం వీరిశెట్టివారిగూడేనికి చెందిన వితంతువుపై 2015లో అదే గ్రామానికి చెందిన నిజపరపు సత్యనారాయణ అలియాస్ సత్తియ్య అత్యాచారయత్నం చేసి పరారయ్యాడు. అప్పటి తడికలపూడి SIవిష్ణువర్ధన్ కేసు నమోదుచేసి దర్యాప్తుచేపట్టారు. తుది విచారణ అనతరం ఏలూరు 5వ అదనపు జిల్లాజడ్జి, మహిళా కోర్టు న్యాయమూర్తి రాజేశ్వరి ఈమేరకు తీర్పునిచ్చారు.

News April 24, 2024

పాలకోడేరులో RRR ఎన్నికల ప్రచారం

image

పాలకోడేరు మండలం కొండేపూడి గ్రామం నుంచి నర్సాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రచారాన్ని మంగళవారం ప్రారంభించారు. సందర్భంగా గ్రామంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం తన ప్రచారాన్ని ప్రారంభించారు. ఆయన వెంట ఎమ్మెల్యే మంతెన రామరాజు, కూటమి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

News April 24, 2024

ఏలూరు: నేడు లాస్ట్ డేట్

image

పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేసే అవకాశం లేనివారు హోం ఓటింగ్‌ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. 85 ఏళ్లు పైబడిన వారు, , నడవలేని స్థితిలో ఉన్నవారు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించిందన్నారు. పూర్తి చేసిన దరఖాస్తులను ఈ నెల 23వ తేదీలోగా పరిధిలోని ఆర్వోకు అందించాలని తెలిపారు.

News April 24, 2024

ప.గో: పదో తరగతి విద్యార్థులకు గమనిక

image

పదో తరగతి విద్యార్థుల మార్కుల జాబితాలను www.bse.ap.gov.in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని డీఈవో అబ్రహం తెలిపారు. రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం ఈ నెల 30 లోగా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. రీకౌంటింగ్ కోసం ఒక్కో సబ్జెక్టుకు రూ.500, రీవెరిఫికేషన్ కోసం ఒక్కో సబ్జెక్టుకు రూ.1000 చొప్పున చెల్లించాలని పదో తరగతి అనుబంధ పరీక్షలకు హాజరు కావాలనుకునే విద్యార్థులు ఈ నెల 30లోగా రుసుము చెల్లించాలన్నారు.

News April 24, 2024

ఈనెల 25న ఉండి స్వతంత్ర అభ్యర్థి నామినేషన్

image

ఈనెల 25వ తేదీ ఉండి నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు నామినేషన్ వేస్తారని కార్యాలయం సిబ్బంది తెలిపారు. టీడీపీ నుంచి టిక్కెట్ ఇవ్వకపోవడంతో భంగపడ్డ శివరామరాజు ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. ఈ సందర్భంగా శివ అభిమానులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

News April 24, 2024

ప.గో.: నాన్న గెలుపు కోసం.. ఇస్త్రీ చేస్తూ ప్రచారం 

image

రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు కుమార్తె దీపిక సోమవారం ప.గో. జిల్లా తణుకులో ప్రచారం చేపట్టారు. పట్టణంలోని స్థానిక 24వ వార్డులో తణుకు MLAగా నాన్న కారుమూరి వెంకట నాగేశ్వరరావు గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఓ ఇస్త్రీ దుకాణంలో ఇస్త్రీ చేస్తూ ఓట్లు అభ్యర్థించారు.