India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్ కుటుంబానికి చెందిన వట్టి పవన్ కుమార్ గురువారం జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. భీమడోలు మండలం ఏం.ఏం పురం గ్రామానికి చెందిన వట్టి పవన్ కుమార్ మంగళగిరి కేంద్ర కార్యాలయంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పార్టీ కండువా భుజాన వేసి సాదరంగా ఆహ్వానించారు. పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో, ఆయన ఆశయాలకు అనుగుణంగా కృషి చేస్తానని వట్టి పవన్ కుమార్ స్పష్టం చేశారు.
పిఠాపురంలో సినీ నటుడు పృథ్వీరాజ్ పర్యటించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలవాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముద్రగడపై తీవ్ర విమర్శలు చేశారు. పవన్ పై ముద్రగడ చేస్తున్న చెడు ప్రచారాన్ని ఖండించారు. ముద్రగడ పద్మనాభం కాపు జాతికే కలంకం, ఆయనో పెద్ద దరిద్రం అంటూ మండిపడ్డారు.
టీడీపీ-జనసేన-బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా బరిలో ఉన్న తణుకు మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణతో ఏఎంసీ మాజీ ఛైర్మన్, వైసీపీ సీనియర్ నాయకులు చిట్టూరి సునంద గురువారం భేటీ అయ్యారు. గత కొంతకాలంగా వైసీపీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న సునంద తాజాగా రాధాకృష్ణతో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. ఆమె పార్టీ వీడి టీడీపీలో చేరతారనే ప్రచారం ఇటీవల కాలంలో జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో వీరిద్దరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
వంట గ్యాస్ లీకై, తల్లీ కుమార్తె గాయలపాలైన ఘటన వాదాలకుంట గ్రామంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నామాల నిర్మల తన కుమార్తె కళ్యాణి వంట గదిలో ఉండగా.. గ్యాస్ సిలెండర్ నుంచి గ్యాస్ లీక్ అయ్యి మంటలు వ్యాపించాయి. దీంతో మంటల్లో వారు చిక్కుకున్న వారిని స్థానికులు గోపాలపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం రాజమండ్రికి తరలించారు.
దెందులూరు నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆలపాటి నరసింహామూర్తి నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు గురువారం దెందులూరు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ లావణ్యవేణికి తన నామినేషన్ పత్రాలను సమర్పించారు.
ఉమ్మడి ప.గో.జిల్లాలో బీసీవై తరఫున పోటీ చేయనున్న అసెంబ్లీ అభ్యర్థుల రెండో విడత జాబితా..ఎంపీ అభ్యర్థుల తొలి విడత జాబితాను గురువారం పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఉండి ఎమ్మెల్యే అభ్యర్థిగా గుడిగంట వెంకటేశ్వరరావు, ఏలూరు ఎంపీగా బైరబోయిన మాల్యాద్రి నియమితులయ్యారు. సామాజిక న్యాయానికి, అన్ని వర్గాల సమతుల్యతకు పెద్ద పీట వేస్తూ.. అభ్యర్థుల ఎంపిక జరిగిందన్నారు.
జగన్మోహన్ రెడ్డి బస చేసిన తణుకు మండలం తేతలి గ్రామంలోని శిబిరం వద్ద సందడి నెలకొంది. మరికొద్ది కాసేపట్లో జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో నాయకులు, కార్యకర్తల తాకిడి పెరిగింది. జగన్ మోహన్ రెడ్డిని చూసేందుకు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు చేరుకున్నారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
ప.గో.జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమై ఈనెల 25 వరకు కొనసాగనుంది.. ఈ క్రమంలో ఈ నెల 19న ఆరిమిల్లి రాధాకృష్ణ, బొలిశెట్టి శ్రీనివాస్, ముదునూరి ప్రసాద్ రాజు, నిమ్మల రామానాయుడు, కాంగ్రెస్ నుంచి కొలుకులూరి అర్జునరావు, నరసింహారాజు, ఆచంటలో వైసీపీ, టీడీపీ అభ్యర్థులు ఈనెల 19న నామినేషన్ దాఖలు చేయనున్నారు.
సార్వత్రిక ఎన్నికల లో భాగంగా ఏలూరు జిల్లాలో ఈనెల 18వ తేదీ నుండి నామినేషన్ స్వీకరణకు సర్వం సిద్ధం చేశామని జిల్లా ఎన్నికల అధికారి ప్రసన్న వెంకటేష్ చెప్పారు. ఏలూరు కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 18వ తేదీ నుండి 25వ తేదీ వరకు కార్యాలయ పనిదినాలలో ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు జిల్లాలోని ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు స్వీకరిస్తారన్నారు.
సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సుయాత్ర గురువారం షెడ్యూల్ అధికారికంగా పార్టీ నాయకులు ప్రకటించారు. తణుకు మండలం తేతలి గ్రామ శివారులో బస చేసిన ప్రాంతం నుంచి ఉదయం 9 గంటలకు బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. తణుకు, పెరవలి, సిద్ధాంతం, రావులపాలెం, ఆలమూరు, కడియం మీదుగా కడియపులంక చేరుకుని అక్కడే మధ్యాహ్న భోజనం చేస్తారు.
Sorry, no posts matched your criteria.