WestGodavari

News April 16, 2024

ప.గో.: సీఎం సిద్ధం బస్సు యాత్ర షెడ్యూల్ ఇదే..

image

సీఎం జగన్ మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర మంగళవారం ఉంగుటూరు మండలం నారాయణపురం రాత్రి బస చేసిన చోట నుండి బయలుదేరి నిడమర్రు, గణపవరం, ఉండి మీదుగా భీమవరం చేరుకుంటుంది. ఈ సందర్భంగా భీమవరంలో బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొంటారు. అనంతరం గరగపర్రు, పిప్పర, దువ్వ, తణుకు క్రాస్ మీదుగా ఈతకోటలో రాత్రికి సీఎం జగన్ బస చేస్తారు.

News April 16, 2024

పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధమా..?

image

సీఎం జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప.గో. జిల్లా నారాయణపురం నుంచి ప్రారంభం కానుంది. కాగా సీఎం జగన్ X (ట్విట్టర్) వేదికగా ‘DAY-16 పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధమా..?’ అంటూ పోస్ట్ చేశారు.

News April 16, 2024

ఏలూరు: MS నారాయణ మరణించి నేటికి 9 ఏళ్లు 

image

తెలుగు సినిమా హాస్యనటుడు M.S నారాయణగా పిలవబడే మైలవరపు సూర్యనారాయణది ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం నిడమర్రు. నేడు ఆయన జయంతి. ఎమ్మెస్ నారాయణ 1951 ఏప్రిల్ 16న జన్మించారు. ఆయన రచయితగా, దర్శకుడిగా, హాస్యనటుడిగా 17 సంవత్సరాలు సినీ రంగంలో సుమారు 700కు పైగా చిత్రాలలో నటించారు. అలాగే అనారోగ్య కారణాలతో 2015 జనవరి 23వ తేదీన హైదరాబాదులో మరణించారు.

News April 16, 2024

UPDATE: ఏలూరు జిల్లా మేమంతా సిద్ధం యాత్రలో అపశ్రుతి

image

ఏలూరు జిల్లాలో సీఎం జగన్ నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం బస్సుయాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. సోమవారం రాత్రి భీమడోలు మండలం పూళ్ల గ్రామ సమీపంలో బస్సుయాత్ర వెనక వెళ్తున్న వాహనాలు ఒక్కసారిగా స్లో అయ్యాయి. దీంతో వెనక నుంచి బైక్‌పై వస్తున్న గుండు నరేశ్ కాన్వాయ్‌లోని కారును ఢీ కొట్టాడు. ప్రమాద తీవ్రతకు నరేశ్ కారు వెనకభాగం నుంచి లోపలికి చొచ్చుకెళ్లాడు. గాయపడిన అతణ్ని అంబులెన్సులో ఆశ్రం వైద్యశాలకు తరలించారు.

News April 16, 2024

ముగ్గురు వ్యక్తులు.. 5 వెహికిల్స్‌కే ఛాన్స్: కలెక్టర్

image

మార్చి 18 నుంచి నామినేషన్ల ప్రక్రియ నిర్వహించడానికి ముందస్తు చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నామినేషన్లు 18వ తేదీ నుంచి 25వ తేదీ వరకు స్వీకరిస్తామన్నారు. ప్రతిరోజు రోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకే నామినేషన్ స్వీకరిస్తామని అన్నారు. నామినేషన్ వేసేటప్పుడు ముగ్గురు వ్యక్తులను, ఐదు వాహనాలను మాత్రమే అనుమతిస్తామని అన్నారు.

News April 15, 2024

ఏలూరు: సీఎం జగన్ బస చేసేది ఇక్కడే

image

సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర సోమవారం రాత్రి ముగిసిన వెంటనే ఆయన ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురం వద్ద రాత్రి బస చేస్తారు. ఈ నేపథ్యంలో నారాయణపురంలో సీఎం బసకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దీంతో ఆ చుట్టుపక్కల పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

News April 15, 2024

ఏలూరు: సీఎం జగన్ బస చేసేది ఇక్కడే

image

సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర సోమవారం రాత్రి ముగిసిన వెంటనే ఆయన ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురం వద్ద రాత్రి బస చేస్తారు. ఈ నేపథ్యంలో నారాయణపురంలో సీఎం బసకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దీంతో ఆ చుట్టుపక్కల పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

News April 15, 2024

ప.గో: జగన్ బస్సు యాత్ర.. షెడ్యూల్ ఇదే

image

సీఎం జగన్ చేపట్టిన బస్సు యాత్ర ఉమ్మడి ప.గో షెడ్యూల్ విడుదలైంది. మంగళవారం 9AMకు ఉంగుటూరు మండలం నారాయణపురం నుంచి రాచూరు, నిడమర్రు, గణపవరం, కొలమూరు, ఉండి మీదుగా భీమవరం చేరుకుంటారు. 4.30PMకు భీమవరంలో బహిరంగ సభ. అనంతరం రోడ్ షో కొనసాగుతుంది. గరగపర్రు, ఉందుర్రు క్రాస్, సీహెచ్ అగ్రహారం, ముదునూరు, రావిపాడు, దువ్వ, తణుకు, ఖండవల్లి మీదుగా తూర్పు గోదావరి జిల్లా ఈతకోట చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు.

News April 15, 2024

ప.గో: మీకు తెలుసా..? ‘200 ఏళ్ల చరిత్ర గల రామాలయం’

image

ప.గో జిల్లా పెనుమంట్ర మండలం నెగ్గిపూడి గ్రామంలో వెలిసిన శ్రీరామాలయానికి 200 ఏళ్ల చరిత్ర ఉంది. ఒకప్పుడు ఇక్కడ మునులు, ఋషులు తపస్సు ఆచరించారని ఆలయ పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ ఏటా శ్రీరామనవమి అంగరంగ వైభవంగా నిర్వహిస్తారని, దాదాపు 2వేల మందికి అన్నసమారాధన చేస్తారని తెలిపారు. ఆలయం వద్ద చలువ పందిరి, ఇతర ఏర్పాట్లు ముమ్మరం చేశారు.

News April 15, 2024

టికెట్ వార్..? అక్కడ పోటీచేసేదెవరు..?

image

ప.గో. జిల్లా ఉండి నియోజకవర్గ టీడీపీ టికెట్‌పై సందిగ్ధం కొనసాగుతూనే ఉంది. అక్కడి నుంచి సిట్టింగ్ MLA మంతెన పోటీచేస్తారా..? లేక ఎంపీ రఘురామకృష్ణ బరిలో ఉంటారా అన్నది తెలియరావడం లేదు. ఇదిలా ఉండగా ఈ నెల 22న నామినేషన్ వేస్తానని RRR ప్రకటించారు. కానీ ఏ స్థానం నుంచి వేస్తారో చెప్పలేదు. మరోవైపు ఆకివీడులో రామరాజు ప్రచారం కొనసాగిస్తున్నారు.
– ఇంతకీ ఉండి టికెట్ ఎవరికి దక్కుతుంది..? మీ కామెంట్..?