WestGodavari

News April 12, 2024

ఇంటర్ ఫలితాలు.. 9వ స్థానంలో పశ్చిమ గోదావరి

image

ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో పశ్చిమ గోదావరి జిల్లా 69 శాతం(ఉత్తీర్ణత)తో రాష్ట్రంలో 9వ స్థానంలో నిలిచింది. సెకండ్ ఇయర్ ఫలితాల్లో 80 శాతంతో 9వ స్థానంలో ఉంది.
➠ ఏలూరు జిల్లా ఫస్ట్ ఇయర్‌లో 72 శాతంతో 6వ స్థానంలో ఉండగా.. సెకండ్ ఇయర్‌లో 80 శాతం (ఉత్తీర్ణత)తో 8వ స్థానంలో నిలిచింది.

News April 12, 2024

ఉండి టికెట్ పంచాయితీ.. CBN వద్దకు రామరాజు

image

ప.గో జిల్లాలో ఉండి టికెట్ పంచాతీ రాజకీయ కాక రేపుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజుకు టీడీపీ అధినేత చంద్రబాబు నుంచి మరోసారి పిలుపు వచ్చింది. రామరాజుకు CBN నచ్చజెప్పనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అధినేతను కలవడానికి రామరాజు అతికొద్ది మంది అనుచరులతో కలిసి బయలుదేరినట్లు సమాచారం.

News April 12, 2024

ప.గో: UPDATE.. భర్త డెడ్‌బాడీ లభ్యం

image

ప.గో జిల్లా యలమంచిలి మండలం చించినాడ గోదావరి వంతెనపై నుంచి రెండేళ్ల చిన్నారి సహా దంపతులు దూకి గల్లంతైన విషయం తెలిసిందే. కుటుంబ యజమాని బొంతు కిషోర్ మృతదేహాన్ని గురువారం సాయంత్రం గుర్తించారు. భార్య యోచన, కుమార్తె శ్రీనిధి ఆచూకీ తెలియాల్సి ఉంది. ఆర్థిక సమస్యల కారణంగానే ఈ దంపతులు పాపతో సహా గోదావరిలో దూకినట్లు తెలుస్తోంది. భీమవరానికి చెందిన వీరు 3 నెలల కింద అమలాపురానికి జీవనోపాధి నిమిత్తం వెళ్లారు.

News April 12, 2024

ఉమ్మడి జిల్లా బాస్కెట్ బాల్ బాలికల జట్ల ఎంపిక

image

ఉమ్మడి జిల్లా బాస్కెట్ బాల్ బాలికల జట్ల ఎంపిక పోటీలు ఈ నెల 14న నిర్వహించనున్నట్లు బాస్కెట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులు కె.కృష్ణారెడ్డి తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనే బాలికల జట్టును ఏలూరు కస్తూరిబా బాలికల పాఠశాలలో ఉదయం 9 గంటలకు, బాలుర జట్టును తాడేపల్లిగూడెం కడకట్ల మునిసిపల్ హైస్కూల్ ఆవరణలో సాయంత్రం 4 గంటలకు ఎంపిక చేస్తామన్నారు.

News April 12, 2024

ఈనెల 15న భీమవరానికి సీఎం జగన్

image

ఈనెల 15న (సోమవారం) ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భీమవరం రానున్నారు. ఆయన చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా భీమవరం చేరుకుని ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ మేరకు భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదలైంది. పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని వారు కోరారు.

News April 12, 2024

ఏలూరు: నేడు ఈవీఎం, వీవీపాట్స్ ర్యాండమైజేషన్

image

ఎన్నికల నేపధ్యంలో ఈవీఎం, వీవీపాట్స్ ర్యాండమైజేషన్ ప్రక్రియ రాజకీయ పార్టీల సమక్షంలో ఈనెల 12న (శుక్రవారం) నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారి ప్రసన్న వెంకటేష్ తెలిపారు. ర్యాండమైజేషన్ నిర్వహణకు సంబంధిత అధికారులు, సిబ్బందికి విధులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశామన్నారు. జిల్లాలోని 1743 పోలింగ్ స్టేషన్లకు 4184 బ్యాలెట్ యూనిట్లు, 4184 కంట్రోల్ యూనిట్లు, 4534 వీవీప్యాట్స్ సిద్ధం చేస్తున్నామన్నారు.

News April 11, 2024

రూ.1291.96 కోట్ల విలువైన సామగ్రి సీజ్: ఏలూరు లెక్టర్

image

సార్వత్రిక ఎన్నికల నేపధ్యంలో నిర్వహిస్తున్న తనిఖీల్లో రూ.50 వేల కంటే ఎక్కువ నగదు లభిస్తే సీజ్ చేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ప్రసన్న వెంకటేష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్లో గురువారం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తంగా రూ.1291.96 కోట్ల విలువైన నగదు, బంగారం, మద్యం, ఇతర వస్తువులు సీజ్ చేశామన్నారు.

News April 11, 2024

ఏలూరు: ఉదయం YSRCP.. సాయంత్రం TDP

image

ఏలూరు జిల్లా పెదవేగి మండలం లక్ష్మీపురం పంచాయతీ పరిధిలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఉదయం వైసీపీలో చేరిన ఎమ్మార్సీ కాలనీకి చెందిన వార్డు మెంబర్ బాలిన శివ గంటల వ్యవధిలోనే తిరిగి టీడీపీలో చేరారు. దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం చింతమనేని మాట్లాడుతూ.. స్వార్థపరులే పార్టీని వీడి పోయారని, అలాంటి వాళ్ల వల్ల టీడీపీకి ఎలాంటి నష్టం లేదన్నారు.

News April 11, 2024

ఏలూరులో ‘లవ్ మౌళి’ మూవీ టీం సందడి

image

ఏలూరులోని SVC మహల్‌లో హీరో నవదీప్ సందడి చేశారు. నవదీప్ నటించిన ‘లవ్ మౌళి’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన ఏలూరు వచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నవదీప్ మాట్లాడుతూ.. లవ్ మౌళి చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందన్నారు. చిత్రాన్ని ఆదరించాలని కోరారు. రచయిత అనంత శ్రీరామ్, చిత్ర నటీమణులు, తదితరులు ఉన్నారు.

News April 11, 2024

పవన్.. రాజకీయాల్లో నటించొద్దు ప్లీజ్: ముద్రగడ

image

‘సినిమాల్లో నటించండి. రాజకీయాల్లో నటించకండి ప్లీజ్‌..’ అంటూ పవన్‌‌పై ముద్రగడ పద్మనాభం సెటైర్స్ వేశారు. తాడేపల్లిగూడెంలో జరిగిన కాపు ఆత్మీయ సమావేశంలో గురువారం ముద్రగడ మాట్లాడుతూ.. పవన్ రాజకీయాల్లో నటించి యువతను పాడు చేయొద్దని అన్నారు. అధికారంలోకి వస్తే స్వచ్ఛ నీరు ఇస్తామని కాకుండా స్వచ్ఛ సారా అందిస్తామనడమేంటని ప్రశ్నించారు. పవన్ తాడేపల్లిగూడెం నుంచి పోటీ చేసి ఉంటే బాగుంటుందని ముద్రగడ అన్నారు.