WestGodavari

News April 8, 2024

సమస్యలుంటే వాట్సాప్ చేయండి: ఏలూరు కలెక్టర్

image

ఏలూరు జిల్లాలో 16.25 లక్షల ఓటర్లు ఉన్నారని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు. ఓటు హక్కు సద్వినియోగంపై జిల్లా వ్యాప్తంగా ఓటరు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. మే 13న జరగబోయే ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. ఇందుకోసం వాట్సాప్ నెం 94910 41435 అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. సమస్యలు ఉంటే ఫొటో, వీడియోతో పై నెంబరుకు పంపాలని ప్రజలకు సూచించారు.

News April 7, 2024

ఏలూరులో ‘టిల్లు స్క్వేర్’ మూవీ టీం సందడి

image

ఏలూరులోని వి-మాక్స్ థియేటర్‌లో ఆదివారం ‘టిల్లు స్క్వేర్’ మూవీ టీం సందడి చేసింది. ఈ మూవీ విడుదలై మంచి టాక్‌తో దూసుకుపోతుంది. రూ.100 కోట్లు వసూలు చేసిన సందర్భంగా సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హీరో జొన్నలగడ్డ సిద్ధూ మాట్లాడుతూ.. మూవీకి ఇంతటి ఘనవిజయం చేకూర్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. మంచి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తానన్నారు. డైరెక్టర్ మల్లిక్ రామ్, తదితరులు ఉన్నారు.

News April 7, 2024

ఏలూరు: రైలు పట్టాలపై వ్యక్తి మృతదేహం

image

ఏలూరు జిల్లా భీమడోలు మండలం పాతూరు రైల్వే‌గేట్ షుగర్ ఫ్యాక్టరీ సమీపంలోని రైల్వే పట్టాలపై ఆదివారం ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని అధికారులు గుర్తించారు. రైల్వే రైటర్ ఆదినారాయణ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడి వయసు 25 నుంచి 30 ఏళ్ల మధ్య ఉంటుందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.

News April 7, 2024

పెన్షనర్ల ఇబ్బందులు తెలుసు: డిప్యూటీ సీఎం కొట్టు

image

తాడేపల్లిగూడెం పట్టణంలోని పెన్షనర్ల అసోసియేషన్ భవనంలో ఆదివారం పెన్షనర్ల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ పెన్షనర్లు పడే ఇబ్బందులు తనకు తెలుసని, వాటి పరిష్కారానికి ఎప్పటికప్పుడు కృషి చేస్తానని అన్నారు.

News April 7, 2024

ప.గో.: ఒక్కో ఎన్నికల్లో ఒక్కో పార్టీ విజయం.. ఈ సారి..?

image

చింతలపూడిలో రాజకీయం ఆసక్తిగా మారింది. ఇక్కడ వైసీపీ సిట్టింగ్ MLA ఎలీజాను కాదని కొత్తఅభ్యర్థి కంభం విజయరాజుకు ఆ పార్టీ అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. కూటమి నుంచి సైతం టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జిని కాదని కొత్త అభ్యర్థి సొంగా రోషన్‌ను ప్రకటించింది. అయితే నియోజకవర్గ ఓటర్లు 2009, 14, 19 ఎన్నికల్లో వరుసగా కాంగ్రెస్, టీడీపీ, వైసీపీలకు అధికారం కట్టబెడుతూ వచ్చారు. మరి ఈ సారి ఎవరికి అవకాశమిస్తారో చూడాలి.

News April 7, 2024

ప.గో.: ఆయన గెలిచిన ప్రతిసారి కొత్తపార్టీ నుంచే..

image

భీమవరం నియోజకవర్గం నుంచి టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి తరఫున బరిలో ఉన్న జనసేన అభ్యర్థి పులపర్తి ఆంజనేయులు ఓ ప్రత్యేకతను కైవసం చేసుకున్నారు. 2009లో ఆయన కాంగ్రెస్ నుంచి, 2014లో టీడీపీ నుంచి గెలుపొందారు. ఆ తర్వాత 2019లో టీడీపీ నుంచి పోటీ చేసినా.. ఓడిపోయారు. తాజాగా జనసేనలో చేరి టికెట్ దక్కించుకున్నారు. గతంలో 2 వేర్వేరు పార్టీల నుంచి గెలుపొందిన ఆయన తాజాగా మరోపార్టీ నుంచి బరిలో ఉన్నారు.

News April 7, 2024

ప.గో.: ఎన్నికల సిత్రం.. గారెలు, బజ్జీలు వేసిన MLA అభ్యర్థి

image

రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని కొవ్వూరు కూటమి అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. ఆదివారం మండలంలోని మలకపల్లిలో ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికీ వెళ్లి సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా గెలిపించాలని ఓట్లు అభ్యర్థించారు. అనంతరం ఆయన ఓ టిఫిన్ సెంటర్‌లో గారెలు, బజ్జీలు వేశారు.

News April 7, 2024

ఉండి టికెట్ RRRకేనా..? మీ కామెంట్..?

image

టీడీపీ అధినేత చంద్రబాబు నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో పాలకొల్లులో సమావేశం అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఉండి MLA అభ్యర్థిగా సిట్టింగ్ MLA మంతెనను కాదని RRRకు కేటాయించినట్లు వార్తలు రావడంతో మంతెన అభిమానులు బాబు కాన్వాయ్ వద్ద నినాదాలు చేస్తూ ఆందోళన చేశారు. ఆ తర్వాత టికెట్‌పై పూర్తి క్లారిటీ ఇవ్వలేదని మంతెన, RRR వేర్వేరుగా మీడియాతో వెల్లడించారు. దీంతో సందిగ్ధత నెలకొంది.
– మీ కామెంట్..?

News April 7, 2024

ప.గో.: టీడీపీకి షాక్.. బీసీ నేత రాజీనామా

image

ప్రముఖ బీసీ నేత, బీసీ సాధికారత రాష్ట్ర కన్వీనర్‌ చలమోలు అశోక్‌ గౌడ్‌ శనివారం టీడీపీకి రాజీనామా చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పార్టీలో అవమానాలు, వేధింపులు తట్టుకోలేకనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు అంటే ఆత్మాభిమానం కలిగిన వర్గాలే తప్ప పల్లకీలు మోసే బోయలు కాదని అన్నారు. 

News April 7, 2024

గణపవరంలో రూ.79 వేల నగదు పట్టివేత

image

గణపవరంలో ఎస్ ఎఫ్ టి టీమ్ అధికారులు వాహనాల తనిఖీల్లో రూ.79000 స్వాధీనం చేసుకున్నారు. దొరికిన నగదుకు తగిన ఆధారాలు చూపించకపోవడంతో సీజ్ చేసి ట్రెజరీకి పంపారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రూ.50 వేల పైబడి నగదుతో ప్రయాణించేవారు అందుకు తగిన ఆధారాలను తనిఖీ అధికారులకు చూపించి సహకరించాలని రిటర్నింగ్ అధికారి ఖాజావలి విజ్ఞప్తి చేశారు.