WestGodavari

News April 6, 2024

తాళ్లపూడి: లోయలో పడ్డ యాసిడ్ ట్యాంకర్

image

తాళ్లపూడి మండలంలో శనివారం పెను ప్రమాదం తప్పింది. తాళ్లపూడి నుంచి రాజమండ్రి వైపు యాసిడ్‌తో వెళ్తున్న ట్యాంకర్ అదుపుతప్పి గోదావరి గట్టుపై నుంచి లోయలోకి పల్టీ కొట్టింది‌. ఆ సమయంలో అక్కడ ఎవ్వరూ లేకపోవడం పెద్ద ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న కొవ్వూరు అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
ట్యాంకర్‌ను బయటకు తీసి యాసిడ్‌ను మరో ట్యాంకర్ ద్వారా రాజమండ్రికి తరలించారు.

News April 6, 2024

ఉండి టికెట్ నాకేనని CBN చెప్పలేదు: ఎంపీ RRR

image

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఉండి MLA టికెట్ తనకేనని చంద్రబాబు చెప్పలేదు. రామరాజుకేనని కూడా చెప్పలేదు. తప్పకుండా పోటీలో ఉంటా. నేను కండీషన్లు పెట్టి టీడీపీలో చేరలేదు. అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటా. MPగా పోటీ చేస్తానా..? MLAగానా..? అనేది కూడా చంద్రబాబు డిసైడ్ చేస్తారు.’ అని అన్నారు.

News April 6, 2024

జనసేనను మూసేసి త్యాగం చేయండి: ముద్రగడ

image

పవన్ ఇప్పుడు పోటీ చేస్తున్న 20 సీట్లు త్యాగం చేసి జనసేన పార్టీని మూసివేయండి అని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం అన్నారు. శనివారం తణుకులో ఆయన మాట్లాడారు. 2024లో జనసేనను మూసివేసే దిశగా ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ముందుగానే పార్టీని మూసివేసి త్యాగమూర్తిగా చరిత్రలో నిలిచిపోవాలని పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి ముద్రగడ మాట్లాడారు.

News April 6, 2024

20 సీట్లతో ఎలా సీఎం అయిపోతారు: ముద్రగడ

image

పవన్ 20 సీట్లతో ముఖ్యమంత్రి ఎలా అయిపోతారని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ప్రశ్నించారు. శనివారం తణుకులో వైసీపీ కాపు నాయకుల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి అధికారంలోకి వస్తే పథకాలన్నీ పక్కాగా అమలు చేస్తామని చెబుతున్న చంద్రబాబునాయుడు.. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదా ..?అని అడిగారు.

News April 6, 2024

ప.గో.: కాపుల వల్లే రాజకీయాల్లోకి వచ్చాను: మంత్రి

image

కాపుల వల్లే తాను రాజకీయాల్లోకి వచ్చానని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు పేర్కొన్నారు. శనివారం తణుకులోని కమ్మ కళ్యాణ మండపంలో ఏర్పాటుచేసిన వైసీపీ కాపు నాయకుల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి తనకు జడ్పీ ఛైర్మన్‌గా అవకాశం ఇచ్చారని గుర్తుచేశారు. ఇప్పుడు తన కుమారుడికి ఎంపీ సీటు ఇచ్చిన జగన్ మోహన్ రెడ్డిని జీవితంలో మర్చిపోలేనని అన్నారు.

News April 6, 2024

ఉండిలో టీడీపీ.. చింతలపూడిలో వైసీపీ

image

ఉమ్మడి ప.గో.లో గెలుపే లక్ష్యంగా YCP, TDP కూటమి MLA అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. టికెట్ల కేటాయింపు అయ్యాక చింతలపూడిలో సిట్టింగ్ MLA ఎలీజాను కాదని YCPవిజయరాజుకు టికెట్ ఇచ్చింది. దీంతో ఆయన కాంగ్రెస్‌లో చేరి టికెట్ దక్కించుకున్నారు. తాజాగా ఉండిలో TDP సైతం MLAమంతెన రామరాజును కాదని ఎంపీ RRRకు టికెట్ ఇచ్చింది. ఇప్పటికే రామరాజు అనుచరులు ఆందోళనలకు సిద్ధం కాగా ఆయనకు ఎలాంటి అవకాశం ఇస్తుందో చూడాలి.

News April 6, 2024

పెదపాడులో ACCIDENT..

image

పెదపాడు మండలం రామచంద్ర కళాశాల వద్ద శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గడ్డివాము ట్రాక్టర్‌ని లారీ ఓవర్ టేక్ చేసే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. దీంతో ట్రాక్టర్ రెండు ముక్కలుగా విడిపోయింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తులను వైద్యం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

News April 6, 2024

నరసాపురం ముఖ్యనేతలతో చంద్రబాబు MEETING

image

ప్రజాగళం సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు శనివారం పాలకొల్లులోని S.కన్వెన్షన్‌లో నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలతో సమావేశం అయ్యారు. ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 30 మందిని మాత్రమే సమావేశానికి అనుమతించారు. ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు తదితరులు పాల్గొన్నారు.

News April 6, 2024

ప.గో.: చంద్రబాబు పర్యటన.. విజయానికి తోడ్పడేనా..? మీ కామెంట్.?

image

నరసాపురం, పాలకొల్లులో TDP అధినేత చంద్రబాబు పర్యటనతో ఆ పార్టీ నేతల్లో ఉత్సాహం నెలకొంది. ప్రత్యర్థులపై విమర్శలు చేస్తూ.. పార్టీ నాయకుల్లో జోష్ నింపుతూ ప్రసంగం సాగించారు. నరసాపురం MLA ముదునూరి ప్రసాదరాజు మహాముదురు, ఇసుక అక్రమరవాణా ద్వారా రూ.30 కోట్లు దోచేశారని ఆరోపించారు. పార్టీ శ్రేణులు నరసాపూర్ ఎక్స్‌ప్రెస్‌లా దూసుకుపోవాలని పిలుపునిచ్చారు. బాబు పర్యటన TDP విజయానికి తోడ్పడుతోందా.
– మీ కామెంట్..?

News April 6, 2024

ప.గో.: ఒక్కసారి మహిళ.. 15 సార్లు పురుషులు

image

ఉండి నియోజకవర్గానికి 1952 నుంచి ఇప్పటివరకు 16 సార్లు ఎన్నికలు జరిగాయి. కాగా 1970లో జరిగిన ఉపఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన కె.ఆండాళమ్మ విజయం సాధించింది. నియోజకవర్గ చరిత్రలో ఆమె ఒక్కరే మహిళా MLAగా గెలిచి రికార్డు సొంతం చేసుకున్నారు. మరో విశేషం ఏంటంటే ఆమె ఇండిపెండెంట్‌గా పోటీచేసి గెలవగా ప్రత్యర్థిగా ఉన్న జి.ఎస్.రాజు సైతం ఇండిపెండెంట్‌గా ఉండటం విశేషం.