India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మత్తు ఇంజక్షన్స్ ఇస్తూ చోరీలకు అలవాటు పడి ఓ <<12965125>>వ్యక్తి ప్రాణం<<>> తీసిన వైద్యుడి బాగోతం తెలిసిందే. ఆ దొంగ డాక్టర్ అరెస్ట్ అయ్యాడు. పోలీసుల వివరాల ప్రకారం.. సత్రంపాడుకు చెందిన కొవ్వూరి భానుసుందర్ MBBS చదువుతున్నప్పటి నుంచి బెట్టింగ్స్కు అలవాటు పడి అప్పులు చేశాడు. వాటిని తీర్చేందుకు ఇలా మత్తు ఇంజక్షన్లు ఇస్తూ చోరీలకు పాల్పడుతున్నాడు. సోమవారం భానుసుందర్ను అరెస్టు చేసినట్లు సీఐ రాజశేఖర్ తెలిపారు.
TDP-జనసేన కూటమితో BJP కలవాలని పవన్ కృషి చేశారని, ఇదే విషయమై ఎవరికీ తెలియకుండా తాను ఎన్నో రోజులు ఢిల్లీలో గడిపానని నరసాపురం MP రఘురామకృష్ణరాజు అన్నారు. ‘రచ్చబండ’లో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చిన్న సమాచార లోపంతో తనకు టికెట్ రాలేదని, ఒకట్రెండు రోజుల్లో చంద్రబాబు న్యాయం చేస్తారనే నమ్మకం ఉందన్నారు. నియంతను నువ్వెంత అని ప్రశ్నించిన వ్యక్తినని, ప్రజల కోసమే ఒంటరి పోరాటం చేస్తున్నానని ఆయన తెలిపారు.
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని ఓడించడమే తన లక్ష్యమని నరసాపురం పార్లమెంటు సభ్యులు రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు. రచ్చబండ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ నుంచి ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. న్యాయస్థానాల్లో సామాన్యుడికి ఒక నిబంధన ముఖ్యమంత్రికి మరో నిబంధననా అని ఆయన ప్రశ్నించారు.
ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం కండ్రికగూడెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. వివరాలు.. బైక్పై వెళ్తున్న దంపతులు వేణి, పవన్ ప్రమాదవశాత్తు కరెంటు స్తంభాన్ని ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో పవన్ అక్కడికక్కడే చనిపోగా వేణికి గాయాలయ్యాయి. భర్త కళ్లముందే చనిపోవడంతో ఆమె రోదనలు మిన్నంటాయి. వెంటనే ఆమెను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఏలూరు జిల్లాలో వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. చింతలపూడి మార్కెట్ యార్డ్ వెనుక రమేశ్ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉన్నాడు. ఆయన మృతి చెంది వారం రోజులు అయినట్లు కుటుంబీకులు అభిప్రాయపడుతున్నారు. రమేశ్ చింతలపూడి జీబీజీ రోడ్లో సెలూన్ షాప్ నిర్వహిస్తున్నట్లు బంధువులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లి పరిశీలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం నియోజకవర్గానికి 1955 నుంచి 2019 వరకు మొత్తం 16సార్లు ఎన్నికలు జరిగాయి. ఓ ఎన్నికలో కేవలం 24 ఓట్ల తేడాతో MLA పీఠం చేజిక్కింది. 1999లో టీడీపీ నుంచి పోటీ చేసిన వంకా శ్రీనివాసరావు.. కాంగ్రెస్‘ఐ’ అభ్యర్థి బి.దుర్గారావుపై 24 ఓట్ల అతి స్వల్ప మెజార్టీతో MLAగా గెలిచారు. 1955లో పి.కోదండరామయ్య(కాంగ్రెస్) ఎస్.అప్పారావు(సీపీఐ)పై 492 ఓట్ల మెజార్టీతో MLAగా ఎన్నికయ్యారు.
ప.గో జిల్లాలో ఓ రైతు లేగ దూడ బర్త్ డే వేడుకలు ఘనంగా జరిపారు. పాలకోడేరు మండలం గోరగనమూడికి చెందిన రైతు పంపన రామకృష్ణకు చెందిన లేగ దూడ మొదటి పుట్టినరోజు సందర్భంగా ఆయన గ్రామంలోని పెద్దలను పిలిచి వారి సమక్షంలో కేక్ కట్ చేశారు. వారందరికీ పంచి పెట్టారు. ఆవు దూడ నా బిడ్డ లాంటిదని రామకృష్ణ తెలిపారు. విస్సకోడేరు సర్పంచ్ బొల్ల శ్రీనివాస్, గొరగనమూడి మాజీ సర్పంచ్ పాపారావు తదితరులు పాల్గొన్నారు.
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో ఆదివారం అర్ధరాత్రి నాగేశ్వరరావు(60) అనే వ్యక్తిపై <<12964707>>యాసిడ్ దాడి<<>> జరిగిన విషయం తెలిసిందే. స్థానికులు ఆయనను ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఉదయం మృతి చెందాడు. భార్యను కాపురానికి పంపడం లేదని అల్లుడు హరీశ్ మామ నాగేశ్వరరావుపై యాసిడ్ పోసినట్లు తెలుస్తోంది. హరీశ్ పరారీలో ఉండగా.. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఏలూరు జిల్లాలో ఓ వైద్యుడు మత్తు ఇంజక్షన్స్ ఇస్తూ చోరీలకు పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు. చొదిమెళ్లకు చెందిన భానుసుందర్ MBBS చదివాడు. తపాలా శాఖలో రిటైర్డ్ ఉద్యోగి మల్లేశ్వరరావు(63)తో సన్నిహితంగా ఉండేవాడు. గత DEC 24న మల్లేశ్వరరావు ఇంట్లో ఉండగా.. భానుసుందర్ వెళ్లి మత్తు ఇంజక్షన్ ఇచ్చి డబ్బు, నగలతో ఉడాయించాడు. ఇలాంటి కేసులు ఆ వైద్యుడిపై చాలానే ఉండగా.. మల్లేశ్వరరావు మృతితో అతడి తతంగం బయటపడింది.
సీ-విజిల్ యాప్లో ఇప్పటివరకు అందిన 181 ఫిర్యాదులలో 95 ఫిర్యాదులను పరిష్కరించామని ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అన్నారు. మరో 86 ఎన్నికలకు సంబంధం లేని ఫిర్యాదులు రాగా వాటిని తిరస్కరించామన్నారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో మొత్తంగా రూ.81.76 లక్షల విలువైన నగదు, మద్యం, ఇతర వస్తువులు సీజ్ చేశామన్నారు. జిల్లాలో నిరంతరంగా సర్వేలైన్స్ బృందాలు పనిచేస్తున్నాయన్నారు.
Sorry, no posts matched your criteria.