WestGodavari

News March 28, 2024

నిడమర్రు: వాహన తనిఖీల్లో రూ.3.5 లక్షల నగదు సీజ్

image

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏలూరు జిల్లాలో బుధవారం పలు చోట్ల నిర్వహించిన వాహనాల తనిఖీల్లో రూ.3.5 లక్షల నగదును అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్‌ చేశారు. ఉంగుటూరు మండలం బువ్వనపల్లి చెక్‌పోస్టు వద్ద నిర్వహించిన తనిఖీల్లో రూ1.75 లక్షలు నగదు సీజ్‌ చేసినట్లు నిడమర్రు ఎస్సై ఆర్‌.శ్రీను చెప్పారు. బువ్వనపల్లి సత్యనారాయణపురంలో ఎటువంటి పత్రాలు లేకుండా కారులో రూ.1.75 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.

News March 28, 2024

ఏజెన్సీలను మరింత అప్రమత్తంగా ఉంచాలి: కలెక్టర్

image

ఎలక్షన్ సీజర్ మేనేజ్ మెంట్ ఏజెన్సీలను మరింత అప్రమత్తంగా ఉండి జిల్లా వ్యాప్తంగా నిఘాను మరింత పటిష్ఠ పరచాలని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం ఏలూరులో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారులు తదితరులతో ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎంసీసీ అమలు, ఎస్ఎస్‌టీ, ఎఫ్ఎస్‌టి, వీఎస్‌టీ బృందాలు పనితీరు అంశాలపై కలెక్టర్ చర్చించారు.  

News March 27, 2024

అక్రమ రవాణా పై ప్రత్యేక బందోబస్తు నిర్వహిస్తున్నాం: ఎస్పీ

image

జిల్లాలో రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేయబడిన చెక్‌పోస్టుల ద్వారా ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేస్తూ గంజాయి, నాటు సారా, మద్యం, నగదు అక్రమ రవాణా జరగకుండా పటిష్ఠమైన బందోబస్తు నిర్వహిస్తున్నట్లు  ఎస్పీ మేరీ ప్రశాంతి తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన దగ్గర నుంచి జిల్లా వ్యాప్తంగా 31ప్లయింగ్ సర్వీసెస్ టీమ్‌లు తిరుగుతున్నాయని అన్నారు.

News March 27, 2024

పెదవేగి: భార్యను హత్య చేసిన ముద్దాయికి యావజ్జీవ కారాగార శిక్ష

image

పెదవేగి మండలంలో భార్యను హత్య చేసిన ముద్దాయికి యావజ్జీవ కారాగార శిక్ష రూ.1000 జరిమానా విధించినట్లు ఎస్పీ మేరీ ప్రశాంతి చెప్పారు. ఆమె మాట్లాడుతూ.. తాళ్లూరి రోజా కుటుంబ కలహాల మధ్య తల్లిదండ్రుల వద్ద నివాసం ఉంటుంది. ఏసు తన భార్యపై అనుమానంతో రాత్రి 11గంటలకు సమయంలో కొబ్బరిబోండాలు కొట్టే కత్తితో మెడపై నరకగా రోజా అక్కడికక్కడే మృతిచెందింది. విచారించిన అనంతరం కోర్టు శిక్ష విధించినట్లు ఎస్పీ తెలిపారు. 

News March 27, 2024

లైసెన్స్ కలిగిన ఆయుధాలను ప్రదర్శించకూడదు: కలెక్టర్

image

జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ విధించినట్లు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ప్రజలు లైసెన్స్ కలిగిన ఆయుధాలు వారీ వెంట తీసుకువెళ్లడం ప్రదర్శించుట చేయరాదన్నారు. నిషేధాజ్ఞలు ఎన్నికల ఫలితాల ప్రకటన తేదీ వరకు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. 

News March 27, 2024

సువిధ యాప్‌లో దరఖాస్తు చేసుకోవాలి: కలెక్టర్

image

ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించే రాజకీయ నాయకులు తప్పకుండా సువిధ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. జిల్లాలోని పార్టీ అభ్యర్థులు సమావేశాలు మొదలైనవాటిని నిర్వహించడానికి 48గంటల ముందుగా దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. పోలింగ్ ముగియడానికి 48గంటల ముందు నిశ్శబ్ద కాలం తప్పక పాటించాలని, దీనినే ఎన్నికల ముందు నిశ్శబ్దం అని పిలుస్తారని అన్నారు.

News March 27, 2024

జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు: కలెక్టర్

image

ఎన్నికల నేపద్యంలో ఎన్నికల కమిషన్ ఆదేశాలు అనుసారం జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ విధిస్తూ జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా ప్రజలు లైసెన్స్ కలిగిన ఆయుధాలు వారీ వెంట తీసుకువెళ్లడం, ప్రదర్శించుట నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీని ప్రకారం ఎన్నికల ప్రకటన వెలువడిన అనంతరం లైసెన్స్ పొందిన ఆయుధాలను వెంట తీసుకువెళ్లడం, ప్రదర్శించడం చేయరాదన్నారు.

News March 27, 2024

సీ.విజిల్ ద్వారా అందే ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించండి: జేసీ

image

సీ విజిల్ ద్వారా అందే ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ బి. లావణ్యవేణి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం వివిధ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారులతో సమీక్షించారు. ప్రవేటు భవనాలపై వాల్ పేయింటింగ్‌కు ఎటువంటి అనుమతి లేదని ఇప్పటికే ఉన్నవాటిని వెంటనే చెరిపించాలన్నారు. ఓటర్లను చైతన్యపరిచే స్వీప్ కార్యక్రమాల నివేదిక తయారు చేయాలన్నారు.

News March 27, 2024

ప్రభుత్వ ఆసుపత్రులలో 100శాతం ప్రసవాలకు కృషి చేయాలి: కలెక్టర్

image

ప్రభుత్వ, ప్రైవేటు వైద్యాధికారులతో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ బుధవారం సమీక్షించారు. భీమవరం కలెక్టరేట్ వశిష్ట కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రసూతి మాతృ మరణాలు ఎట్టి పరిస్థితుల్లో జరగడానికి వీలు లేదని, ముందస్తుగా వారి ఆరోగ్య పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించి తగిన వైద్యం అందించాలని ఆదేశించారు. 6ప్రసూతి మరణాలకు సంబంధించి విచారణ చేపట్టారు. 

News March 27, 2024

పెండింగ్‌లో ఉన్న ఫారంలను వేగంగా పరిష్కరించాలి: ముఖేశ్ కుమార్

image

పెండింగ్ లో ఉన్న ఫారం-7,8 లను వేగవంతంగా పరిష్కరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం రాష్ట్ర సచివాలయం నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్ వీడియోకాన్ఫరెన్స్ హాలు నుంచి జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి పాల్గొన్నారు.