India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తాడేపల్లిగూడెంలోని నిట్ కళాశాలలో భౌతికశాస్త్ర ఆచార్యుడిగా పనిచేస్తున్న మాచవరపు రాముడు చేసిన పరిశోధనకు జాతీయస్థాయి గుర్తింపు లభించింది. ‘స్పింట్రానిక్ అనువర్తనాలకు మాంగనీస్ ఆధారిత యాంటీఫేరో మ్యాగ్నెంట్ హ్యుస్లర్’ పదార్థాల అభివృద్ధిపై విస్తృత పరిశోధనలు చేస్తున్నారు. దీనికి గాను జాతీయస్థాయి గుర్తింపు రావడంతో భారత ప్రభుత్వ ఆధీనంలోని సైన్స్ అండ్ ఇంజినీరింగ్ రీసెర్చ్ బోర్డు రూ.25లక్షలు కేటాయించింది.
ఏలూరు పార్లమెంట్ నుంచి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పుట్టా మహేష్ యాదవ్, వైసీపీ నుంచి కారుమూరి సునీల్ బరిలోకి దిగనున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నుంచి సీటు ఆశించిన గోరుముచ్చు గోపాల్ యాదవ్ వైసీపీలో చేరారు. తనకు సీటు ఇవ్వకుండా అన్యాయం చేశారని తన వర్గీయులతో సమావేశాలు నిర్వహించి అండగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు ఆయన వైసీపీలో చేరడం టీడీపీకి మైనస్ అవుతుందా..? వైసీపీకి కలిసివస్తుందా..? కామెంట్ చేయండి.
తాను పార్టీ మారుతున్నానని వస్తున్న వార్తలపై ఏలూరు టీడీపీ సీనియర్ నాయకులు మాగంటి బాబు స్పందించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ.. గత 24 గంటల నుండి సోషల్ మీడియాలో వస్తున్న తాను పార్టీ మారుతున్నానని వస్తున్న వార్తలు అవాస్తవాలని, వాటిని నమ్మొద్దని చెప్పారు. వ్యక్తిగత పనులపై హైదరాబాదులో ఉన్న కారణంగా క్యాంప్ కార్యాలయంలో అందుబాటు లేనని చెప్పారు. టీడీపీని విడిచిపెట్టే ఆలోచన తనకు లేదన్నారు.
ప.గో. జిల్లాకు చెందిన మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బరాయుడు మంగళవారం జనసేన అధినేత పవన్కళ్యాణ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నరసాపురం నియోజకవర్గంలో జనసేన విజయానికి ముందుండి పార్టీ శ్రేణులను నడిపించాలని ఆయనను పవన్ కోరారు. అనంతరం నియోజకవర్గంలోని రాజకీయ పరిస్థితులపై కూలంకుశంగా చర్చించారు.
ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు సంబంధించి ఫిర్యాదులు చేసేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేకంగా సీ-విజిల్ యాప్ను ప్రవేశపెట్టింది. కాగా ఇప్పటివరకు ప.గో. జిల్లాలో 64 ఫిర్యాదులు వచ్చాయి. అత్యధికంగా దెందులూరు నియోజకవర్గంలో 17, ఏలూరులో 5, కైకలూరులో 8, నూజివీడులో 11, పోలవరంలో 13, ఉంగుటూరులో 10 ఫిర్యాదులు అందాయి. అందిన ఫిర్యాదులన్నింటినీ అధికారులు పరిష్కరించారు. యాప్ను ప్రజలు ఉపయోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
తాను అందించిన సేవలను అధిష్ఠానం గుర్తించి టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులిచ్చిందని ప్రవాసాంధ్రుడు కొవ్వలి యతిరాజా రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు మంగళవారం ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. ఈ సందర్భంగా ఆయనను పలువురు నాయకులు అభినందించారు.
ఏలూరు జిల్లాలో రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. మొన్నటి వరకు టీడీపీ నుండి ఎంపీ టికెట్ ఆశించిన గోరుముచ్చు గోపాల్ యాదవ్ మంగళవారం వైసీపీలో చేరిన విషయం తెలిసిందే. కాగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పార్టీ కండువా కప్పుకున్నారు. బీసీలకు సీఎం జగన్ న్యాయం చేశారని ఆయన తెలిపారు.
ప.గో. జిల్లా పాలకోడేరు మండలకేంద్రానికి చెందిన పి.దుర్గా సూర్యనారాయణ రాజు అదే గ్రామానికి చెందిన ఓ దివ్యాంగురాలిని (యువతి) నమ్మించి గర్భవతిని చేశాడు. పెళ్లి చేసుకోమని అతడిని కోరగా అతను నిరాకరించినట్లు దివ్యాంగురాలి తల్లి పార్వతి తెలిపింది. పోలీసులకు ఫిర్యాదుచేయగా..సదరు వ్యక్తిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు.
టీడీపీ ఏలూరు పార్లమెంట్ టికెట్ ఆశించిన గోరుముచ్చు గోపాల్ యాదవ్ ఆ పార్టీని వీడి మంగళవారం వైసీపీలో మంగళవారం చేరారు. ఈ సందర్భంగా ఏలూరు వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి కారుమూరు సునీల్ కుమార్ గోరుముచ్చు గోపాల్ యాదవ్కు పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. ఏలూరు పార్లమెంటు సీటు ఇవ్వకపోవడం కారణంగానే వైసీపీ పార్టీలో చేరినట్లు సమాచారం.
ఏలూరు జిల్లాలో ఓ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. చింతలపూడి మండలం కంచనగూడెం SGT మండల ప్రజాపరిషత్ ప్రాథమిక పాఠశాలలో చంచంరాజు టీచర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన నేపథ్యంలో అతడిని సస్పెండ్ చేసినట్లు విద్యాశాఖ జిల్లా అధికారి ఎస్.అబ్రహం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరూ ఎన్నికల నియమ నిబంధనలను అతిక్రమించరాదని ఆయన సూచించారు.
Sorry, no posts matched your criteria.