WestGodavari

News July 19, 2024

ఏలూరులో APEPDCL కంట్రోల్ రూం

image

ఏలూరు జిల్లాలో ప్రస్తుత వర్షాలు, రాబోయే 3 రోజుల్లో భారీ వర్ష సూచన నేపథ్యంలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా, డివిజన్ స్థాయిలో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసినట్లు ఏపీఈపీడీసీఎల్ అధికారులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. విద్యుత్ సమస్యలపై 94409 02926 నంబర్‌కు సమాచారం ఇవ్వాలన్నారు. జిల్లాలో సమస్యల పరిష్కారానికి సిబ్బంది అందుబాటులో ఉంటారని అన్నారు. SHARE IT..

News July 18, 2024

ప.గో జిల్లాలో వర్షపాతం వివరాలు ఇలా..

image

పశ్చిమ గోదావరి జిల్లాలో గురువారం ఉదయం 8.30 గంటల నుంచి 5.30 వరకు నమోదైన వర్షపాతం వివరాలను అధికారులు వెల్లడించారు. తాడేపల్లిగూడెం 95.8, పెంటపాడు 71.6, పాలకొల్లు 62.2, నరసాపురం 54.6, భీమవరం 50.4, ఉండి 48.2, ఇరగవరం 46.4, పాలకోడెరు 45.2, మొగల్తూరు 34.6, అత్తిలి 33.2, ఆకివీడు 33.0, పెనుగొండ 32.4, గణపవరం 31.6, వీరవాసరం 31.4మి.మీ వర్షపాతం నమోదైంది. 20 మండలాల్లో 831.2 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదైంది.

News July 18, 2024

ప.గో: మృతదేహాన్ని తరలిస్తున్న పడవ బోల్తా

image

దహన సంస్కారాలకు డెడ్‌బాడీని తరలిస్తున్న పడవ బోల్తా పడింది. ఈ ఘటన ప.గో జిల్లా పాలకోడేరు మండలం కొండేపూడిలో గురువారం జరిగింది. గ్రామంలో ఓ వృద్ధుడు మరణించగా, మృతదేహన్ని శ్మశానవాటికకు తీసుకువెళ్లే క్రమంలో కాలువ దాటాల్సి వచ్చింది. వర్షాలకు ఉద్ధృతంగా ఉన్న ఆ కాలువ మీదుగా నాటు పడవలో డెడ్‌బాడీ తీసుకెళ్తుంటే ఒక్కసారిగా అది బోల్తా పడింది. అందరూ క్షేమంగా బయటపడగా.. కాలువపై వంతెన ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

News July 18, 2024

వరదలో చిక్కుకున్న 30 మంది.. వేలేరుపాడుకు హెలికాప్టర్

image

ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం నారాయణపురంలోని కట్ట మైసమ్మ గుడి వద్ద వరద భారీగా ప్రవహిస్తుంది. 5 కార్లు, 4 ఆటోలు, 10 బైకులు సహా దాదాపు 30 మంది ఆ వరదలో చిక్కుకున్నాయి. సమాచారం అందుకున్న పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సహాయక చర్యల కోసం ఉన్నతాధికారులతో మాట్లాడి హెలికాప్టర్‌ను రప్పించారు. ఆ హెలికాప్టర్ సహాయంతో బయటకు తరలిస్తున్నారు.

News July 18, 2024

ఏలూరు: హమ్మయ్య.. కారులో ఉన్న అందరూ సేఫ్

image

వేలేరుపాడు మండలం మాధవరం వాగులో కారు కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. స్థానికులు, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా ముందుగా బాలుడు జగదీశ్ కుమార్‌ క్షేమంగా బయటపడ్డాడు. కొద్దిసేపటికే మిగతా నలుగురు రామారావు, జ్యోతి, కుందనకుమార్, సాయి జ్యోతి బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై CMO ఆరా తీసింది. అవసరమైతే హెలికాప్టర్, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను పంపాలని కలెక్టర్, జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

News July 18, 2024

డిప్యూటీ సీఎంకు నర్సాపురం MPDO రాసిన లేఖ వైరల్

image

నర్సాపురం ఎంపీడీవో వెంకటరమణ అదృశ్యంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. వెంటనే ఆయన ఆచూకీ కనుక్కోవాలని అధికారులను ఆదేశించారు. ఆయన అదృశ్యానికి కారణమైన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు ఒక ఫోన్లో డిప్యూటీ సీఎంకు రాసిన లేఖను పంపారు. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

News July 18, 2024

ఆచంటలో బోరు నుంచి వింత శబ్దాలు UPDATE

image

ఆచంటలో వాడకంలో లేని చేతి పంపు బోరు నుంచి మంగళవారం వింత శబ్దాలు వచ్చిన విషయం తెలిసిందే. బుధవారం నిపుణుల సమక్షంలో దానికి మూత వేసి, ఇసుక, బ్యాలెట్ పౌడర్‌తో పూడ్చి వేశారు. వాడకంలో లేకపోవడం, ఈ భూమిలోపల హైడ్రో కార్బన్ వాయువు ఉండడంతో జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ ప్రక్రియను ఓఎన్‌జీసీ విపత్తుల నివారణ నరసాపురం ఇన్‌ఛార్జ్ రవి,అగ్నిమాపక అధికారి వైవీ జానకీరామ్ పర్యవేక్షించారు.

News July 18, 2024

నరసాపురం MPDOకి గుర్తుతెలియని వారి నుంచి ఫోన్ కాల్స్?

image

ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ సోదరుడు సునీల్ బుధవారం విజయవాడ కానూరులో నరసాపురం ఎంపీడీవో కుటుంబ సభ్యులను కలిశారు. అదృశ్యానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఎంపీడీఓ వినియోగిస్తున్న ఫోనుకు గత కొద్దిరోజుల నుంచి గుర్తుతెలియని వ్యక్తులు కాల్ చేశారని సమాచారం. కాల్స్ వచ్చిన ప్రతిసారీ నరసాపురంరమణారావు తీవ్ర ఆందోళన చెందేవారని తెలిపారు. ఇటీవల మెడికల్ లీవు తీసుకుని కానూరులోని ఇంటికి వెళ్లారన్నారు.

News July 18, 2024

ఉమ్మడి ప.గో జిల్లాలో భారీగా ఎస్సైల బదిలీలు

image

ఏలూరు రేంజ్ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న 111 మంది ఎస్సైలు బదిలీ అయ్యారు. ఉమ్మడి జిల్లాల్లో పని చేస్తున్న కొందరిని ఎన్టీఆర్ పోలీసు కమిషనరేట్‌కు బదిలీ చేశారు. ప.గో జిల్లాలోని పలువురిని కృష్ణా జిల్లాకు, అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని కొందరు ఎస్సైలను కృష్ణా, ఏలూరు జిల్లాలకు స్థానచలనం కలిగించారు. NTR పోలీసు కమిషనరేట్‌లో పని చేస్తున్న పలువురిని ఏలూరు, ప.గో, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు బదిలీ చేశారు.

News July 18, 2024

మంత్రి నిమ్మలను కలిసిన ప.గో. నూతన SP

image

ప.గో. జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అద్నాన్ నయీం అస్మి బుధవారం మంత్రి నిమ్మల రామానాయుడును పాలకొల్లులో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు మంత్రికి పూలమొక్కను అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలో శాంతిభద్రతల గురించి ఇరువురు కాసేపు చర్చించుకున్నారు.