India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాష్ట్ర వ్యాప్తంగా జనసేన 21 చోట్ల పోటీ చేయనుండగా అందులో ఉభయ గోదావరి జిల్లాల నుంచి 10 అభ్యర్థులను ప్రకటిస్తూ ఫైనల్ లిస్ట్ విడుదల చేసింది. పి.గన్నవరం టికెట్ మొదట టీడీపీ అభ్యర్థికి కేటాయించినప్పటికీ చివరికి ఆ సీటు జనసేన ఖాతాలోకి వెళ్లింది. పోలవరం సీటు సైతం చివరివరకు సందిగ్ధత ఉండగా..చివరికి జనసేన అభ్యర్థి చిర్రి బాలరాజుకు అవకాశం వచ్చింది. మొత్తంగా గోదారి జిల్లాలు జనసేనకు కీలకం కానుండగా ఓటరు ఎటువైపో..?
నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును జీర్ణించుకోలేక జంగారెడ్డిగూడెం మండలం పేరంపేట గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నేత భీమడోలు వెంకన్న గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి నారా భువనేశ్వరి మంగళవారం పేరంపేట గ్రామానికి వస్తున్నారని టీడీపీ మండలాధ్యక్షుడు సాయిల సత్యనారాయణ తెలిపారు. నేతలు కార్యకర్తలు తరలి రావాలని తెలిపారు.
బ్యాంక్ అధికారినంటూ ఫోన్ చేసి ఓ సైబర్ కేటుగాడు డబ్బు కాజేశాడు. ఈ ఘటన ఏలూరులో జరిగింది. ఇంద్రప్రస్థకు చెందిన బదులు వెంకటేశ్వరప్రసాద్కు ఓ అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి.. బ్యాంక్ అధికారినంటూ నమ్మబలికాడు. క్రెడిట్ కార్డు అప్డేట్ చేయాలంటూ వివరాలు తెలుసుకొని వెంకటేశ్వరప్రసాద్ ఖాతాలోంచి రూ.92,650 కాజేశాడు. వెంటనే బాధితుడు ఫిర్యాదు చేయగా.. ఏలూరు త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఉమ్మడి ప.గో జిల్లాలోని 15 నియోజకవర్గాల అభ్యర్థులెవరో తేలింది. ఇక ప్రచారపర్వం ఊపందుకోనుంది. అయితే.. లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఈసారి ఏలూరు స్థానంపై ఆసక్తి నెలకొంది. ఇక్కడ వైసీపీ నుంచి మంత్రి కారుమూరు నాగేశ్వరరావు కొడుకు సునీల్ కుమార్ బరిలో ఉండగా.. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అల్లుడు పుట్టా మహేశ్కుమార్కు TDP టికెట్ ఇచ్చింది. వీరిద్దరిదీ బీసీ సామాజికవర్గమే. మరి వీరిలో ఎవరూ సత్తా చాటేనో చూడాలి.
తమ కోడలిని తమకు అప్పగించాలని ఓ అత్త ఏలూరు SPకి ఫిర్యాదు చేసింది. నవాబుపేటకు చెందిన సురేష్ Febలో లవ్మ్యారేజ్ చేసుకున్నాడు. యువతి పేరెంట్స్కి పెళ్లి ఇష్టం లేకపోవడంతో ఏలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజయవాడలో ఓ న్యాయవాది వద్ద కౌన్సెలింగ్ ఇప్పిస్తున్నారు. ఈనెల 22న ఆ న్యాయవాది ఇంటి నుంచి యువతిని తల్లిదండ్రులు తీసుకెళ్లిపోయారని, దాంతో సురేష్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని తల్లి ఫిర్యాదులో పేర్కొంది.
ఎన్నికల నిబంధనలు ఎవరు ఉల్లంఘించినా ఉపేక్షించేది లేదని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ స్పష్టం చేశారు. కొయ్యలగూడెం మండలం పరంపూడి గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఇద్దరు మహిళా వాలంటీర్లను, ఉంగుటూరు మండలం నారాయణపురం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మరో వాలంటర్ను విధుల నుండి తొలగించామని తెలిపారు.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో అధికారులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. శనివారం నిర్వహించిన తనిఖీల్లో రూ.2.59 లక్షలు సీజ్ చేసినట్లు ఉంగుటూరు నియోజకవర్గ ఎన్నికల అధికారి, ఏలూరు ఆర్డీవో ఎన్.ఎస్ కె.ఖాజావలి వెల్లడించారు.
ప.గో. జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి అభ్యర్థులు ఎట్టకేలకు ఖరారయ్యారు. పోలవరం టికెట్పై జనసేన అభ్యర్థి చిర్రి బాలరాజుకు కేటాయించగా.. కొద్ది రోజులుగా ఉన్న సందిగ్ధత వీడింది. పొత్తులో భాగంగా 6 స్థానాల్లో జనసేన, 9 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు బరిలో ఉన్నారు. బీజేపీకి పోటీ చేసే అవకాశం రాలేదు. మరి కూటమి అభ్యర్థులు ఎన్నింట విజయం సాధించేనో చూడాలి మరి.
భీమవరం నియోజకవర్గానికి 1955, 1962లలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నాచు వెంకట్రామయ్య కాంగ్రెస్ తరఫున వరుస విజయాలు సాధించారు. 1967లో సైతం కాంగ్రెస్ నుంచి బరిలో నిలవగా.. స్వతంత్ర అభ్యర్థిగా బి.విజయ్ కుమార్ రాజు పోటీలో నిలిచి 9207 ఓట్ల మెజారిటీతో గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారు. దీంతో వెంకట్రామయ్య హ్యాట్రిక్ విజయానికి అడ్డుపడింది. 1972 నాటికి విజయ్ కుమార్ కాంగ్రెస్లో చేరి మరోసారి విజయం సాధించారు.
వీరవాసరం మండలం మత్స్యపురి గ్రామంలో భీమవరం నియోజవర్గ జనసేన అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను గెలవగానే జన సైనికుల మీద మత్స్యపురి అల్లర్లలో అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేయిస్తానని హామీ ఇచ్చారు. సమావేశంలో పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ కొటికలపూడి గోవిందరావు, జడ్పిటిసి గూండా జయప్రకాశ్ నాయుడు, తదితరులు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.