WestGodavari

News March 23, 2024

పట్టుకోసం కూటమి.. ఆ రెండూ వదలమంటున్న వైసీపీ!

image

ఉమ్మడి ప.గో 15 నియోజకవర్గాల్లో 2చోట్లే ఇప్పటివరకు వైసీపీ MLAలు గెలవలేదు. 2019లో 13 స్థానాల్లోనూ వైసీపీ గెలిచినా.. పాలకొల్లు(నిమ్మల), ఉండి(మంతెన రామరాజు)లో TDP జెండా ఎగిరింది. పోలవరంలో 2012(ఉప), 2019లో తెల్లం బాలరాజు వైసీపీ నుంచి 2సార్లు MLAగా గెలిచారు. మిగతా అన్నిచోట్ల వైసీపీ ఒకసారే గెలిచింది. ఈసారి జిల్లాపై పట్టుకోసం కూటమి.. పాలకొల్లు, ఉండి స్థానాలనూ వదిలేది లేదంటూ వైసీపీ వ్యూహ రచన చేస్తున్నాయి.

News March 23, 2024

పట్టుకోసం కూటమి.. ఆ రెండూ వదలమంటున్న వైసీపీ!

image

ఉమ్మడి ప.గో 15 నియోజకవర్గాల్లో 2చోట్ల మాత్రమే ఇప్పటివరకు వైసీపీ MLAలు గెలవలేదు. 2019లో 13 స్థానాల్లోనూ వైసీపీ సత్తా చాటినా.. పాలకొల్లు(నిమ్మల), ఉండి(మంతెన రామరాజు)లో TDP జెండానే ఎగిరింది. కొవ్వూరు, 2012(ఉప), 2019 ఎన్నికల్లో ప్రసన్నకుమార్.. పోలవరంలో 2012(ఉప), 2019లో తెల్లం వైసీపీ నుంచి 2సార్లు MLAలుగా గెలిచారు. ఈసారి జిల్లాపై పట్టుకోసం కూటమి.. ఆ 2 వదిలేది లేదంటూ వైసీపీ వ్యూహ రచన చేస్తున్నాయి.

News March 23, 2024

పట్టుకోసం కూటమి.. ఆ రెండూ వదలమంటున్న వైసీపీ!

image

ఉమ్మడి ప.గోలోని 15 నియోజకవర్గాల్లో 2చోట్ల మాత్రమే ఇప్పటి వరకు వైసీపీ MLAలు గెలవలేదు. గత ఎన్నికల్లో 13 స్థానాల్లోనూ వైసీపీ సత్తా చాటినా.. పాలకొల్లు(నిమ్మల), ఉండి(మంతెన రామరాజు)లో TDP జెండానే ఎగిరింది. ఇక కొవ్వూరులో 2012, 19 ఎన్నికల్లో ప్రసన్నకుమార్.. పోలవరంలో 2012, 19లో తెల్లం వైసీపీ నుంచి 2సార్లు MLAలుగా గెలిచారు. ఈసారి జిల్లాపై పట్టుకోసం కూటమి.. ఆ 2 వదిలేది లేదంటూ వైసీపీ పథక రచన చేస్తున్నాయి.

News March 23, 2024

ప.గో: ‘పది’ పరీక్షలకు 96 శాతం హాజరు

image

ప.గో జిల్లా వ్యాప్తంగా 127 కేంద్రాల్లో శుక్రవారం నిర్వహించిన పదో తరగతి గణితం పరీక్షకు 96శాతం మంది విద్యార్థులు హాజరయ్యారని డీఈఓ ఆర్‌.వెంకటరమణ తెలిపారు. 21,527 మంది విద్యార్థులకు 20,734 మంది హాజరయ్యారన్నారు. ఎస్‌ఎస్‌సీ (ఏపీఓఎస్‌ఎస్‌) పరీక్షకు 830 మందికి 729 మంది.. ఇంటర్ (ఏపీఓఎస్‌ఎస్‌) పరీక్షకు 810 మందికి 738 మంది హాజరయ్యారని తెలిపారు. ఎక్కడా మాల్‌ప్రాక్టీస్‌ కేసులు నమోదు కాలేదని అన్నారు.

News March 23, 2024

ఉండి మాజీ ఎమ్మెల్యే శివపై కేసు నమోదు

image

ఉండి మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజుపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద కేసు నమోదైంది. పాలకోడేరు ఎస్‌ఐ నాళం శ్రీనివాసరావు శుక్రవారం ఈ విషయం వెల్లడించారు. ఈ నెల 20న పాలకోడేరు మండలంలో శివరామరాజు సుమారు 30 వాహనాలతో ఊరేగింపు నిర్వహించారని, అందుకు ముందస్తు అనుమతి తీసుకోలేదని ఎస్సై తెలిపారు. దీనిపై ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ ఇచ్చిన సమాచారం మేరకు పాలకోడేరు తహశీల్దార్‌ నాగార్జున పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News March 22, 2024

ఏలూరు చరిత్రలో మహిళ MLA లేరు

image

ఏలూరు నియోజకవర్గానికి 1952 నుంచి 2019 వరకు 15 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. కాగా ఇప్పటివరకు గెలిచిన MLAలలో ఒక్కరు కూడా మహిళలు లేరు. 1994లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‘ఐ’ తరఫున మాగంటి వరలక్ష్మి బరిలో ఉన్నప్పటికీ ఆమెపై టీడీపీ అభ్యర్థి మరడాని రంగారావు 9247 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తాజా ఎన్నికల్లో సైతం ప్రధాన పార్టీల నుంచి పురుషులే బరిలో ఉన్నారు.

News March 22, 2024

ప.గో.: ఇక్కడ ఇప్పటివరకు హ్యట్రిక్ నమోదు కాలేదు

image

ప.గో. జిల్లాలోని పాలకొల్లులో 1955 నుంచి 2019 వరకు మొత్తం 14 సార్లు ఎన్నికలు జరిగాయి. కాగా ఇప్పటివరకు ఏ ఒక్క నాయకుడూ హ్యాట్రిక్ విజయం నమోదుచేయలేదు. అయితే 2014, 2019లో అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీచేసిన నిమ్మల రామానాయుడు వరుస విజయాలు సాధించారు. తాజాగా మరోసారి ఆయన అదే పార్టీ నుంచి బరిలో ఉన్నారు. ఈ సారి గెలిస్తే పాలకొల్లు చరిత్రలో హ్యాట్రిక్ రికార్డు ఆయన సొంతమవుతుంది. మరి విజయం సాధించేనా..?

News March 22, 2024

ప.గో.: 24 ఓట్ల మెజారిటీతో MLAగా గెలుపు

image

పోలవరంలో 1999 అసెంబ్లీ ఎన్నికలు ఓ రికార్డు సొంతం చేసుకున్నాయి. అప్పుడు TDPనుంచి పోటీ చేసిన వంకా శ్రీనివాస రావు కాంగ్రెస్‘ఐ’ అభ్యర్థి బి.దుర్గారావుపై కేవలం 24 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. పోలవరం చరిత్రలో ఇదే అత్యల్ప మెజారిటీ. 2019లో YCP నుంచి బరిలో నిలిచిన తెల్లం బాలరాజు ఎన్నడూ లేనంతంగా 42070 అత్యధిక మెజారిటీ సాధించగా ప్రస్తుతం ఆయన సతీమణి బరిలో ఉన్నారు. TDP- జనసేన- BJP కూటమి అభ్యర్థి తేలాల్సి ఉంది.

News March 22, 2024

పాలకొల్లులో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడి హౌస్‌అరెస్ట్

image

అంబేడ్కర్‌పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని అరెస్టు చేయాలంటూ పెనుగొండ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేసిన 20 మంది దళిత యువకులను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు నల్లి రాజేష్ పోలీస్ స్టేషన్‌కు బయలుదేరే క్రమంలో శుక్రవారం పాలకొల్లులోని ఆయన ఇంటికి యలమంచిలి సబ్ ఇన్‌స్పెక్టర్ ప్రసాద్ వెళ్లి హౌస్ అరెస్టు చేశారు.

News March 22, 2024

ఉమ్మడి ప.గో నేతల్లో టెన్షన్.. ఆ ‘ఒక్కరు’ ఎవరు..?

image

TDP అభ్యర్థుల మూడో లిస్ట్ విడుదలైంది. ఈ జాబితాలోనూ పోలవరం టికెట్‌పై సందిగ్ధత వీడలేదు. ఉమ్మడి ప.గో జిల్లాలోని 15 అసెంబ్లీ స్థానాలకు వైసీపీ ఇప్పటికే అన్ని చోట్ల అభ్యర్థులను ప్రకటించింది. కూటమి తరపున సైతం పోలవరం మినహా.. 14 చోట్ల అభ్యర్థులు ఖరారు కాగా, పోలవరం నుంచి మాత్రం ఏ పార్టీ బరిలో ఉంటుంది..? ఎవరు పోటీ చేస్తారు..? అనే ఉత్కంఠ వీడటం లేదు. దీంతో అటు క్యాడర్‌లో టెన్షన్.. ఇటు ప్రజల్లో ఆసక్తి నెలకొంది.