WestGodavari

News March 17, 2024

పశ్చిమగోదావరిలో 14.61 లక్షల ఓటర్లు

image

పశ్చిమగోదావరి జిల్లాలో నరసాపురం పార్లమెంట్‌ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 14,61,338 మంది ఓట్లు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. మహిళలు అత్యధికంగా 7,44,308, పురుషులు 7,16,956 మంది, థర్డ్‌ జెండర్స్‌ 74 మంది ఉన్నారు. మొత్తంగా 1,463 పోలింగ్‌ కేంద్రాలు సిద్ధం చేశారు. ఎన్నికల నిర్వహణకు అధికారులు పక్కా ఏర్పాట్లు చేస్తున్నారు.

News March 17, 2024

ప.గో. జిల్లాలో YCP నుంచి ఐదుగురు కొత్తగా

image

ఉమ్మడి జిల్లాలో ఈసారి ఐదుగురు కొత్తవారికి వైసీపీ అవకాశం కల్పించింది. ఏలూరు ఎంపీ అభ్యర్థి సునీల్‌కుమార్‌ యాదవ్‌, నరసాపురం ఎంపీ అభ్యర్థి ఉమాబాల, చింతలపూడి అసెంబ్లీ అభ్యర్థి విజయరాజు (రిటైర్డ్‌ రవాణా శాఖ అధికారి), పోలవరం అసెంబ్లీ అభ్యర్థి రాజ్యలక్ష్మి (ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేసి స్వచ్ఛంద పదవీ విరమణ), పాలకొల్లు అసెంబ్లీ అభ్యర్థి గుడాల గోపికి పార్టీ అవకాశం ఇచ్చింది.

News March 17, 2024

ప.గో.: 9వ తరగతి చదివి వైసీపీ MLA అభ్యర్థిగా

image

ప.గో. జిల్లాలో వైసీపీ అభ్యర్థుల చదువులు ఇలా..
చెరుకువాడ శ్రీరంగనాథరాజు- 9వ తరగతి
కొట్టు సత్యనారాయణ – ఇంటర్
గుడాల శ్రీహరిగోపాల రావు – బీకాం
పెన్మెత్స వెంకట లక్ష్మీ నర్సింహరాజు – బీఏ
గ్రంథి శ్రీనివాస్ – ఇంటర్
ముదునూరి నాగరాజ వరప్రసాదరాజు – ఇంటర్
ఆళ్ల నాని – బీకాం
తానేటి వనిత – MSC (PHD)
అబ్బయ్య చౌదరి – బీటెక్
కంభం విజయరాజు – BA, ఎల్ఏఈ
తెల్లం రాజ్యలక్ష్మి- BA, బీఈడీ
పుప్పాల శ్రీనివాసరావు – డిగ్రీ

News March 17, 2024

ప.గో.: నేతలకు పరీక్ష.. పాస్ అయ్యేదెవరు..?

image

ఎన్నికల్లో బరిలో నిలిచే నాయకుల జీవితాన్ని జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థితో పోలిస్తే..ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికలు (జాబ్ నోటిఫికేషన్). నిన్నటి నుంచి 57రోజుల పాటు ప్రిపరేషన్‌ (ప్రచారానికి) సమయం. మే 13న పరీక్ష(ఓటింగ్). ఆ తర్వాత 22 రోజులకు జూన్ 4న ఫలితాలు. ఉమ్మడి ప.గో. జిల్లాలో 15 స్థానాలకు(పోస్టులకు) ఎంతమంది పరీక్ష రాస్తారన్నది తేలాలి. ఏప్రిల్ 25 వరకు పరీక్షకు అప్లై (నామినేషన్) చేసుకోనున్నారు.

News March 17, 2024

ప.గో. జిల్లాలో YCP నుంచి ఐదుగురు కొత్తగా

image

ఉమ్మడి జిల్లాలో ఈసారి ఐదుగురు కొత్తవారికి వైసీపీ అవకాశం కల్పించింది. ఏలూరు ఎంపీ అభ్యర్థి సునీల్‌కుమార్‌ యాదవ్‌, నరసాపురం ఎంపీ అభ్యర్థి ఉమాబాల, చింతలపూడి అసెంబ్లీ అభ్యర్థి విజయరాజు (రిటైర్డ్‌ రవాణా శాఖ అధికారి), పోలవరం అసెంబ్లీ అభ్యర్థి రాజ్యలక్ష్మి (ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేసి స్వచ్ఛంద పదవీ విరమణ), పాలకొల్లు అసెంబ్లీ అభ్యర్థి గుడాల గోపికి పార్టీ అవకాశం ఇచ్చింది.

News March 17, 2024

నేడు పోలీస్ యాక్ట్ 30 అమలు: ఏలూరు ఎస్పీ

image

ఏలూరు జిల్లాలో ఆదివారం ఉ.10 నుంచి 12 గంటల వరకు.. తిరిగి మధ్యాహ్నం 2 నుంచి సా.4 గంటల వరకు గ్రూప్-1 పరీక్షలు పకడ్బందీగా జరిగేలా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ మేరీ ప్రశాంతి తెలిపారు. జిల్లాలో పోలీస్ యాక్ట్ 30 అమలులో ఉంటుందని తెలిపారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 5 పరీక్ష కేంద్రాల పరిధిలో ఏవైనా సమస్యలు ఎదురైతే 100 నెంబర్‌కు కాల్ చేయాలన్నారు. 94409 04808 కు వాట్సాప్‌లో సమాచారం ఇవ్వొచ్చని తెలిపారు.

News March 16, 2024

ప.గో జిల్లా పలు ప్రాంతాల్లో పోలీసుల కవాతు

image

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నందున ప్రజలలో భరోసా కల్పించేందుకు, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా కేంద్ర సాయుధ బలగాలతో కలిసి ప.గో జిల్లాలోని పలు ప్రాంతాలలో పోలీసులు శనివారం కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ అజిత మాట్లాడుతూ.. ప్రజలు ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని అన్నారు. జిల్లా పోలీసులు పాల్గొన్నారు.

News March 16, 2024

ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులుగా తండ్రి, కొడుకు

image

మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు నరసాపురం పార్లమెంటు నియోజకవర్గంలోని తణుకు అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఆయన తనయుడు కారుమూరి సునీల్ కుమార్ ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీలో ఉన్నారు. తండ్రి కొడుకులు ఒకే పార్టీలో ఎమ్మెల్యేగా కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఎంపీ అభ్యర్థిగా కారుమూరి సునీల్ కుమార్ పోటీలో ఉండడం ఆసక్తికరంగా మారింది.

News March 16, 2024

ప.గో: సామాజిక వర్గాల వారీగా వైసీపీ అభ్యర్థులు

image

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 15 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో సామాజిక వర్గాల వారీగా చూసుకుంటే.. ఓసీ సామాజిక వర్గం నుంచి 9 మంది, ఎస్సీ సామాజిక వర్గం నుంచి ముగ్గురు, బీసీ సామాజిక వర్గం నుంచి ఇద్దరు, ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఒకరు ఎన్నికలో బరిలో నిలుస్తున్నారు.

News March 16, 2024

ఏలూరు: ‘చరిత్ర హీనుడిగా ముద్రగడ పద్మనాభం’

image

కాపునేత ముద్రగడ పద్మనాభంపై ఏపీ కాపు సంక్షేమ సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు పులి శ్రీరాములు నిప్పులు చెరిగారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాపు కులద్రోహిగా.. చరిత్ర హీనుడిగా ముద్రగడ పద్మనాభం మిగిలిపోతారని దుయ్యబట్టారు. ఏ షరతు లేకుండా వైసీపీ కండువా కప్పుకోవడం ఏంటని ప్రశ్నించారు. కాపుల ఎదుగుదల కోరుకునే వారు పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో నడవాలని హితవు పలికారు.