India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేయడంతో మనస్తాపానికి గురై ఓ బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. ఆకివీడు మండలం ఉప్పరగూడెంకు చెందిన కిరణ్ కుమార్ ప్రేమపేరుతో వేధిస్తున్నాడని.. దీంతో ఆత్మహత్య చేసుకుందని బాలిక తల్లి ఆరోపించారు. ఘటనపై పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు.
ఓ బాలికను వరుసకు అన్న అయ్యే యువకుడు వేధిస్తున్న ఘటన కొవ్వూరు పట్టణంలో జరిగింది. ప్రతిరోజూ కళాశాలకు వెళ్లి వస్తున్న సమయంలో వెంట పడి, అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని మంగళవారం రాత్రి బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో యువకుడిపై పోక్సో కేసు నమోదు
చేసినట్టు హెడ్ కానిస్టేబుల్ సాంబశివమూర్తి తెలిపారు.
విజయవాడలో రాష్ట్ర మైనింగ్, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రను ఏలూరు MP పుట్టా మహేశ్ కుమార్ పుష్పగుచ్ఛం అందజేసి మంగళవారం వారి స్వగృహం నందు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు విషయాలను గురించి చర్చించారు.
ప.గో. జిల్లా తాడేపల్లిగూడెం మండలం నవాబుపాలెం శివారులో మృతిచెందిన జానపాముల సత్యవతి (48) కేసులో నిందితుడు చిక్కాల శ్రీనును తాడేపల్లిగూడెం పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు సొమ్ములు కోసం హత్యచేసినట్లు నేరం అంగీకరించడంతో తణుకు కోర్టులో హాజరుపరచగా మేజిస్ట్రేట్ 14 రోజులు రిమాండ్ విధించినట్లు పట్టణ సీఐ సుబ్రహ్మణ్యం మంగళవారం తెలిపారు. మృతురాలికి చెందిన బంగారు ఆభరణాలు రికవరి చేసినట్లు వివరించారు.
విజయవాడలో రాష్ట్ర మైనింగ్, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రను ఏలూరు MP పుట్టా మహేశ్ కుమార్ పుష్పగుచ్ఛం అందజేసి మంగళవారం వారి స్వగృహం నందు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు విషయాలను గురించి చర్చించారు.
ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలానికి చెందిన ఓ బాలుడు 2021లో ఇంటినుంచి వెళ్లిపోయాడు. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని హౌరా రైల్వేస్టేషన్లో తిరుగుతుండగా అక్కడి పోలీసులు చైల్డ్ కేర్ సంస్థలో చేర్చారు. ఈ క్రమంలో బాలుడిది ఏలూరు జిల్లాగా గుర్తించి ఇక్కడి అధికారులను సంప్రదించారు. కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశాలతో ఐసీడీఎస్ అధికారులు రంగంలోకి దిగారు. బాలుడి తల్లిని బుట్టాయగూడెంలో గుర్తించి అప్పగించారు.
నిడదవోలులో నియోజకవర్గంలోని డిజిటల్ అసిస్టెంట్లు మంత్రిని కలిసి తమ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమ టెక్నికల్ అర్హతలను పరిగణనలోకి తీసుకొని జూనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించాలని విన్నవించారు. మంత్రి స్పందిస్తూ.. డిజిటల్ అసిస్టెంట్లకు పదోన్నతి అంశాన్ని మంత్రి నారా లోకేశ్ దృష్టికి తీసుకువెళ్లి తగిన న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారు.
ఏలూరు MP పుట్టా మహేశ్ కుమార్ యాదవ్కు కూటమి నేతలు గన్నవరం ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం పలికారు. పార్లమెంట్ సమావేశాల అనంతరం తొలిసారి జిల్లాకు వచ్చిన సందర్భంగా స్వాగతం పలికేందుకు జిల్లా నలుమూలల నుంచి నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు. ఎంపీ మహేశ్ అక్కడి నుంచి హనుమాన్ జంక్షన్ 4 రోడ్ల కూడలిలోని ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లి పూజలు చేస్తారు. తర్వాత పార్టీ ఏలూరు జిల్లా కార్యాలయంలో సమావేశంలో పాల్గొంటారు.
ఇంట్లోంచి తల్లి వెళ్లిపోవాలంటూ కుమార్తె వేధింపులకు గురి చేస్తున్నట్లు ప.గో జిల్లా వీరవాసరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. SI రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. వీరవాసరానికి చెందిన వనువులమ్మకు ఇద్దరు కూతుర్లు. పెద్ద కుమార్తె కొద్దిరోజులుగా తల్లి ఇంట్లోనే ఉంటూ ఆమెనే ఇంటి నుంచి వెళ్లిపోవాలని వేధిస్తోందని చిన్న కుమార్తె ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
గోపాలపురం మండలంలో విషాదం నెలకొంది. చిట్యాలకు చెందిన యువకుడు అమెరికాలో వాటర్ ఫాల్స్లో పడి మృతి చెందాడు. శ్రీనివాస్-శిరీష దంపతుల కుమార్తె అమెరికాలో ఉంటుండగా.. కుమారుడు అవినాశ్ MS చేసేందుకు అక్కడికి వెళ్లాడు. అక్క వాళ్ల ఇంట్లోనే ఉంటున్నాడు. వాటర్ ఫాల్స్ చూసేందుకు వెళ్లిన అవినాశ్.. నీట మునిగి మృతి చెందాడు. మృతదేహాన్ని స్వదేశానికి తీసుకువచ్చేందుకు తానా ప్రతినిధులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.