WestGodavari

News July 25, 2024

ప.గో జిల్లాలో 38 వేల ఎకరాల్లో పంట నష్టం

image

పశ్చిమగోదావరి జిల్లాలోని 20 మండలాల పరిధిలోని 38 వేల ఎకరాల్లో పంట నీట మునిగినట్టు వ్యవసాయాధికారులు గుర్తించారు. రూ.41.51 కోట్ల మేర పంట నష్టం వాటిల్లినట్టు అంచనా. 614 మంది రైతులు సాగు చేస్తున్న 500 ఎకరాల్లోని ఉద్యానవన పంటలకు రూ.4.06 కోట్లు నష్టం వాటిల్లినట్టు అంచనా వేస్తున్నారు. పొలాల్లోని ముంపునీరు తగ్గి క్షేత్ర స్థాయిలో పరిశీలన ప్రారంభమైతే పంట నష్టం మరింత పెరుగుతుందని రైతులు అంటున్నారు.

News July 25, 2024

ప.గో.: హార్టీసెట్ అభ్యర్థులకు శుభవార్త

image

ఉద్యాన విశ్వవిద్యాలయం రెండేళ్ల హార్టీకల్చర్ డిప్లమా కోర్సుల ప్రవేశానికి ఈ నెల 26న హార్టీసెట్- 2024 పరీక్ష జరగనుంది. ఈ పరీక్షకు సంబంధించి హాల్ టికెట్లు రాని వారు పరీక్షా కేంద్రం వద్ద ఐడీ ప్రూఫ్‌తో డూప్లికేట్ హాల్ టికెట్లు పొందవచ్చని విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ శ్రీనివాసులు తెలిపారు. విద్యార్థులు ఈ విషయాన్ని గుర్తించాలని కోరారు.

News July 24, 2024

మంత్రి నిమ్మల దృష్టికి తాడేపల్లిగూడెం రైతుల సమస్య

image

రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును తాడేపల్లిగూడెం నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి వలవల బాబ్జీ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో ఎర్రకాలువ ముంపు రైతాంగం దుస్థితిని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు మంత్రి సానుకూలంగా స్పందించారని బాబ్జీ తెలిపారు. రైతులు అధైర్య పడవద్దని సూచించారన్నారు. రవికుమార్, సత్యనారాయణ, శ్రీనివాస్ ఆయన వెంట ఉన్నారు.

News July 24, 2024

ఏలూరు: నకిలీ ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు అరెస్ట్

image

ఏలూరు మండలం కొత్తూరులో ఫుడ్ ఇన్‌స్పెక్టర్లుగా చలామణీ అవుతూ డబ్బులు వసూలు చేస్తున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. DSP శ్రీనివాసులు తెలిపిన వివరాలు.. కర్రీ పాయింట్ నిర్వహిస్తున్న అప్పలనాయుడు వద్ద ఈ నెల 22న నలుగురు వ్యక్తులు రూ.10వేలు డిమాండ్ చేసి తీసుకున్నారు. తాజాగా విషయం వెలుగులోకి రాగా ముంగర వెంకట దుర్గ, బుక్కిరి దేవిప్రసాద్, అగ్గాల ఉమామహేశ్వరి, పులిగ రాంబాబులను రిమాండ్‌కు తరలించారు.

News July 24, 2024

జగన్ దొంగ దీక్షలు చేస్తున్నాడు: MLA చింతమనేని

image

రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక ఢిల్లీలో జగన్ దొంగ దీక్షలు చేస్తున్నారని దెందులూరు MLA చింతమనేని ప్రభాకర్ రావు విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ చేసిన అవినీతి, అరాచక పాలనను ప్రజలు తిరస్కరించడంతో జగన్ ఓర్వలేక శవ రాజకీయాలు చేస్తున్నాడన్నారు. రాష్ట్ర అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో కృషి చేస్తుందని చెప్పారు.

News July 24, 2024

అసెంబ్లీలో సీఎం నోట జంగారెడ్డిగూడెం

image

అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ శాఖపై శ్వేతపత్రం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మద్యం విషయంలో గత ప్రభుత్వం హయాంలో చాలా అవకతవకలు జరిగాయని సీఎం అన్నారు. జంగారెడ్డిగూడెంలోనూ గతంలో నాటుసారా తాగి 21 మంది చనిపోయారని గుర్తుచేశారు. పార్టీపరంగా బాధిత కుటుంబాలకు నగదు అందించామని చెప్పారు.

News July 24, 2024

ప.గో.: ఫిషింగ్ హార్బర్ నిర్మాణంపై ఆశలు

image

ఉమ్మడి ప.గో. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను దశలవారీగా పూర్తి చేస్తామని కేంద్రం హామీ ఇవ్వడంపై ప్రజలు వర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా జిల్లాలో పోలవరం ప్రాజెక్ట్ పెండింగ్‌లో ఉండగా.. నరసాపురం బియ్యపుతిప్ప ఫిషింగ్ హార్బర్ పనులు సైతం జరగాల్సి ఉంది. ఈ ఫిషింగ్ హార్బర్ పూర్తయితే నిరుద్యోగులకు ఉపాధి దొరకనుంది. కొత్త కేంద్ర బడ్జెట్‌తోనైనా హార్బర్ పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.

News July 24, 2024

ప.గో: ముద్రా రుణాల పెంపు.. కలలు సాకారమయ్యేనా?

image

ఉమ్మడి ప.గో జిల్లాలో 425 పరిశ్రమలు ఉన్నాయి. వాటిలో దాదాపు 100 పరిశ్రమల వరకు మూతపడ్డాయి. ఇలాంటి క్రమంలో కేంద్రం చిన్న పరిశ్రమలను ఆదుకునేలా బడ్జెట్ ప్రవేశపెట్టడం పట్ల జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ముద్రా రుణాల పరిమితి రూ.10 లక్షలు ఉండగా ఈ బడ్జెట్‌లో రూ.20 లక్షలకు పెంచారు. ఈ ముద్రా లోన్ ద్వారా యువత కలలు సాకారం కానున్నాయి. అర్హులు రుణం పొందేలా బ్యాంకుల్లో ఆంక్షలను సడలించారు.

News July 24, 2024

కేంద్ర బడ్జెట్.. పాలకొల్లు మెడికల్ కాలేజీ పనుల్లో కదలిక!

image

కేంద్ర బడ్జెట్‌తో పాలకొల్లులో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ నిర్మాణంపై ఆశలు చిగురిస్తున్నాయి. ఇప్పటికే ఈ కాలేజీ నిర్మాణం పనులు చేపట్టాలని మంత్రి నిమ్మల రామానాయుడికి వినతులు అందాయి. ఈ నిర్మాణం పూర్తయితే యువతకు, జిల్లా ప్రజలకు అన్ని విధాలా మేలు జరుగుతుందని నాయకులు ఎప్పటినుంచో చెబుతున్నారు. తాజా బడ్జెట్‌లో కేంద్రం విద్యా రంగానికి ఊతం ఇవ్వడంతో పునాదుల దశలో ఉన్న పనుల్లో కదలిక రానున్నట్లు తెలుస్తోంది.

News July 24, 2024

పోలవరానికి నిధులు.. చిగురించిన ఆశలు

image

పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన నిధులు మంజూరు చేస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటన ఉభయ గోదావరి జిల్లా వాసులకు ఊరట కలిగించింది. పోలవరం ఎడమ ప్రధాన కాలువ నిర్మాణం కాకినాడ, తూ.గో, కోనసీమ, అనకాపల్లి, విశాఖ జిల్లాల వరకు పూర్తి చేయాల్సి ఉంది. దీనివల్ల సాగు, తాగునీరు, పారిశ్రామిక అవసరాలు తీరుతాయి. ఎడమ కాలువను రూ 4,202.69 కోట్లతో నిర్మించవలసి ఉంది. ఇంతవరకు 72.99 శాతం పనులయ్యాయి.