India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పాలకొల్లు నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను సోమవారం లబ్ధిదారులకు అందజేశారు. ఈ క్రమంలో వృద్ధుల కాళ్లు కడిగి పింఛన్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లు పంపిణీ చేశామని స్పష్టం చేశారు. ఇక ప్రతి నెల పెరిగిన పింఛన్ లబ్ధిదారుల ఇంటికి చేరుతుందన్నారు.
వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే పోలవరం ప్రాజెక్టు దెబ్బతిందని ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ ఆరోపించారు. 2014కు ముందు ప్రాజెక్టు పనులు కేవలం 5 శాతం మాత్రమే జరగ్గా.. 2014- 2019 మధ్య టీడీపీ హయాంలో 68 శాతం పనులు జరిగాయన్నారు. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం కేవలం 3.8 శాతం పనులను మాత్రమే చేయగలిగిందన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రాజెక్టును సందర్శించి.. పనులను గాడిలో పెడుతుందని చెప్పారు.
ప్రేమించిన అమ్మాయితో పెళ్లి కాలేదని ఓ వ్యక్తి సూసైడ్ చేసుకున్న ఘటన ప.గో. జిల్లాలో జరిగింది. భీమవరం రూరల్ స్టేషన్ రైటర్ మహేశ్ తెలిపిన వివరాలు.. భీమవరం మండలం యమునేపల్లికి చెందిన బుంగా చందు(23) ఓ యువతిని ప్రేమించాడు. ఆమెకు ఇటీవల వేరే వ్యక్తితో పెళ్లి కుదరడంతో మనస్తాపంతో చందు శనివారం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. పాతపాడు వద్ద ఉప్పుటేరులో ఆదివారం మృతదేహం లభ్యమైంది. సూసైడ్ చేసుకొని ఉంటాడని భావిస్తున్నారు.
కొవ్వూరు మండలం ఆరికరేవుల ఏటిగట్టుపై ఆదివారం జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మోటార్ సైకిల్ను లారీ ఢీకొన్న ఘటనలో మోటార్ సైకిల్పై ప్రయాణిస్తున్న తాత, మనవడు మృతిచెందారు. మృతులు మాసా వీర్రాజు (55), పాముల ధనుష్ (12)గా చెబుతున్నారు. పట్టణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ ప్రజలకు అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో కొత్త నిర్ణయం తీసుకున్నారు. ప్రతి సోమ, మంగళవారాల్లో చింతలపూడిలో బుధవారం జంగారెడ్డిగూడెంలో, గురువారం కామవరపుకోటలో ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. శుక్రవారం అధికారులతో నియోజకవర్గంపై సమీక్ష చేస్తానని చెప్పారు. ఇక శనివారం 4 మండలాల్లోని ప్రభుత్వకార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తానని చెప్పారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి అదనపు కార్యదర్శిగా ఐఏఎస్ అధికారి కార్తికేయ మిశ్రాను నియమిస్తూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. కాగా కార్తికేయ మిశ్రా గతంలో ఏలూరు జిల్లా కలెక్టర్గా పనిచేశారు. ప్రస్తుతం ఆయన కేంద్ర ఆర్థిక శాఖలో డైరెక్టర్గా పని చేస్తున్నారు.
గత ప్రభుత్వంలో రైతులకు బకాయిపడిన ధాన్యం విక్రయాల డబ్బులను త్వరలో చెల్లిస్తామని మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. ఆదివారం ఆయన నిడదవోలులో మీడియాతో మాట్లాడుతూ..గతంలో రబీ సీజన్కు సంబంధించిన ధాన్యం విక్రయాల నగదును చెల్లించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. తమ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పాటుపడుతుందని అన్నారు. జూలై 1న లబ్ధిదారులకు ఇంటివద్దే పింఛన్ల పంపిణీకి ఏర్పాట్లుచేశామన్నారు.
ఉండి అభివృద్ధి కోసం ఎమ్మెల్యే RRR ఏర్పాటుచేసిన ‘డ్రైనేజ్ మెయింటెనెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఉండి’ నిధికి ప్రముఖ సినీ నిర్మాత అశ్వినీ దత్ రూ.5 లక్షల నగదును ఆదివారం విరాళం అందించారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆయన్ను ఎమ్మెల్యే సత్కరించారు.
కొవ్వూరులో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. జంగారెడ్డిగూడెం నుంచి రాజమండ్రి వెళ్తున్న కారు.. కొవ్వూరు ABN డిగ్రీ కాలేజ్ వద్ద డివైడర్ను ఢీ కొట్టింది. కారు నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న కొవ్వూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వివరాలు తెలియాల్సి ఉంది.
పోలవరం ప్రాజెక్ట్ వద్దకు కొద్దిసేపటి కింద అంతర్జాతీయ నిపుణుల బృందం చేరుకుంది. డయాఫ్రం వాల్, స్పిల్ వే వంటి ప్రధాన నిర్మాణాలతో పాటు ఎగువ, దిగువ డ్యాములను నిపుణులు పరిశీలించారు. 4 రోజులు పాటు ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతంలో పర్యటించి పూర్తిగా అధ్యయనం చేస్తారు. ఒక్కో రోజు ఒక్కో విభాగాన్ని పరిశీలించి నివేదిక అందజేయనున్నారు. ఈ నివేదికను బట్టే పనులపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
Sorry, no posts matched your criteria.