India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, ప్రాణహాని ఉందని దేవరపల్లి మండలం గౌరీపట్నంలోని నిర్మలగిరి డైరెక్టర్ జాన్ పీటర్ భయాందోళన వ్యక్తం చేశారు. కొందరు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, ఇటీవల శ్రీకాంత్ అనే వ్యక్తి ఫోన్ చేసి రూ.10లక్షలు ఇవ్వాలని బెదిరించినట్లు తెలిపారు. డబ్బులు ఇవ్వకుంటే హానికర చర్యలకు పాల్పడతానని, పుణ్యక్షేత్రంపై అసత్య వీడియోలు బయటపెడతానని బెదిరిస్తున్నారని పీటర్ వెల్లడించారు.
CMగా చంద్రబాబు ‘మెగా డీఎస్సీ’పై సంతకం చేయడంతో అభ్యర్థులు మళ్లీ పుస్తకాలు పడుతున్నారు. ఎలాగైనా కొలువుకొట్టాలని కోచింగ్ల కోసం పట్టణాల బాట పడుతున్నారు. మొత్తం 16వేలకు పైగా పోస్టులు భర్తీ చేయనుండగా..
➤ ప.గో జిల్లాలో 400లకు పైగా పోస్టుల భర్తీకి ఛాన్స్ ఉంది. ఇక్కడ దాదాపు 13వేల మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు.
➤ ఏలూరు జిల్లాలో సుమారు 800 పోస్టుల భర్తీకి అవకాశం ఉండగా.. 10,500మంది వేచి చూస్తున్నారు.
బాలికకు పెళ్లి చేసిన తల్లిదండ్రులను ఏలూరు రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. నగర శివారుకు చెందిన బాలుడు, బాలిక ప్రేమించుకున్నారు. బాలిక గర్భం దాల్చడంతో ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం తెలిసి పేరెంట్స్ గతేడాది Aug 26న వారికి పెళ్లి చేసేందుకు నిర్ణయించగా అధికారులు వెళ్లి అడ్డుకున్నారు. ఆ తర్వాత మూడ్రోజులకే వారికి పెళ్లి చేయగా.. SP ఆదేశాల మేరకు బాలిక పేరెంట్స్ను శుక్రవారం అరెస్ట్ చేశారు.
ప.గో జిల్లా అత్తిలి మండలం స్కిన్నెరపురానికి చెందిన ఏసురాజు అదే మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(6)ను అత్యాచారం చేశాడనే ఫిర్యాదు మేరకు అతడిని అరెస్టు చేశామని SI రాంబాబు తెలిపారు. బాలిక ఆడుకుంటున్న సమయంలో ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్టు తెలిపారు. ఆమెకు కడుపులో నొప్పి రావడంతో తల్లి అసలు విషయం తెలుసుకుని ఈనెల 9న ఫిర్యాదు చేసింది. దీంతో ఏసురాజును అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించామని అన్నారు.
ఏలూరు ఈ నెల 17వ తేదీన బక్రీద్ పండుగ నేపథ్యంలో ముస్లిం సోదరులకు ఎస్పీ మేరీ ప్రశాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రధాన మసీదులు, ఈద్గాల వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటుచేయనున్నట్లు వెల్లడించారు. మతపెద్దలతో సమావేశమై మత సామరస్యాన్ని కాపాడుతూ శాంతి భద్రతల పరిరక్షణకు సహకరించాలన్నారు. పోలీసు అధికారులు ముస్లిం పెద్దలతో సమావేశాలు ఏర్పాటుచేసి అవగాహన కల్పించాలన్నారు.
పోలవరం ప్రాజెక్టు పూర్తవ్వాలన్నది ఉమ్మడి ప.గో. జిల్లా ప్రజల కళ. ఏలూరు జిల్లా పరిధిలోని పోలవరం సమీపంలో 2004లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు 2015లో జాతీయ ప్రాజెక్టుగా గుర్తింపుపొందింది. అయితే తాజాగా మన జిల్లా మంత్రి నిమ్మల రామానాయుడిని జలవనరుల శాఖ వరించింది. దీంతో జిల్లా ప్రజల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. ప్రాజెక్టు పనులు పరుగులు పెడతాయని, నిర్వాసితులకు న్యాయం జరుగుతుందని చర్చ జరుగుతోంది.
– మీ కామెంట్..?
ఉమ్మడి ప.గో. జిల్లాలోని 15 మంది MLAలలో గత వైసీపీ ప్రభుత్వంలో ముగ్గురు MLAలు మంత్రులుగా వ్యవహరించారు. 2019లో తాడేపల్లిగూడెం నుంచి గెలుపొందిన కొట్టు సత్యనారాయణ దేవాదాయశాఖ, కొవ్వూరు నుంచి MLAగా గెలిచిన తానేటి వనితకు హోంశాఖ, తణుకు MLA కారుమూరి వెంకట నాగేశ్వరరావు పౌరసరఫరాలు, వినియోగదారుల శాఖ మంత్రిగా పనిచేశారు. తాజాగా నిమ్మలకు జలవనరులు, దుర్గేశ్ పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖలు కేటాయించారు.
ఉమ్మడి ప.గో. జిల్లాలోని 15 MLAలలో ఇద్దరికి మంత్రి పదవులు వరించిన విషయం తెలిసిందే. కాగా పాలకొల్లు MLA నిమ్మల రామానాయుడికి జలవనరుల అభివృద్ధి శాఖలు, నిడదవోలు MLA కందుల దుర్గేశ్కు పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖలు కేటాయించారు.
ఎన్నికల హామీలో భాగంగా ఏప్రిల్ నుంచి పెన్షన్ రూ.4 వేలు, దివ్యాంగులకు రూ.6 వేలు ఇస్తామని కూటమి ప్రకటించింది. కాగా ఏలూరు జిల్లాలో 2.68 లక్షల పెన్షన్దారులు, పశ్చిమగోదావరిలో 2.34 లక్షల మందికి లబ్ధిచేకూరనుంది. మొత్తం 2 జిల్లాల్లో 5.02 లక్షల మంది లబ్ధిదారులు ప్రయోజనం పొందనున్నారు. ప్రస్తుతం పెన్షన్ దారులు రూ.3వేలు అందుకుంటున్నారు.
కొత్త ప్రభుత్వం ఏర్పడింది. సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం పూర్తయ్యింది. దీంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో పట్టుకోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. అత్యంత ముఖ్యమైన జిల్లా పరిషత్, ఎంపీపీ, మున్సిపల్ ఛైర్మన్ పదవులను తమ సొంతం చేసుకోవాలని నాయకులు తహతహలాడుతున్నారు. అందుకోసం ఎవరి అస్త్రాలను వారు ప్రయోగిస్తున్నట్లు తెలుస్తోంది.
Sorry, no posts matched your criteria.