India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కొత్త ప్రభుత్వం ఏర్పడింది. సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం పూర్తయ్యింది. దీంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో పట్టుకోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. అత్యంత ముఖ్యమైన జిల్లా పరిషత్, ఎంపీపీ, మున్సిపల్ ఛైర్మన్ పదవులను తమ సొంతం చేసుకోవాలని నాయకులు తహతహలాడుతున్నారు. అందుకోసం ఎవరి అస్త్రాలను వారు ప్రయోగిస్తున్నట్లు తెలుస్తోంది.
70ఏళ్ల చరిత్ర గల పాలకొల్లు నియోజకవర్గంలో డా.నిమ్మల రామానాయుడు కొత్త రికార్డ్ నెలకొల్పారు. ఇక్కడ 1955 నుంచి ఇప్పటివరకు 15సార్లు ఎన్నికలు జరగ్గా.. ఓటర్లు నిమ్మలకు మాత్రమే ‘హ్యాట్రిక్’ ఇచ్చారు. 1983, 85తో పాటు 1994, 99 ఎన్నికల్లో వరుసగా అల్లు వెంకటసత్యనారాయణ గెలిచినా.. హ్యాట్రిక్ సాధ్యం కాలేదు. 3వసారి ఓటమి చవిచూడాల్సి వచ్చింది. 2014, 19లో గెలిచిన నిమ్మల ఈసారి హ్యాట్రిక్ కొట్టి మంత్రి పదవి చేపట్టారు.
తీర ప్రాంతంలో చేపల వేటపై నిషేధ ఉత్తర్వులు రద్దుకానున్నాయి. ఏప్రిల్ 15 నుంచి దాదాపు 60 రోజుల పాటు విధించిన నిషేధాజ్ఞలు శుక్రవారం అర్ధరాత్రితో ఎత్తివేయనున్నారు. దీంతో తీర ప్రాంతాల్లో తిరిగి బోట్ల సందడి మొదలుకానుంది. 2 నెలల పాటు వృత్తికి దూరంగా ఉన్న మత్స్యకారులు వలలు, ఇతర సామగ్రి సిద్ధం చేసుకుంటున్నారు. ఈ రంగంపై ప్రత్యేకంగా, పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్న సుమారు 2000 మందికి మళ్లీ ఉపాధి దక్కనుంది.
కువైట్ అగ్నిప్రమాదంలో పెరవలి వాసులు ఇద్దరు మృతి చెందినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. మండలంలోని ఖండవల్లికి చెందిన సత్యనారాయణ(38) 12ఏళ్ల కింద, అన్నవరప్పాడుకు చెందిన ఈశ్వరుడు(40) పదేళ్ల కింద జీవనోపాధి కోసం కువైట్ వెళ్లారు. ఓ సూపర్ మార్కెట్లో పనిచేస్తున్నారు. బుధవారం జరిగిన అగ్నిప్రమాదంలో వీరిద్దరూ మృతి చెందడంతో గ్రామాల్లో విషాదం నెలకొంది. పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబీకులు కన్నీరుపెడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబును ఏలూరు జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేశ్ గురువారం సెక్రటేరియట్లో మర్యాదపూర్వకంగా కలిశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం కలెక్టర్ ఆయనకు బొకే అందించి శుభాకాంక్షలు తెలిశారు.
మద్యం మత్తులో జరిగిన ఘర్షణలో వ్యక్తి హత్యకు గురయ్యాడు. తణుకు సీఐ నాగేశ్వరరావు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని దువ్వలో గురువారం మద్యం దుకాణం వద్ద పెరవలి మండలం ముక్కామలకు చెందిన భాస్కరరావు (40), దువ్వకు చెందిన రామకృష్ణ మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో రామకృష్ణ గాజు పెంకుతో భాస్కరరావును పొడిచినట్లు, దీంతో అతను చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
ఉమ్మడి ప.గో జిల్లాల్లో ఇద్దరికి మంత్రి పదవులు దక్కడంతో ప్రగతిపై ప్రజలకు ఆశలు చిగురిస్తున్నాయి. పాలకొల్లు నుంచి నిమ్మల రామానాయుడు, నూజివీడు నుంచి కొలుసు పార్థసారథి మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. ఉమ్మడి జిల్లాలో సాగునీటి, డెల్టా ఆధునికీకరణ, ఏటిగట్లు, వైద్య కళాశాల, ఫిషింగ్ హార్బర్, ఆక్వా వర్సిటీ, తాగునీటి సమస్యలకు పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు. ఇంకా ప్రధాన సమస్యలు ఏం ఉన్నాయో కామెంట్ చేయండి.
ప.గో జిల్లా తణుకుకు చెందిన వ్యక్తి రెండ్రోజులుగా కనిపించడంలేదని అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. ఆలమూరివారి వీధిలో నివాసం ఉంటున్న అరిపాక హరీశ్ ఈనెల 11న ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. అదే రోజు రాత్రి హరీశ్ భార్య జయశ్రీకి వీడియో కాల్ చేసి తాను చనిపోతున్నానని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. దీంతో ఆందోళన చెందిన జయశ్రీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
35ఏళ్ల తర్వాత ‘నూజివీడు’కు మంత్రి పదవి దక్కింది. దీంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. 1952-72 వరకు వరుసగా 5సార్లు MLAగా గెలిచిన డా.ఎంఆర్ అప్పారావు, తర్వాత 1978, 1989లో గెలుపొందిన పాలడుగు వెంకటరావు మాత్రమే మంత్రులుగా పని చేశారు. ఇన్నేళ్ల తర్వాత తాజాగా కొలుసు పార్థసారథికి మంత్రి పదవి దక్కింది. రాజకీయ నేపథ్యమున్న కుటుబం నుంచి వచ్చిన కొలుసు.. 2009లో YSR, కిరణ్ కుమార్రెడ్డి మంత్రివర్గంలో పనిచేశారు.
పాలకొల్లు నియోజకవర్గానికి 30 ఏళ్ల తర్వాత మరోసారి మంత్రి పదవి దక్కింది. 1989లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో హరిరామజోగయ్య మర్రి చెన్నారెడ్డి జట్టులో పౌరసంబంధాలు, అటవీశాఖ మంత్రిగా చేశారు. తర్వాత కోట్ల విజయభాస్కరరెడ్డి హయాంలో చిన్నతరహా పరిశ్రమలు, భూగర్భగనుల శాఖ దక్కింది. ఆ తర్వాత ఆరుగురు ఎమ్మెల్యేలు ఎన్నికైనా మంత్రి పదవి దక్కలేదు. తాజాగా హాట్రిక్ వీరుడు రామానాయుడు మంత్రిగా ప్రమాణం చేయడం విశేషం.
Sorry, no posts matched your criteria.