WestGodavari

News June 13, 2024

భీమవరం: ఫ్లాట్ ఫామ్, ట్రైన్ మధ్యలో ఇరుక్కుపోయాడు

image

టౌన్ రైల్వే స్టేషన్‌లో బుధవారం మధ్యాహ్నం నర్సాపూర్ నుంచి గుంటూరు వెళ్లే పాసింజర్ ఎక్కే క్రమంలో ఒక వ్యక్తి జారి మధ్యలో ఇరుక్కుపోయాడు. దీంతో గమనించిన రైల్వే సిబ్బంది ఫ్లాట్ ఫామ్‌ను బద్దలు కొట్టి అతడిని రక్షించారు. ఆ వ్యక్తికి ఏమి కాకపోవడంతో రైల్వే సిబ్బంది ప్రయాణకులు అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. 

News June 12, 2024

ప.గో: అలరించిన పవన్ కళ్యాణ్ చిత్రం

image

నరసాపురం పట్టణం రుస్తుంబాదకు చెందిన మైక్రో ఆర్టిస్ట్, చిత్రకారుడు కొప్పినీడి విజయ్ మోహన్ తన ప్రతిభను చూపించారు. తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ విజయవాడలో మంత్రిగా ప్రమాణం చేసిన సందర్భంగా వాటర్ కలర్స్ ఉపయోగించి చిత్రాన్ని గీశాడు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి తాలూకా అని ప్రత్యేకంగా రాశారు. ఈ చిత్రాన్ని గీసిన విజయ్ మోహన్‌ను పలువురు అభినందించారు.

News June 12, 2024

గుండెపోటుతో గరగపర్రు వీఆర్వో మృతి

image

పాలకోడేరు మండలం గరగపర్రు వీఆర్వోగా పని చేస్తున్న సంపద స్వామి నాయుడు (48) బుధవారం గుండెపోటుతో మృతి చెందారు. రెండు రోజుల క్రితం ఆయనకు మైల్డ్ స్ట్రోక్ రావడంతో భీమవరంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బుధవారం స్ట్రోక్ ఎక్కువే మృతి చెందడం జరిగింది. దీనిపై వీఆర్వోల సంఘం, భీమవరం ఎమ్మార్వో ఆర్ఐలు తమ సంతాపం వ్యక్తం చేశారు.

News June 12, 2024

ఏలూరు కలెక్టరేట్ ఆవరణలో జాబ్ మేళా

image

కలెక్టరేట్ ఆవరణలో జూన్ 15వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నామని జిల్లా ఉపాధి అధికారి వరలక్ష్మి బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 2 ప్రైవేటు సంస్థలలో ఉద్యోగాలు కలవన్నారు. ఆసక్తిగల 8వ తరగతి, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ పాసైన 35 సంవత్సరాల లోపు వారు జాబ్ మేళాలో పాల్గొనాలన్నారు. జీతం రూ 11 వేల నుంచి 13 వేల వరకు ఉంటుందన్నారు. ఉద్యోగం సాధించిన వారికి భోజనం, వసతి కలదన్నారు.

News June 12, 2024

ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలను ప్రోత్సహించాలి: సుమిత్

image

ప.గో జిల్లా భీమవరం కలెక్టర్ కార్యాలయంలో బుధవారం కలెక్టర్ సుమిత్ కుమార్ జిల్లాలోని పీహెచ్సీల వైద్య అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రిలో నూరు శాతం డెలివరీలు జరగాలని, తక్కువగా డెలివరీలు జరుగుతున్న ఆస్పత్రులను సమీక్షించుకొని తగిన చర్యలు తీసుకోవాలని డీఎం అండ్ హెచ్‌ఓకు సూచించారు. పేషెంట్ల నుంచి అభిప్రాయ సేకరణ తీసుకోవాలని అన్నారు. 

News June 12, 2024

ప.గో.: నాడు కొవ్వూరులో ఓటమి.. నేడు మంత్రిగా

image

2019 అసెంబ్లీ ఎన్నికల్లో కొవ్వూరు నియోజకవర్గంలో టీడీపీ నుంచి బరిలో నిలిచిన వంగలపూడి అనిత 25248 ఓట్ల తేడాతో ఓటమి చెందారు. కాగా తాజా ఎన్నికల్లో అనకాపల్లి జిల్లా పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కూటమి తరఫున బరిలో నిలిచి 1,20,042 ఓట్లు సాధించి 43727 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. రాష్ట్ర మంత్రి వర్గంలో స్థానం సంపాదించుకున్నారు.

News June 12, 2024

కందుల దుర్గేశ్ అను నేను..

image

రాష్ట్ర మంత్రిగా నిడదవోలు MLA కందుల దుర్గేశ్ ప్రమాణ స్వీకారం చేశారు. గన్నవరం మండలంలోని కేసరపల్లిలో ఆయనతో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంలో జిల్లాకు చెందిన ఆయన అభిమానులు, జన సైనికులు, వీరమహిళలు నినాదాలు చేశారు.

News June 12, 2024

నిమ్మల రామానాయుడు అను నేను..

image

రాష్ట్ర మంత్రిగా ప.గో. జిల్లా పాలకొల్లు MLA నిమ్మల రామానాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. గన్నవరం మండలం కేసరపల్లిలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ సందర్భంలో జిల్లాకు చెందిన ఆయన అభిమానులు, టీడీపీ కార్యకర్తలు, నాయకులు నినాదాలు చేశారు.

News June 12, 2024

ప.గో.: 35 ఏళ్ల తర్వాత.. నిమ్మల రికార్డ్

image

గత ఎన్నికల్లో ఉమ్మడి ప.గో. జిల్లాలో TDP 2స్థానాల్లో గెలుపొందగా అందులో పాలకొల్లు ఒకటి. 2019లో YCPప్రభంజనంలోనూ నిమ్మల రామానాయుడు 17809 ఓట్ల మెజారిటీతో గెలిచారు. తాజాగా మళ్లీ గెలిచి హ్యాట్రిక్ రికార్డ్ నమోదుచేసి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. అయితే పాలకొల్లు నుంచి 1989లో MLAగా గెలుపొందిన చేగొండి హరిరామ జోగయ్య మంత్రిగా సేవలందించగా.. దాదాపు 35ఏళ్ల తర్వాత ఇక్కడి నుంచి మంత్రి పదవి దక్కినట్లయింది.

News June 12, 2024

ఏలూరు: చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. ఇక్కడ ఫ్రీ చాయ్

image

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిపై ఓ టీ దుకాణ యజమాని తన అభిమానం చాటుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నేడు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా బుధవారం తన షాపులో ఉదయం 10 గంటల వరకు కాఫీ, టీ ఉచితంగా ఇస్తున్నట్లు జంగారెడ్డిగూడేనికి చెందిన ఎం.రాజు తెలిపారు. ఈ మేరకు మంగళవారం దుకాణం (కనక నాగ శివాని టీ స్టాల్) వద్ద బ్యానర్ ఏర్పాటుచేశారు.