WestGodavari

News June 12, 2024

ప.గో. జిల్లా నుంచి ఒక్కరే మంత్రి

image

ఉమ్మడి ప.గో. జిల్లాలోని 15 మంది MLAలలో ఒక్కరికి మంత్రి పదవి దక్కింది. పాలకొల్లు నియోజకవర్గం నుంచి గెలుపొందిన నిమ్మల రామానాయుడు మంత్రిగా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వరుసగా 3 సార్లు విజయం సాధించిన ఆయన హ్యాట్రిక్ MLAగా రికార్డ్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తాజా ఎన్నికల్లో నియోజకవర్గంలో 70 శాతం ఓటింగ్ పొంది.. జిల్లాలోనే అత్యధిక ప్రజాదరణ ఉన్న నేతగానూ గుర్తింపు పొందారు.

News June 12, 2024

నేడే CM ప్రమాణస్వీకారం.. ప.గో. జిల్లాలో ఏర్పాట్లు

image

రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేడు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నూతన మంత్రివర్గం సైతం ఏర్పాటుకానుంది. ఈ నేపథ్యంలో సదరు కార్యక్రమాన్ని వీక్షించేలా.. ఉమ్మడి ప.గో. జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల అధికారులు LED స్క్రీన్లు, టీవీలను ఏర్పాటుచేశారు. మరోవైపు ప్రభుత్వ కార్యాలయాలు ఇప్పటికే విద్యుత్ కాంతులతో సిద్ధం చేశారు.
– మీ వద్ద పరిస్థితి ఏంటి..?

News June 11, 2024

ఏలూరు: వైసీపీ జిల్లా కార్యదర్శి రాజీనామా

image

ఏలూరు జిల్లా వైసీపీ కార్యదర్శి చాటపర్తి పోసిబాబు తన పదవికి రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఓటమి చెందడంతో తీవ్ర మనస్తాపానికి గురై తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాంప్ ఆఫీసుకు పంపించానన్నారు. భవిష్యత్ కార్యాచరణను కార్యకర్తలతో చర్చించి త్వరలో ప్రకటిస్తానని తెలిపారు.

News June 11, 2024

ఏలూరు: ఒకే ఇంట్లో రెండు భారీ పాములు

image

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన ఓ ఇంట్లో రెండు భారీ కోడె నాగులు హల్ చల్ చేశాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురై సమాచారాన్ని స్నేక్స్ సేవియర్ సొసైటీ చదలవాడ క్రాంతికి తెలియజేశారు. వెంటనే ఆయన ఘటనా స్థలానికి చేరుకొని చాకచక్యంగా పాములను పట్టుకున్నారు. అనంతరం వాటిని సురక్షితంగా అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.

News June 11, 2024

వన్ ఫ్రేమ్.. పవన్‌తో ప.గో. జనసేన MLAలు

image

మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో పార్టీ శాసనసభ పక్ష సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. కాగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన జనసేన ఎమ్మెల్యేలు సమావేశానికి హాజరుకాగా పవన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాకు చెందిన MLAలు బొమ్మిడి నాయకర్, పులపర్తి అంజిబాబు, బొలిశెట్టి శ్రీనివాస్, పత్సమట్ల ధర్మరాజు, చిర్రి బాలరాజు ఉన్నారు

News June 11, 2024

శ్రీనివాసవర్మకు టికెట్ ఇచ్చినప్పుడు ఆశ్చర్యపోయా: CBN

image

కార్యకర్తకు తగిన గుర్తింపునిచ్చిన పార్టీ BJP అని, అదే గుర్తింపు TDP, జనసేనలోనూ కొనసాగుతోందని చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ.. నరసాపురం MPగా గెలిచి కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన భూపతిరాజు శ్రీనివాసవర్మ ఓ కార్యకర్త స్థాయి నుంచి వచ్చారని గుర్తుచేశారు. శ్రీనివాస వర్మకు BJP ఎంపీ టికెట్ ఇచ్చినప్పుడు ఆశ్చర్యమేసిందని, అయితే.. పార్టీ కోసం ఆయన పడిన కష్టం తర్వాత తెలిసిందన్నారు.

News June 11, 2024

ప.గో: అమాత్యయోగం ఎవరికో..?

image

ఉమ్మడి ప.గో జిల్లా నుంచి మంత్రి పదవి ఆశావహులు ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. బీసీ కోటాలో పితాని సత్యనారాయణ, హ్యాట్రిక్ MLA నిమ్మల రామానాయుడు, ఉండి MLA రఘురామకు అమాత్యయోగం ఉన్నట్లు తెలుస్తోంది. ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ ప్రాతిపదికన ఫైర్ బ్రాండ్ MLA చింతమనేని పేరు, BJP కోటాలో కైకలూరు MLA కామినేని శ్రీనివాస్, జనసేన నుంచి బొలిశెట్టి, పులపర్తి రామాంజనేయులు పేర్లు ప్రచారంలో ఉన్నాయి.

News June 11, 2024

రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌ అభివృద్ధిపై కొత్త ఆశలు

image

శ్రీకాకుళం MP రామ్మోహన్ నాయుడికి కేంద్ర విమానయాన శాఖ దక్కడం, ఏపీలో కూటమి గెలవడంతో రాజమండ్రి ఎయిర్‌పోర్ట్ అభివృద్ధిపై ఆశలు చిగురిస్తున్నాయి. ఉభయ గోదావరి జిల్లాలకు ఈ విమానాశ్రయం తలమానికం. దీని విస్తరణతో పాటు రూ.133కోట్లతో టెర్మినల్ భవన నిర్మాణానికి 4ఏళ్ల కిందే మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసినా.. ప్రతిపాదనలకే పరిమితయ్యాయి. తాజాగా తెలుగు వ్యక్తి విమానయాన శాఖ మంత్రి కావడంతో ఆశలకు కొత్త రెక్కలొస్తున్నాయి.

News June 11, 2024

పెనుగొండలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

image

ప.గో జిల్లా పెనుగొండ మండలం దొంగరావిపాలెం జాతీయ రహదారిపై యాక్సిడెంట్ జరిగింది. పోడూరు మండలం జిన్నూరుకు చెందిన వెంకటపతి(75) కత్తి పీటల వ్యాపారం చేస్తుంటాడు. సోమవారం వ్యాపారం నిమిత్తం బైక్‌పై వెళ్తుండగా.. పెరవలి నుంచి రావుపాలెం వెళ్తున్న కారు ఢీ కొట్టింది. తలకు బలమైన గాయం కావడంతో అంబులెన్స్‌లో తణుకు ఆసుపత్రికి తరలించగా వెంకటపతి అప్పటికే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

News June 11, 2024

మాజీ CM జగన్‌ను కలిసిన ప.గో. జిల్లానేతలు

image

పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వైసీపీ నాయకులు మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా రాజకీయాలపై ఆయనతో చర్చించారు. కార్యక్రమంలో MLC కౌరు శ్రీనివాస్, నరసాపురం పార్లమెంట్ వైసీపీ అభ్యర్థిగా పోటీచేసిన గూడూరి ఉమాబాల, ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ డైరెక్టర్ మంతెన యోగేంద్ర కుమార్ తదితరులు ఉన్నారు.