WestGodavari

News June 10, 2024

మాసీ CM జగన్‌ను కలిసిన ప.గో. జిల్లానేతలు

image

పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వైసీపీ నాయకులు మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా రాజకీయాలను ఆయనతో చర్చించారు. కార్యక్రమంలో MLC కౌరు శ్రీనివాస్, నరసాపురం పార్లమెంట్ వైసీపీ అభ్యర్థిగా పోటీచేసిన గూడూరి ఉమాబాల, ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ డైరెక్టర్ మంతెన యోగేంద్ర కుమార్ తదితరులు ఉన్నారు. 

News June 10, 2024

ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయమంత్రిగా నరసాపురం MP

image

నరసాపురం బీజేపీ ఎంపీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు కేంద్రమంత్రి వర్గంలో చోటుదక్కిన విషయం తెలిసిందే. కాగా ఆయనకు ఉక్కు, భారీపరిశ్రమల శాఖ సహాయమంత్రిగా నియమితులయ్యారు. కాగా ఆయన ఇటీవల ఎన్నికల్లో ఆయనకు 7,07,343 ఓట్లు రాగా.. ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి గూడూరి ఉమాబాలపై 2,76,802 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు.

News June 10, 2024

‘MLA సాబ్.. ఉండి గడ్డ TDP అడ్డా’

image

రాష్ట్రంలో కూటమి ఘనవిజయం సాధించడంతో సోమవారం ఉండి మండల టీడీపీ కార్యాలయం నుంచి కూటమి కార్యకర్తలు, నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉండి నియోజకవర్గ అభ్యర్థి రఘు రామకృష్ణరాజుకు అత్యధిక మెజారిటీ అందించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ‘MLA సాబ్.. ఉండి గడ్డ TDP అడ్డా’ అంటూ ఫ్లెక్సీలను ప్రదర్శించారు. ఉండి జనసేన ఇన్‌ఛార్జి జుత్తుగ నాగరాజు, కార్యకర్తలు పాల్గొన్నారు.

News June 10, 2024

ప.గో.: మంత్రి పదవి రేసులో ఎవరు..?

image

రాష్ట్రంలో కూటమి ఘన విజయం సాధించిన నాటి నుంచి జనసేనలో ఎవరికి మంత్రి పదవులు దక్కుతాయని అందరిలో ఆసక్తి నెలకొంది. అయితే ఆ పార్టీ రాష్ట్రంలో 21 స్థానాల్లో విజయం సాధించగా.. అందులో 11 స్థానాలు ఉభయ గోదారి జిల్లాల నుంచే ఉన్నాయి. జనసేనకు 5 మంత్రి పదవులు వస్తాయన్న తాజా టాక్ నేపథ్యంలో గోదారి జిల్లాల్లోని 11 స్థానాల్లో ఎంతమందికి మంత్రి పదవి వరిస్తుందన్నది ఉత్కంఠగా మారింది. మీరు ఏమనుకుంటున్నారు..?

News June 10, 2024

ఏలూరు: గోదావరిలో తల్లీకొడుకు గల్లంతు

image

ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో విషాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. తెలంగాణ రాష్ట్రం అశ్వారావుపేటకు చెందిన పదిమంది సోమవారం మండలంలోని కట్కూరు శివాలయ దర్శనానికి వచ్చారు. అనంతరం గోదావరిలో స్నానం చేస్తుండగా తల్లి అల్లంశెట్టి నాగమణి, కొడుకు తేజ శ్రీనివాసులు గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 10, 2024

వన్నెపూడి ఘటనపై జనసేనాని పవన్ సీరియస్..!

image

కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలంలోని వన్నెపూడి ఘటనను జనసేనాని పవన్ కళ్యాణ్ సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. జనసేన గెలుపునకు శ్రమించిన మాజీ ఎమ్మెల్యే వర్మ కారుపై దాడి జరగడం సరికాదని, ఈ ఘటన వెనుక ఎవరున్నారు..? అనే దానిపై వివరాలు సేకరించాలని పవన్ ఆదేశించినట్లు నేతలు చెబుతున్నారు. వారంలో పవన్ పిఠాపురం రానున్నట్లు ఇప్పటికే నాగబాబు ప్రకటించారు.

News June 10, 2024

ప.గో: డేంజర్ హైవే.. 17 నెలల్లో 104 మంది మృతి

image

ఉమ్మడి ప.గో-తూ.గో జిల్లాను కలుపుతూ గుండుగొలను నుంచి కొవ్వూరు వరకు దాదాపు 70KM పొడవున రూ.1800 కోట్ల వ్యయంతో నిర్మించిన హైవే ప్రమాదాలకు అడ్డాగా మారింది. హైవే ఎక్కాలంటే వాహనదారులు భయపడుతున్నారు. ఈ రూట్‌లో దేవరపల్లి మండలం డేంజర్ స్పాట్. ఈ మార్గంలో 2023 JAN నుంచి 2024 మే వరకు (17 నెలలు) దాదాపు 156 ప్రమాదాలు జరగ్గా.. 104 మంది ప్రాణాలు కోల్పోయారు. 150 మంది గాయాలపాయ్యారు.

News June 10, 2024

అప్పుడు కృష్ణంరాజు.. ఇప్పుడు భూపతిరాజు

image

నరసాపురం MPగా తొలిసారి ఎన్నికైన భూపతిరాజు శ్రీనివాసవర్మను కేంద్ర మంత్రి పదవి వరించింది. ఈ నియోజకవర్గం 1952లో ఆవిర్భవించింది. సినీ నటుడు కృష్ణంరాజు(BJP) తొలిసారి కాకినాడ MPగా గెలవగా.. 1999లో నరసాపురం నుంచి గెలిచి కేంద్ర మంత్రి అయ్యారు. పాలకొల్లుకు చెందిన దర్శకుడు దాసరి నారాయణరావు, మొగల్తూరుకు చెందిన మెగాస్టార్ చిరంజీవి, నరసాపురం కోడలు నిర్మలా సీతారామన్ రాజ్యసభ నుంచి ఎన్నికై కేంద్ర మంత్రిగా చేశారు.

News June 10, 2024

నేడే ‘కల్కి’ ట్రైలర్.. ప.గో జిల్లాలో థియేటర్లు ఇవే

image

ప్రభాస్‌ అభిమానులు‌ ఎంతో‌ ఆతృతగా ఎదురుచూస్తోన్న ‘కల్కి 2898-AD’ ట్రైలర్‌ నేడు విడుదలకానుంది. ఉమ్మడి ప.గో జిల్లా అభిమానుల కోసం పలు థియేటర్లలో‌ సోమవారం 6PMకు ట్రైలర్‌ విడుదల చేస్తున్నారు. భీమవరం-విజయలక్ష్మి, ఏలూరు-శ్రీ బాలాజీ, తణుకు-లక్ష్మీ, తాడెపల్లిగూడెం-లక్ష్మీనారాయణ, నరసాపురం- శ్రీ రాజరాజేశ్వరి, జంగారెడ్డిగూడెం- రాజరాజేశ్వరి థియేటర్‌లలో‌ ట్రైలర్‌ స్కీనింగ్ చేస్తారు. SHARE IT..

News June 9, 2024

ప్రశాంతంగా ముగిసిన లాసెట్ ఎగ్జామ్

image

రాష్ట్రంలోని న్యాయ కళాశాలల్లో ప్రవేశానికి గానూ నిర్వహించే లాసెట్ ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. ఉమ్మడి ప.గో జిల్లా వ్యాప్తంగా పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. తాడేపల్లిగూడెం శ్రీవాసవి ఇంజినీరింగ్ కళాశాలలో 250 మందికి గానూ 205 మంది పరీక్షకు హాజరైనట్లు ప్రిన్సిపల్ డాక్టర్ రత్నాకరరావు తెలిపారు. పరీక్షా కేంద్రం కో-ఆర్డినేటర్ నటరాజ్, సిస్టమ్ అడ్మిన్ సురేష్ పరీక్షా నిర్వహణను పర్యవేక్షించారు.