India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భూపతిరాజు శ్రీనివాసవర్మ 1967లో భీమవరంలో జన్మించారు. తండ్రి సూర్యనారాయణరాజు. తెలుగు, ఇంగ్లిష్, హిందీ భాషల్లో ప్రావీణ్యం ఉంది. ఈయన BJYM జిల్లా అధ్యక్షుడు(1991-95), BJP ప.గో జిల్లా సెక్రెటరీ(1997-99), నరసాపురం పార్లమెంట్ కన్వీనర్(1999-2001), BJP నేషనల్ కౌన్సిలర్ మెంబర్(2001-03)గా చేశారు. 2009లో ఎంపీగా పోటీ, బీజేపీ ఉమ్మడి ప.గో జిల్లా అధ్యక్షుడు(2010-18), 2020 నుంచి బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు.
మండలంలోని బోగోలు గ్రామంలో ఆదివారం ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి అదే గ్రామానికి చెందిన లక్ష్మణ్గా స్థానికులు గుర్తించారు. పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మండలంలోని తూర్పు దిగవల్లి సర్పంచ్ వేణుగోపాల్ రెడ్డి అనుమానాస్పద స్థితిలో ఆదివారం మృతిచెందాడు. కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు రూ.30 కోట్ల వరకు ఎన్నికల బెట్టింగ్ కట్టాడని, అనంతరం కనిపించకుండా పోయాడని అన్నారు. నేడు మల్బరీ షెడ్లో అనుమానస్పదస్థితిలో శవమై కనిపించినట్లు తెలిపారు. ఘటనపై పోలీసులు అనుమానస్పదంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మండలంలోని ధర్భగూడెం గ్రామంలో వీర భద్రస్వామి అనే వ్యక్తి ఆదివారం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ చంద్రశేఖర్ మృతుని వివరాలను సేకరిస్తున్నారు. అనుమానాస్పద స్థితి మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జంగారెడ్డిగూడెం తరలించారు.
మండలంలోని బలుసు గొయ్యపాలెం గ్రామానికి చెందిన సిరి సుష్మ శనివారం నుంచి కనబడడం లేదని ఆమె తండ్రి సువర్ణ రాజు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. సుష్మ శనివారం సాయంత్రం నుంచి కనకబడకపోవడంతో వారి బంధువులు, స్నేహితుల వద్ద కూడా లేదని ఫిర్యాదు చేశారన్నారు. అనంతరం ఘటనపై మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.
మండలంలోని బలుసు గొయ్యపాలెం గ్రామానికి చెందిన సిరి సుష్మ శనివారం నుంచి కనబడడం లేదని ఆమె తండ్రి సువర్ణ రాజు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. సుష్మ శనివారం సాయంత్రం నుంచి కనకబడకపోవడంతో వారి బంధువులు, స్నేహితుల వద్ద కూడా లేదని ఫిర్యాదు చేశారన్నారు. అనంతరం ఘటనపై మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.
పట్టణంలో ఓ వ్యక్తి అనుమానాస్పద మృతిపై శనివారం కేసు చేశామని ఎస్సై వెంకటరమణ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. మొగల్తూరుకు చెందిన పాపయ్య(47) ఆ గ్రామానికి చెందిన ఓ రైతుకు మంగళగుంటపాలెంలో ఉన్న చెరువులో పని చేసేందుకు ఈ నెల 6న వెళ్లారు. ఆ రోజు నుంచి ఇంటికి తిరిగి రాలేదు. ఆయన ఆచూకీ కోసం గాలిస్తుండగా.. మంగళగుంటపాలెం సమీపంలోని మురుగు కాలువలో ఈ నెల 8న మృతదేహం లభ్యమైంది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యప్తు చేపట్టారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం దూరవిద్య అనుబంధ పరీక్షలు(ఓపెన్ పరీక్షలు) ముగిశాయి. శనివారం నిర్వహించిన పదో తరగతి సాంఘిక శాస్త్రం పరీక్షకు 210కి 194 మంది హాజరు కాగా 16 మంది గైర్హాజరయ్యారని డీఈవో నాగమణి తెలిపారు. ఇంటర్మీడియట్ పరీక్షకు మొత్తం 713కి 644 మంది హాజరై 69 మంది హాజరు కాగా గైర్హాజరయ్యారు. 90.32 శాతం మంది విద్యార్థులు హాజరు అయినట్లు చెప్పారు.
పట్టణ పరిధిలో బలుమూరిలోని ఓ బహుళ అంతస్తు భవనంలో చోరీ జరిగింది. సీఐ శ్రీనివాసు కథనం ప్రకారం.. స్థానిక అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న మాలతి తన కుమారుడిని ఇంజినీరింగ్ కళాశాలలో చేర్చేందుకు ఈ నెల 1న హైదరాబాద్ వెళ్లారు. 6న తిరిగి వచ్చేసరికి ఫ్లాట్ తాళం పగులగొట్టి ఉంది. బీరువాలో ఉంచిన 144 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.1.5 లక్షల నగదు చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ప.గో లోక్సభ స్థానంలో15,165 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. అందులో 8,707(57..41%) ఓట్లు కూటమికి పడ్డాయి. వైసీపీకి 5,176(33.13%) ఓట్లు లభించగా.. ఇండియా కూటమికి 1,006(6..63%) మంది మాత్రమే ఓటు వేశారు.
Sorry, no posts matched your criteria.